అన్వేషించండి

Telangana సింగరేణి విషయంపై ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు చెప్పారు: బోయినపల్లి వినోద్ కుమార్

PM Modi Speech in Ramagundam: సింగరేణి అంశంపై, తెలంగాణ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెద్దపల్లి జిల్లా రామగుండంలో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సింగరేణి సంస్థ అంశంపై, తెలంగాణ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత డిసెంబర్ 13న పార్లమెంటు సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తరఫున కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. తెలంగాణలోని కోల్ బ్లాకులను బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్నామని స్పష్టంగా చెప్పారు. అయితే తెలంగాణలో ఉన్న ఈ కోల్ బ్లాకులను తమకే అప్పగించాలని సింగరేణి సంస్థ చేసిన విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారని ఈ సందర్భంగా వినోద్ కుమార్ తెలిపారు.

ప్రహ్లాద్ జోషి పార్లమెంటులో చెప్పింది అబద్ధమా..?
ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ రామగుండం సభలో చెప్పింది నిజమా..? అన్న విషయం తేలాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు అని వినోద్ కుమార్ ప్రధాని మోదీని ప్రశ్నించారు. సింగరేణి విషయంపై నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చి పచ్చి అబద్ధాలు చెప్పారని అన్నారు. పార్లమెంట్ సభలో గత డిసెంబర్ 13న కోల్ బ్లాకులను విక్రయిస్తున్నామని అందుకు బహిరంగ టెండర్లు పిలిచారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి మీ సమక్షంలో చెప్పింది నిజమా, లేక రామగుండం సభలో ప్రధానమంత్రి హోదాలో మీరు చెప్పింది నిజమా స్పష్టం చేయాలని వినోద్ కుమార్ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోల్ బ్లాకులను తమకే ఇవ్వాలని సింగరేణి సంస్థ చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తిరస్కరించింది వాస్తవం కాదా అని వినోద్ కుమార్ ప్రశ్నించారు. కళ్యాణ ఖని బ్లాక్ - 6, కోయగూడెం బ్లాక్ -lll, సత్తుపల్లి బ్లాక్ -lll, పల్లి శ్రావణ్ పల్లి కోల్ బ్లాకులను విక్రయించేందుకు బహిరంగ టెండర్ పిలిచింది వాస్తవం కాదా అని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని ఆయన నిలదీశారు. రామగుండ ఎరువుల కర్మాగారాన్ని జాతీయం చేసిన ప్రధాని మోదీ అనంతరం పాల్గొన్న సభలో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడడం సంస్కారం కాదన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే రామగుండం సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు తప్ప అందులో ఏమాత్రం నిజం లేదని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ 1957 ప్రకారం కోల్ మైన్స్ బ్లాక్ లోను బహిరంగ టెండర్ ద్వారా విక్రయించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని నిండు పార్లమెంట్ సభలో మీ సమక్షంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పింది వాస్తవం కాదా కావాలనుకుంటే పార్లమెంటు రికార్డ్స్ లో ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా ప్రధాని మోదీకి ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ సూచించారు.

నోటికి వచ్చినట్లు తప్పుడు ప్రచారం చేసి ప్రజలకు ముఖ్యంగా సింగరేణి కార్మికులకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం నరేంద్ర మోదీ చేయడం ప్రధాన మంత్రి హోదాకు సరితూగదని వినోద్ కుమార్ పేర్కొన్నారు. సింగరేణి కార్మికులు సమ్మె చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పార్లమెంట్ లో సింగరేణి విషయంపై జవాబు ఇచ్చారని, ఈ అంశం పార్లమెంటు రికార్డ్స్ లో ఉందని వినోద్ కుమార్ వివరించారు. ఇకనైనా అవాస్తవాలు ప్రచారం చేయడం మానేయాలంటూ కేంద్రం పెద్దలకు సలహా ఇచ్చారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Telangana RTC Protest : మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
RGUKT Admissions 2026: తెలంగాణ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు సందడి షురూ! 2026-27 విద్యాసంవత్సర షెడ్యూల్ విడుదల!
తెలంగాణ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు సందడి షురూ! 2026-27 విద్యాసంవత్సర షెడ్యూల్ విడుదల!
Telangana Tenth Class Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Iran War Updates: దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
Embed widget