అన్వేషించండి

Telangana సింగరేణి విషయంపై ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు చెప్పారు: బోయినపల్లి వినోద్ కుమార్

PM Modi Speech in Ramagundam: సింగరేణి అంశంపై, తెలంగాణ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెద్దపల్లి జిల్లా రామగుండంలో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సింగరేణి సంస్థ అంశంపై, తెలంగాణ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత డిసెంబర్ 13న పార్లమెంటు సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తరఫున కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. తెలంగాణలోని కోల్ బ్లాకులను బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్నామని స్పష్టంగా చెప్పారు. అయితే తెలంగాణలో ఉన్న ఈ కోల్ బ్లాకులను తమకే అప్పగించాలని సింగరేణి సంస్థ చేసిన విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారని ఈ సందర్భంగా వినోద్ కుమార్ తెలిపారు.

ప్రహ్లాద్ జోషి పార్లమెంటులో చెప్పింది అబద్ధమా..?
ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ రామగుండం సభలో చెప్పింది నిజమా..? అన్న విషయం తేలాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు అని వినోద్ కుమార్ ప్రధాని మోదీని ప్రశ్నించారు. సింగరేణి విషయంపై నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చి పచ్చి అబద్ధాలు చెప్పారని అన్నారు. పార్లమెంట్ సభలో గత డిసెంబర్ 13న కోల్ బ్లాకులను విక్రయిస్తున్నామని అందుకు బహిరంగ టెండర్లు పిలిచారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి మీ సమక్షంలో చెప్పింది నిజమా, లేక రామగుండం సభలో ప్రధానమంత్రి హోదాలో మీరు చెప్పింది నిజమా స్పష్టం చేయాలని వినోద్ కుమార్ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోల్ బ్లాకులను తమకే ఇవ్వాలని సింగరేణి సంస్థ చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తిరస్కరించింది వాస్తవం కాదా అని వినోద్ కుమార్ ప్రశ్నించారు. కళ్యాణ ఖని బ్లాక్ - 6, కోయగూడెం బ్లాక్ -lll, సత్తుపల్లి బ్లాక్ -lll, పల్లి శ్రావణ్ పల్లి కోల్ బ్లాకులను విక్రయించేందుకు బహిరంగ టెండర్ పిలిచింది వాస్తవం కాదా అని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని ఆయన నిలదీశారు. రామగుండ ఎరువుల కర్మాగారాన్ని జాతీయం చేసిన ప్రధాని మోదీ అనంతరం పాల్గొన్న సభలో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడడం సంస్కారం కాదన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే రామగుండం సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు తప్ప అందులో ఏమాత్రం నిజం లేదని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ 1957 ప్రకారం కోల్ మైన్స్ బ్లాక్ లోను బహిరంగ టెండర్ ద్వారా విక్రయించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని నిండు పార్లమెంట్ సభలో మీ సమక్షంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పింది వాస్తవం కాదా కావాలనుకుంటే పార్లమెంటు రికార్డ్స్ లో ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా ప్రధాని మోదీకి ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ సూచించారు.

నోటికి వచ్చినట్లు తప్పుడు ప్రచారం చేసి ప్రజలకు ముఖ్యంగా సింగరేణి కార్మికులకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం నరేంద్ర మోదీ చేయడం ప్రధాన మంత్రి హోదాకు సరితూగదని వినోద్ కుమార్ పేర్కొన్నారు. సింగరేణి కార్మికులు సమ్మె చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పార్లమెంట్ లో సింగరేణి విషయంపై జవాబు ఇచ్చారని, ఈ అంశం పార్లమెంటు రికార్డ్స్ లో ఉందని వినోద్ కుమార్ వివరించారు. ఇకనైనా అవాస్తవాలు ప్రచారం చేయడం మానేయాలంటూ కేంద్రం పెద్దలకు సలహా ఇచ్చారు.

టాప్ హెడ్ లైన్స్

IND vs ENG Highlights: మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
Kadiri Crime News: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Kadiri Crime News: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs ENG Highlights: మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
Kadiri Crime News: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Kadiri Crime News: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Pawan Kalyan: అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Embed widget