అన్వేషించండి

CM KCR Speech: ధరణి తీసేస్తే రైతుబంధు, రైతుబీమా కూడా పోతాయి - కేసీఆర్ కీలక కామెంట్స్

CM KCR Speech at Nirmal: నిర్మల్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్‌పై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ వస్తే ధరణి తీసేస్తారని, రైతుబంధు ఉండదని తెలిపారు.

CM KCR Speech: ప్రతీ పార్టీ చరిత్ర చూడాలని, ఏ పార్టీ గెలిస్తే లాభమో చూడాలని ఓటర్లకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రజలకు ఏ పార్టీ ఏం చేసిందో చూడాలని, బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కులు కాపాడేందుకు అని అన్నారు. రైతుబంధు వేస్ట్ అని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని, రైతుబంధుపై రకరకాలుగా కాంగ్రెస్ మాట్లాడుతుందని అన్నారు. రైతుబంధు పదం పుట్టిందే కేసీఆర్ నోట్లో నుంచి అని, రైతుబంధు ఓట్ల కోసం కాదని తెలిపారు. రైతులకు భిక్షం వేస్తున్నామన్నట్లు మాట్లాడుతున్నారని, రైతుబంధు ఉండాలా? వద్దా? అని ప్రజలను ప్రశ్నించారు. ఎన్నికల్లో వ్యక్తులు, కార్యదక్షతను చూడాలని సూచించారు. నిర్మల్‌లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. 'వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ సరిపోతుందా..? తాము 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. 15 ఏళ్లు నిర్విరామంగా పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. పదేళ్లు బీఆర్ఎస్‌ను ఆశీర్వదించారు. తెలంగాణ రాకపోతే నిర్మల్ జిల్లా అయ్యేదా? నిర్మల్ జిల్లా కావాలని ఇంద్రకరణ్ రెడ్డి తపనపడ్డారు. నిర్మల్‌కు మెడికల్ కాలేజీ వస్తుందని ఏనాడైనా అనుకున్నామా? ఇంద్రకరణ్ రెడ్డి మెజార్టీ 80 వేలు దాటాలి. పదేళ్లుగా శాంతియుతంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నాం. దేశంలోనే మొదటిసారిగా దళితబంధు తీసుకొచ్చాం' అని తెలిపారు.

'ఈసీ అనుమతిస్తే ఇప్పుడే రైతు రుణమాఫీ పూర్తి చేస్తాం. రైతుబంధు దుబారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. రైతులకు 3 గంటల కరెంట్ చాలని రేవంత్ రెడ్డి అంటున్నారు.  ధరణి తీసేస్తే రైతుబంధు, రైతుబీమా కూడా పోతాయి. నష్టం వచ్చినా రైతుల పంట కొంటున్నాం. ధరణి  తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తుంది. గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చాం. అభివృద్ది కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ గెలవాలి. కేసీఆర్ ఉన్నంతవరకు తెలంగాణ సెక్యూలర్‌గా ఉంటుంది. తెలంగాణలో ఇవాళ 3 కోట్ల టన్నుల ధాన్యం పండుతోంది. ధాన్యం దిగుబడిలో త్వరలోనే తెలంగాణ రాష్ట్రం పంజాబ్‌ను అధిగమిస్తుంది. ప్రజల ఆకాంక్ష్లలు నెరవేర్చే పార్టీ గెలవాలి. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం.. ఆ వజ్రాయుధాన్ని సరిగ్గా వాడాలి' అని కేసీఆర్ స్పష్టం చేశారు.

అన్ని పార్టీల అభ్యర్థుల గురించి తెలుసుకోవాలని, ఎవరు గెలిస్తే మంచిదో గమనించి ఓటు వేయాలని కేసీఆర్ సూచించారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దని, అన్నీ ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు. రైతులకు సాయం చేయాలని ఎవరూ ఆలోచించలేదని, తమ పార్టీనే ఆలోచించిందని అన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేశారని, రాష్ట్రంలో హింసకు తావులేదని తెలిపారు. ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ము లేకనే కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ సారి కూడా బీఆర్ఎస్‌ను ఆదరించాలని కోరారు. కాగా కేసీఆర్ వరుస బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తోన్నారు. కాంగ్రెస్ టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు. బీజేపీని కేసీఆర్ టార్గెట్ చేయడం లేదు. దీనిని బట్టి చూస్తే కాంగ్రెస్సే తమకు పోటీ అని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Viral Video: వీడియో కాల్‌లోనే కడసారి చూపులు - క్షీణిస్తున్న మానవ సంబంధాలపై సజ్జనార్ ఆవేదన
వీడియో కాల్‌లోనే కడసారి చూపులు - క్షీణిస్తున్న మానవ సంబంధాలపై సజ్జనార్ ఆవేదన
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Mancherial MLA Prem Sagar Rao: అవినీతి ఆరోపణలపై మంచిర్యాల ఎమ్మెల్యే సవాల్ - సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆగ్రహం
అవినీతి ఆరోపణలపై మంచిర్యాల ఎమ్మెల్యే సవాల్ - సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆగ్రహం

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget