By: ABP Desam | Updated at : 17 Aug 2021 12:50 AM (IST)
టీ 20 ప్రపంచకప్
ప్రపంచంలోని క్రికెట్ అభిమానులకు గుడ్న్యూస్. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న T20 ప్రపంచకప్ షెడ్యూల్ని ICC రేపు (ఆగస్టు 17న) అధికారికంగా ప్రకటించనుంది.
ఒకే గ్రూప్లో భారత్, పాకిస్థాన్
యూఏఈ, ఒమన్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు T20 ప్రపంచకప్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ICC ప్రపంచకప్ 2021 డ్రాను విడుదల చేసింది. ర్యాంకింగ్స్ ఆధారంగా మొత్తం ఎనిమిది జట్లు నేరుగా ప్రపంచకప్కు అర్హత సాధించగా, మరో ఎనిమిది జట్లు క్వాలిఫయర్స్ బెర్త్ ఖరారు చేసుకున్నాయి. రెండు రౌండ్లుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. తొలి రౌండ్లో క్వాలిఫయర్ మ్యాచ్లు నిర్వహించనున్నారు. రెండో రౌండ్లో సూపర్-12 పద్దతిలో లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి.
12 దేశాలను రెండు గ్రూప్లుగా విభజించారు. ఇక టోర్నీ లీగ్ దశలోనే భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఒకే గ్రూప్లో ఉన్నాయి. గ్రూప్ 2లో భారత్, పాకిస్థాన్తో పాటు న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ ఉండగా.. మరో రెండు దేశాలు క్వాలిఫయర్స్ మ్యాచ్లు ఆడి చోటు దక్కించుకోనున్నాయి.
ఇక డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా గ్రూప్ - 1లో ఉన్నాయి. క్వాలిఫయర్స్ ఆడిన రెండు దేశాలు ఈ గ్రూప్లో చేరనున్నాయి. టీమ్ ర్యాంకింగ్స్ ద్వారా గ్రూప్లను విభజించినట్లు ఐసీసీ ప్రకటించింది. '2021 మార్చి 20 నాటి టీమ్ ర్యాంకింగ్స్ ఆధారంగా గ్రూప్స్ను విభజించడం జరిగింది. శ్రీలంక, బంగ్లాదేశ్తో పాటు మొత్తం 8 జట్లు క్వాలిఫయర్స్ మ్యాచ్లు ఆడనున్నాయి. ఈ క్వాలిఫయర్స్ మ్యాచ్లను కూడా రెండు గ్రూపులుగా విభజించడం జరిగింది. ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమిబియా, శ్రీలంక గ్రూప్-ఏలో ఉండగా.. ఓమన్, స్కాట్లాండ్, పీఎన్జీ, బంగ్లాదేశ్ గ్రూప్బీలో ఉన్నాయి.'అని ఐసీసీ తమ ప్రకటనలో పేర్కొంది.
భారత్-పాక్ మధ్య నెలకొన్న సరిహద్దుల ఉద్రిక్తతల కారణంగా ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదన్న విషయం తెలిసిందే. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఈ రెండు జట్లు తలపడతాయి. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత మరోసారి భారత్-పాక్లు టీ20 ప్రపంచకప్ లీగ్ దశలోనే తలపడనున్నాయి.
అక్టోబరు 24న భారత్Xపాకిస్థాన్
అక్టోబర్ 24 న భారత్, పాకిస్థాన్ ల మధ్య మ్యాచ్ ఉంటుందని ఐసీసీ ప్రతినిధి గతంలో వెల్లడించారు. దీనిపై రేపు అధికారిక ప్రకటన రానుంది. దుబాయ్ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనున్నట్లు సమాచారం. గత రెండేళ్లుగా ఇండియా, పాకిస్ధాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్లు జరగలేదు. 2019 వన్డే వరల్డ్ కప్లో ఇరు జట్లు చివరిసారిగా తలపడ్డాయి. మళ్లీ రెండేళ్ల తర్వాత టీ-20 ప్రపంచకప్లో దాయాదులు తలపడనున్నారు. దీంతో, ఈ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
IPL 2022, Qualifier 1 Preview: ఫైనల్స్ మొదటి బెర్త్ ఎవరిది? - టైటాన్స్, రాయల్స్ బలాబలాలు ఎలా ఉన్నాయి?
Ind vs Pak, Hockey Asia Cup: చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పాక్ - మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్!
SRH Vs PBKS Highlights: ఐపీఎల్ను ఓటమితో ముగించిన రైజర్స్ - ఐదు వికెట్లతో పంజాబ్ విజయం!
SRH Vs PBKS: తడబడ్డ సన్రైజర్స్ - పంజాబ్ ముందు ఈజీ టార్గెట్!
IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్లు ఎప్పుడు ?
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
Shekar Movie: శేఖర్ సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్!
Revanth Reddy : అధికారంలోకి రాగానే మల్లారెడ్డిని జైలుకు పంపిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hyundai New Car: రూ.7 లక్షలలోపే హ్యుండాయ్ కొత్త కారు - ఎలా ఉందో చూశారా?