అన్వేషించండి

వైసీపీ నేతల ఆశలపై నీళ్లు చల్లిన జగన్

వారసులను పార్టీలోకి తీసుకురావడానికి స్వాగతిస్తూనే అవగాహన లేకుండా ఎన్నికల బరిలోకి దింపడం సరైన నిర్ణయం కాదని సూచించారట. అలాగే ప్రజలకు కూడా మరోసారి జగన్‌ పాలన ఎలా ఉంటుందో చూడమని కోరుతున్నారట.

ఒక్క మాటతో అందరికీ క్లారిటీ ఇచ్చేశారు ఏపీ సిఎం జగన్‌. ఇంతకీ ఏంటా మాట అంటే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఎవరికి ఇస్తాను.. ఎలా ఇస్తాను అన్న విషయంతోపాటు వారసుల రాకపై కూడా స్పష్టంగా చెప్పేశారని అంటున్నారు రాజకీయవిశ్లేషకులు. పార్టీ నేతలకే కాదు ప్రజలకు కూడా ఏపీ సిఎం మరోసారి తన పాలనపై స్పష్టత నిచ్చారంటున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వారసులను దింపాలనుకున్న పార్టీ నేతల ఆశలను వైసీపీ అధినేత జగన్‌ నిరాశపర్చారని వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రులు, ఎమ్మేల్యేలు, పార్టీ నేతలతో సమావేశమైన జగన్‌ వారసుల రాజకీయ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశారని తెలుస్తోంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పార్టీ నేతల్లో చాలామంది తమ కుటుంబసభ్యులను రంగంలోకి దింపుతున్నారు. కొడుకులను ఇంటింటికి పంపించి ప్రభుత్వ పాలన, పథకాల గురించి వివరాలు సేకరిస్తున్నారు. అలా తమ వారసులను ఇండైరక్ట్‌గా ఇటు ప్రజలు అటు జగన్‌కి తెలిసేలా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైసీపీ నేతలు వాడుకుంటున్నారు. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వారసులకు టిక్కెట్లు ఇప్పించుకొని వారి వెనక నుంచి రాజకీయం నెరపాలని భావించారు కొందరు నేతలు. ఈ విషయం తెలసుకున్న జగన్ సమయం చూసి పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇచ్చారు. వారసులను రంగంలోకి దింపినా వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చేది లేదనే విషయాన్ని ఆయన కూడా ఇండైరక్ట్‌గా చెప్పినట్లు తెలుస్తోంది. పనితీరుని మెరుగుపర్చుకొని, ప్రజలతో మమేకమైన వారికే టిక్కెట్లు ఇస్తానని, తనకి ఎంత దగ్గరవారైన సరే పని చేయకపోతే టిక్కెట్లు ఇచ్చేది లేదని ఈ సమావేశంలో స్పష్టం చేశారట.

పేర్నినాని, బుగ్గన కొడుకులను వచ్చే ఎన్నికల్లో పోటీలోకి దింపాలనే ఆలోచనని జగన్‌కి ముందుగానే చెప్పారు. ఈ మధ్యనే సజ్జల కొడుక్కి సోషల్‌ మీడియా బాధ్యతలు అప్పజెప్పడంతో వీరు కూడా తమ వారసులను ప్రజల్లోకి పంపిస్తూ జగన్‌కి గొప్పగా పరిచయం చేసి తద్వారా ఎన్నికల బరిలోకి దింపాలని భావించారు. ఇప్పుడు ఆ ఆశలపై జగన్‌ నీళ్లు చల్లారట. 2024 ఎన్నికల్లో మీరే నిలబడాలని మీ వారసులను దించవద్దని కాస్తంత గట్టిగానే చెప్పారట. 

వారసులను పార్టీలోకి తీసుకురావడానికి స్వాగతిస్తూనే అవగాహన లేకుండా ఎన్నికల బరిలోకి దింపడం సరైన నిర్ణయం కాదని సూచించారట. అలాగే ప్రజలకు కూడా మరోసారి జగన్‌ పాలన ఎలా ఉంటుందో చూడమని కోరుతున్నారట. మంత్రులు, ఎమ్మెల్యేలు సరిగ్గా పని చేస్తేనే ఓటు వేయండి అని చెబుతూ నీతివంతనపాలనే మా ధ్యేయమన్న విధంగా ప్రజల్లోకి ఈ సమావేశం ద్వారా చెప్పినట్లు రాజకీయవిశ్లేషకులు చెబుతున్నారు.

ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా ఇలా అధికారపార్టీ మంత్రులు, ఎమ్మేల్యేలను ఇంటింటికి పంపి పథకాలు, పాలన గురించి అడిగింది లేదని సంబరపడుతున్నాయి  వైసీపీ శ్రేణులు. ప్రజాసేవంటే కాలపేక్షం కాదని బాధ్యతాయుతమైన పని అని తెలియజేయడానికే జగన్‌ ఈ విధంగా పార్టీ నేతలకు చెప్పడంలో తప్పులేదంటున్నారు అభిమానులు. మరోవైపు జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలను ఎదరించి చెప్పలేక వైసీపీ నేతలు సతమతమవతున్నారని, టిక్కెట్‌ రాని వారు పార్టీ మారే ఆలోచనలు చేస్తున్నారన్న టాక్‌ కూడా వినిపిస్తోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Candidates Assets: ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
Duvvada Srinivas: టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
Weather Latest Update: తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Loksabha Elections 2024 | వీళ్లకు రెండు రాష్ట్రాల్లో రెండు ఓట్లు ఉంటాయి..కానీ.! | ABP DesamHappy Days Rerelease Public Talk | హ్యాపీడేస్ సినిమా రీరిలీజ్ తో థియేటర్ల దగ్గర యూత్ సందడి | ABPAsaduddin Owaisi vs Raja singh | బీఫ్ షాపు జిందాబాద్ అన్న ఓవైసీ.. ఫైర్ అవుతున్న రాజాసింగ్ | ABPJagapathi Babu on Vijayendra Prasad | Ruslaan మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో జగపతిబాబు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Candidates Assets: ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
Duvvada Srinivas: టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
Weather Latest Update: తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
War 2 Update: 'వార్‌ 2' కోసం రంగంలోకి హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ - థియేటర్లో ఎన్టీఆర్‌ విశ్వరూపమే..!
'వార్‌ 2' కోసం రంగంలోకి హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ - థియేటర్లో ఎన్టీఆర్‌ విశ్వరూపమే..!
Tillu Square OTT Release Date: టిల్లన్న పాన్ ఇండియా సక్సెస్ కొడతాడా? ఓటీటీల్లో కామెడీ ఫిలిమ్స్ ట్రెండ్ మారుస్తాడా?
టిల్లన్న పాన్ ఇండియా సక్సెస్ కొడతాడా? ఓటీటీల్లో కామెడీ ఫిలిమ్స్ ట్రెండ్ మారుస్తాడా?
KL Rahul Comments On Dhoni: ధోనీ మా బౌలర్లను భయపెట్టాడు- చెన్నైతో మ్యాచ్‌లో
ధోనీ మా బౌలర్లను భయపెట్టాడు- చెన్నైతో మ్యాచ్‌లో "కేక్‌" వాక్ చేసిన రాహుల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Andhra Pradesh News: ధర్మానను లక్ష్మీదేవి ఆశీర్వదించారా? శ్రేణులకు హింట్ ఇచ్చారా?
ధర్మానను లక్ష్మీదేవి ఆశీర్వదించారా? శ్రేణులకు హింట్ ఇచ్చారా?
Embed widget