అన్వేషించండి

Andhra News: 'అక్రమ కేసులు, అరెస్టులకు భయపడేది లేదు' - వైసీపీపై పోరాటం సాగిస్తామన్న టీడీపీ ఎన్ఆర్ఐ కార్యకర్త యశస్వి

TDP NRI Arrest: వైసీపీ ప్రభుత్వ అక్రమ కేసులకు, అరెస్టులకు భయపడేది లేదని టీడీపీ ఎన్ఆర్ఐ కార్యకర్త యశస్వి తెలిపారు. తన తల్లి అనారోగ్యంతో ఉంటే చూసేందుకు వస్తే తనను అరెస్ట్ చేశారని మండిపడ్డారు.

TDP NRI Yashaswi Comments on Ycp Government: వైసీపీ ప్రభుత్వం (Ysrcp Government) తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసినా భయపడేది లేదని,  పోరాటం కొనసాగిస్తానని టీడీపీ ఎన్ఆర్ఐ కార్యకర్త (TDP NRI Arrest) బొద్దులూరి యశస్వి (Bodduluru Yasaswi) (యష్) తెలిపారు. ఏపీ సీఐడీ పోలీసులు (AP CID Police) ఎయిర్ పోర్టులోనే తనను అరెస్టు చేయడంపై ఆయన మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించినందుకు గత నాలుగేళ్లలో దాదాపు ఐదుసార్లు తెనాలిలోని తన ఇంటిపై దాడి చేశారని చెప్పారు. తల్లికి ఆరోగ్యం బాగా లేదని, చూసేందుకు అమెరికా నుంచి వచ్చానని చెప్పినా సీఐడీ పోలీసులు వినిపించుకోలేదని వాపోయారు. లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి తనను 4 గంటలకు పైగా శంషాబాద్ విమానాాశ్రయంలోనే ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం గుంటూరు కార్యాలయానికి తరలించారని చెప్పారు. 'ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడుతున్నందుకు మా గొంతు నొక్కి భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారు. కానీ మా పోరాటం ఎప్పటికీ ఆగదు. సీఎం జగన్ అభివృద్ధి, రాజధాని అంశాలపై దృష్టి పెట్టకుండా ప్రశ్నించిన వారి గొంతు నొక్కాలని చూస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా ఉందో ప్రజలంతా ఆలోచించాలి. తల్లికి ఆరోగ్యం బాగాలేదన్నా సీఐడీ పోలీసులు కనికరించలేదు. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు. ప్రజలంతా వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పట్టం కట్టాల్సిన అవసరం ఉంది.' అని పేర్కొన్నారు.

ఇదీ జరిగింది

వృత్తి రీత్యా అమెరికాలో ఉంటున్న టీడీపీ ఎన్ఆర్ఐ కార్యకర్త బొద్దులూరి యశస్వి (యష్) అనారోగ్యంతో బాధ పడుతున్న తన తల్లిని పరామర్శించేందుకు హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో ఏపీ సీఐడీ పోలీసులు ఎయిర్ పోర్టులోనే ఆయన్ను చుట్టుముట్టారు. తమ వెంట రావాలని చెప్పగా, తన తల్లికి బాగాలేకపోతే చూసేందుకు వచ్చానని చెప్పినా వినిపించుకోలేదు. ఆయన్ని అదుపులోకి తీసుకుని గుంటూరు (Guntur) సీఐడీ కార్యాలయానికి తరలించారు. వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్ (CM Jagan) కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. అనంతరం 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులిచ్చి విడుదల చేశారు. 2024, జనవరి 11న తిరుపతి (Tirupati) సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి రావాలని నోటీసులు జారీ చేశారు.

టీడీడీ నేతల ఆగ్రహం

కాగా, సీఐడీ పోలీసుల తీరును టీడీపీ నేతలు ఖండించారు. సీఎం జగన్ అక్రమ అరెస్టులపై కాదని, అంగన్వాడీల సమస్యలపై దృష్టి సారించాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. యశ్ ను అరెస్ట్ చేయటానికి పెట్టిన శ్రద్ధ ఇంటి పక్కన నిరసనలు చేస్తున్న అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేందుకు కనీసం సమయం పెట్టలేదని మండిపడ్డారు. ఇటువంటి చర్యలతో జగన్ ప్రభుత్వ విధానాలేంటో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అటు, నారా లోకేశ్ సైతం యశస్విపై సీఐడీ తీరును తప్పుబట్టారు. 'ప్రశ్నించే గొంతుకలను నిర్బంధాల ద్వారా వైసీపీ ప్రభుత్వం అణచివేయాలని చూస్తోంది. న్యాయం జరిగే వరకూ విశ్రమించబోం. వైసీపీకి చివరి రోజులు దగ్గర పడ్డాయి.' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యష్ అరెస్టుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. సీఎం జగన్ సైకోయిజానికి యష్ అరెస్ట్ నిదర్శనమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రభుత్వ తప్పులు, అవినీతిని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా.? అని నిలదీశారు. వైసీపీ నియంతృత్వ పోకడలకు మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. భవిష్యత్ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. 

Also Read: Undavalli Arunkumar : ఎమ్మెల్యేల కంటే వాలంటీర్లకే ఎక్కువ అధికారం - జగన్ తీరుపై ఉండవల్లి హాట్ కామెంట్స్

టాప్ హెడ్ లైన్స్

హైదరాబాద్‌లో ఎబోలా టెన్షన్.. సూడాన్ పౌరుడి రిపోర్ట్ నెగెటివ్! రెండో కేసుపై ఉత్కంఠ
హైదరాబాద్‌లో ఎబోలా టెన్షన్.. సూడాన్ పౌరుడి రిపోర్ట్ నెగెటివ్! రెండో కేసుపై ఉత్కంఠ
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
India T20I & Asian Games Squads: టీమ్ ఇండియా టీ20 స్క్వాడ్  ఎంపిక‌కు బీసీసీఐ ముహూర్తం: అంద‌రి ఫోక‌స్ శ్రేయస్, వైభవ్ సూర్యవంశీ పైనే..!
టీమ్ ఇండియా టీ20 స్క్వాడ్  ఎంపిక‌కు బీసీసీఐ ముహూర్తం: అంద‌రి ఫోక‌స్ శ్రేయస్, వైభవ్ సూర్యవంశీ పైనే..!
Tamil Nadu BJP: తమిళనాడు బీజేపీలో అన్నామలై సంక్షోభం! భారీ సంఖ్యలో పార్టీని వీడుతున్న నేతలు!
తమిళనాడు బీజేపీలో అన్నామలై సంక్షోభం! భారీ సంఖ్యలో పార్టీని వీడుతున్న నేతలు!

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gaddar Daughter On Pawan Kalyan: పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
Latha Rajinikanth Makkal Madai: తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Embed widget