అన్వేషించండి

Makara Jyothi Darshan: శబరిమలలో పవిత్ర ఘట్టం.. మకరజ్యోతిని దర్శించుకున్న భక్తులు

Sabarimala Makaravilakku 2026 | శబరిమలలో భక్తులు మకర జ్యోతిని దర్శించుకున్నారు. శబరిమల చరిత్రలో మొదటిసారిగా రద్దీగా ఉండే పెట్టా జంక్షన్ వద్ద భక్తులను తాడులతో నిలిపివేశారు.

కేరళలోని ప్రముఖ శబరిమల క్షేత్రంలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. భోగి పండుగ నాడు (బుధవారం) సాయంత్రం పొన్నాంబలమేడు పైనుంచి మకర జ్యోతి మూడుసార్లు దర్శనమిచ్చింది. మకరజ్యోతిని అయ్యప్ప భక్తులు స్వయంగా వీక్షించి తన్మయత్వం పొందారు. కోట్లాది భక్తులు తమ ఇళ్ల వద్దే పలు మాధ్యమాల ద్వారా శబరిమల మకరజ్యోతి దర్శనం చేసుకున్నారు. మకర జ్యోతి దర్శనం వేళ అయ్యప్ప భక్తుల  స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోయింది.

మకర విలక్కు (మకర జ్యోతి) అంటే ఏమిటి?

మకర విలక్కు శబరిమలలోని ప్రధాన ఆధ్యాత్మిక విషయాలలో ఒకటి. మకర జ్యోతి శబరిమల ఆలయం నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నాంబలం కొండపై భక్తులకు మూడుసార్లు కనిపిస్తుంది. స్థానిక భక్తుల ప్రకారం, ఈ పవిత్ర మకరజ్యోతిని అయ్యప్ప భగవంతుని దైవిక ఉనికి, ఆశీర్వాదాలకు చిహ్నంగా భావిస్తారు.

మకర జ్యోతి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
మకర విలక్కు (మకర జ్యోతి) అనేది విశ్వాసం, భక్తి, దైవిక శక్తి కలిసే శక్తివంతమైన ఆధ్యాత్మిక క్షణం. అయ్యప్ప మాలధారులు పొన్నాంబలమేడు పైనుంచి కనిపించే మకర జ్యోతి దర్శించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తారు. ప్రతి ఏడాది భారీ సంఖ్యలో భక్తులు శబరిమలకు మకర జ్యోతి దర్శనం చూసేందుకు వెళ్తుంటారు. అయ్యప్ప భక్తులు మాలధారణ సమయంలో క్రమశిక్షణతో కూడిన దినచర్యను అనుసరిస్తారు. 

మకర జ్యోతి మతపరమైన ఆచారంగా వస్తుంది. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సమయంలో భోగి పండుగ నాడు పొన్నాంబలమేడు పైనుంచి భక్తులకు మకర జ్యోతి దర్శనమిస్తుంది. ఈ సమయంలో భక్తులు శబరిమల వద్దకు పెద్ద ఎత్తున చేరుకుంటారు. అయ్యప్ప స్వామికి ప్రార్థనలు చేసి, నైవేద్యాలు సమర్పిస్తుంటారు. మకర జ్యోతిని చూడటం వల్ల తమకు అంతా మంచే జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. 

 

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మకర జ్యోతికి ముందు బుధవారం భారీగా గుంపులు గుమిగూడడంతో గందరగోళం నెలకొంది. మకర జ్యోతి అనేది ఆలయంలో అత్యంత పవిత్రమైన, ప్రధానమైన వేడుకగా భావిస్తారు. మకర జ్యోతి వీక్షించేందుకు దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు శబరిమలకు చేరుకున్నారు. కొండ ప్రాంతంలో ఇప్పటికే యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంది. అటువంటి పరిస్థితి మరింత దిగజారింది. 

గుంపును నియంత్రించే ఉద్దేశ్యంతో పోలీసులు పంపాకు వెళ్లే వాహనాలను పట్టణంలోనే నిలిపివేశారు. ఈ నిర్ణయంతో ఆగ్రహించిన భక్తులు రోడ్డుపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు శరణం జపిస్తూ రోడ్డు మధ్యలో కూర్చొని ట్రాఫిక్‌ను పూర్తిగా స్తంభింపజేసి నిరసన తెలిపారు. వీరిలో పొరుగు రాష్ట్రాల నుండి వచ్చిన యాత్రికులు అధిక సంఖ్యలో ఉన్నారు.

పాదచారులను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం

పంపా నది, నీలక్కల్ ప్రాంతాల్లో అధిక రద్దీ కారణంగా పోలీసులు పాదచారులను అడ్డుకోవడానికి తాడులను ఉపయోగించడంతో పరిస్థితి  ఉద్రిక్తంగా మారింది. స్థానికుల ప్రకారం, శబరిమల చరిత్రలో రద్దీగా ఉండే పెట్టా జంక్షన్ వద్ద పాదచారులను తాడులతో అడ్డుకోవడం ఇదే మొదటిసారి. దీని కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్‌ అయింది.

పోలీసులు కఠినమైన మార్గదర్శకాలు, సూచనలు 

మకరవిళక్కు ఉత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు, స్థానిక పోలీసులు బుధవారం నాడు కఠినమైన మార్గదర్శకాలను విడుదల చేశారు. అధికారుల ప్రకారం, బుధవారం ఉదయం 10 గంటల వరకు మాత్రమే పంపా- నీలక్కల్ రోడ్డులో వాహనాలకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత అన్ని వాహనాలను నీలక్కల్‌లో నిలిపివేస్తారు. దీంతో పాటు ఉదయం 11 గంటల తర్వాత ఏ యాత్రికుడినీ పంపా నుండి సన్నిధానం వరకు కాలినడకన వెళ్లడానికి అనుమతించరు. ఈ చర్యలు భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నామని అధికారులు చెబుతుండగా, మెరుగైన నిర్వహణ, సమన్వయం కోసం భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
Nagoba Jatara 2026: నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
US President Donald Trump : 'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్
'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్
Advertisement

వీడియోలు

WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ
Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
Nagoba Jatara 2026: నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
US President Donald Trump : 'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్
'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్
Euphoria Trailer: వెయ్యి కోట్ల Dhurandhar సక్సెస్ తర్వాత... సారా అర్జున్ కొత్త సినిమా 'యుఫోరియా' ట్రైలర్ రిలీజ్
వెయ్యి కోట్ల Dhurandhar సక్సెస్ తర్వాత... సారా అర్జున్ కొత్త సినిమా 'యుఫోరియా' ట్రైలర్ రిలీజ్
Sanya Malhotra: సినిమా కలెక్షన్స్ 2000 కోట్లు... కానీ హీరోయిన్ హ్యాపీగా లేదు - బాధ ఎందుకంటే?
సినిమా కలెక్షన్స్ 2000 కోట్లు... కానీ హీరోయిన్ హ్యాపీగా లేదు - బాధ ఎందుకంటే?
SBI ATM Transaction Fees:ఎస్‌బిఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్! ఏటీఎం విత్‌డ్రా ఫీజులు పెంపు! బ్యాలెన్స్ చెక్ చేసినా వాతే!
ఎస్‌బిఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్! ఏటీఎం విత్‌డ్రా ఫీజులు పెంపు! బ్యాలెన్స్ చెక్ చేసినా వాతే!
Mana Shankara Vara Prasad Garu Box Office Collection Day 5: 200 కోట్ల క్లబ్బులో వరప్రసాద్... ఐదు రోజుల్లో చిరంజీవి సినిమా గ్రాస్ ఎంతంటే?
200 కోట్ల క్లబ్బులో వరప్రసాద్... ఐదు రోజుల్లో చిరంజీవి సినిమా గ్రాస్ ఎంతంటే?
Embed widget