అన్వేషించండి

Makara Jyothi Darshan: శబరిమలలో పవిత్ర ఘట్టం.. మకరజ్యోతిని దర్శించుకున్న భక్తులు

Sabarimala Makaravilakku 2026 | శబరిమలలో భక్తులు మకర జ్యోతిని దర్శించుకున్నారు. శబరిమల చరిత్రలో మొదటిసారిగా రద్దీగా ఉండే పెట్టా జంక్షన్ వద్ద భక్తులను తాడులతో నిలిపివేశారు.

కేరళలోని ప్రముఖ శబరిమల క్షేత్రంలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. భోగి పండుగ నాడు (బుధవారం) సాయంత్రం పొన్నాంబలమేడు పైనుంచి మకర జ్యోతి మూడుసార్లు దర్శనమిచ్చింది. మకరజ్యోతిని అయ్యప్ప భక్తులు స్వయంగా వీక్షించి తన్మయత్వం పొందారు. కోట్లాది భక్తులు తమ ఇళ్ల వద్దే పలు మాధ్యమాల ద్వారా శబరిమల మకరజ్యోతి దర్శనం చేసుకున్నారు. మకర జ్యోతి దర్శనం వేళ అయ్యప్ప భక్తుల  స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోయింది.

మకర విలక్కు (మకర జ్యోతి) అంటే ఏమిటి?

మకర విలక్కు శబరిమలలోని ప్రధాన ఆధ్యాత్మిక విషయాలలో ఒకటి. మకర జ్యోతి శబరిమల ఆలయం నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నాంబలం కొండపై భక్తులకు మూడుసార్లు కనిపిస్తుంది. స్థానిక భక్తుల ప్రకారం, ఈ పవిత్ర మకరజ్యోతిని అయ్యప్ప భగవంతుని దైవిక ఉనికి, ఆశీర్వాదాలకు చిహ్నంగా భావిస్తారు.

మకర జ్యోతి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
మకర విలక్కు (మకర జ్యోతి) అనేది విశ్వాసం, భక్తి, దైవిక శక్తి కలిసే శక్తివంతమైన ఆధ్యాత్మిక క్షణం. అయ్యప్ప మాలధారులు పొన్నాంబలమేడు పైనుంచి కనిపించే మకర జ్యోతి దర్శించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తారు. ప్రతి ఏడాది భారీ సంఖ్యలో భక్తులు శబరిమలకు మకర జ్యోతి దర్శనం చూసేందుకు వెళ్తుంటారు. అయ్యప్ప భక్తులు మాలధారణ సమయంలో క్రమశిక్షణతో కూడిన దినచర్యను అనుసరిస్తారు. 

మకర జ్యోతి మతపరమైన ఆచారంగా వస్తుంది. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సమయంలో భోగి పండుగ నాడు పొన్నాంబలమేడు పైనుంచి భక్తులకు మకర జ్యోతి దర్శనమిస్తుంది. ఈ సమయంలో భక్తులు శబరిమల వద్దకు పెద్ద ఎత్తున చేరుకుంటారు. అయ్యప్ప స్వామికి ప్రార్థనలు చేసి, నైవేద్యాలు సమర్పిస్తుంటారు. మకర జ్యోతిని చూడటం వల్ల తమకు అంతా మంచే జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. 

 

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మకర జ్యోతికి ముందు బుధవారం భారీగా గుంపులు గుమిగూడడంతో గందరగోళం నెలకొంది. మకర జ్యోతి అనేది ఆలయంలో అత్యంత పవిత్రమైన, ప్రధానమైన వేడుకగా భావిస్తారు. మకర జ్యోతి వీక్షించేందుకు దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు శబరిమలకు చేరుకున్నారు. కొండ ప్రాంతంలో ఇప్పటికే యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంది. అటువంటి పరిస్థితి మరింత దిగజారింది. 

గుంపును నియంత్రించే ఉద్దేశ్యంతో పోలీసులు పంపాకు వెళ్లే వాహనాలను పట్టణంలోనే నిలిపివేశారు. ఈ నిర్ణయంతో ఆగ్రహించిన భక్తులు రోడ్డుపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు శరణం జపిస్తూ రోడ్డు మధ్యలో కూర్చొని ట్రాఫిక్‌ను పూర్తిగా స్తంభింపజేసి నిరసన తెలిపారు. వీరిలో పొరుగు రాష్ట్రాల నుండి వచ్చిన యాత్రికులు అధిక సంఖ్యలో ఉన్నారు.

పాదచారులను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం

పంపా నది, నీలక్కల్ ప్రాంతాల్లో అధిక రద్దీ కారణంగా పోలీసులు పాదచారులను అడ్డుకోవడానికి తాడులను ఉపయోగించడంతో పరిస్థితి  ఉద్రిక్తంగా మారింది. స్థానికుల ప్రకారం, శబరిమల చరిత్రలో రద్దీగా ఉండే పెట్టా జంక్షన్ వద్ద పాదచారులను తాడులతో అడ్డుకోవడం ఇదే మొదటిసారి. దీని కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్‌ అయింది.

పోలీసులు కఠినమైన మార్గదర్శకాలు, సూచనలు 

మకరవిళక్కు ఉత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు, స్థానిక పోలీసులు బుధవారం నాడు కఠినమైన మార్గదర్శకాలను విడుదల చేశారు. అధికారుల ప్రకారం, బుధవారం ఉదయం 10 గంటల వరకు మాత్రమే పంపా- నీలక్కల్ రోడ్డులో వాహనాలకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత అన్ని వాహనాలను నీలక్కల్‌లో నిలిపివేస్తారు. దీంతో పాటు ఉదయం 11 గంటల తర్వాత ఏ యాత్రికుడినీ పంపా నుండి సన్నిధానం వరకు కాలినడకన వెళ్లడానికి అనుమతించరు. ఈ చర్యలు భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నామని అధికారులు చెబుతుండగా, మెరుగైన నిర్వహణ, సమన్వయం కోసం భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bengal Elections 2026: ప్రాంతీయ సెంటిమెంట్‌తో మమత ఎత్తుగడ.. జాతీయవాద మంత్రంతో బీజేపీ ఎదురుదాడి - బెంగాల్‌లో పైచేయి ఎవరిది?
ప్రాంతీయ సెంటిమెంట్‌తో మమత ఎత్తుగడ.. జాతీయవాద మంత్రంతో బీజేపీ ఎదురుదాడి - బెంగాల్‌లో పైచేయి ఎవరిది?
Delimitation 2026 : నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
PM Modi Meeting CMs: నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు! రాష్ట్రాలకు ప్రధానమంత్రి కీలక ఆదేశాలు!
నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు! రాష్ట్రాలకు ప్రధానమంత్రి కీలక ఆదేశాలు!
Tunguska Missile System: భారత రక్షణ రంగం మరింత బలోపేతం, రష్యా నుంచి తుంగస్కా క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం!
భారత రక్షణ రంగం మరింత బలోపేతం, రష్యా నుంచి తుంగస్కా క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం!
Advertisement

వీడియోలు

Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Shubman Gill Message to Critics | విమర్శకులకు శుభ్‌మన్ గిల్ స్ట్రాంగ్ కౌంటర్ | ABP Desam
Pat Cummins Update on IPL 2026 Return | SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
White Ball Turns Pink in PSL 2026 | పాక్ క్రికెట్ పరువు తీసిన పింక్ బాల్ | ABP Desam
Preity Zinta apologises to Jitesh Sharma | జితేశ్‌ శర్మకు సారీ చెప్పిన ప్రీతి జింటా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత! అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం,కేంద్ర చట్ట సవరణ దిశగా రాష్ట్ర కీలక అడుగు!
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత! అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం,కేంద్ర చట్ట సవరణ దిశగా రాష్ట్ర కీలక అడుగు!
Delimitation 2026 : నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
Telangana Latest News: తెలంగాణలో ఇంధన భద్రత, హరిత ఇంధన విప్లవం! ప్రధానమంత్రికి వివరించిన రేవంత్ రెడ్డి!
తెలంగాణలో ఇంధన భద్రత, హరిత ఇంధన విప్లవం! ప్రధానమంత్రికి వివరించిన రేవంత్ రెడ్డి!
Andhra Pradesh Delimitation Politics: అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో వైసీపీ పెనుగండమే - టీడీపీ అడ్వాంటేజ్ తీసుకుంటుందా?
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో వైసీపీ పెనుగండమే - టీడీపీ అడ్వాంటేజ్ తీసుకుంటుందా?
Varun Tej Bhari : వాలీబాల్ ప్లేయర్‌గా వరుణ్ తేజ్ - సంక్రాంతి 'బరి'కి రెడీ!
వాలీబాల్ ప్లేయర్‌గా వరుణ్ తేజ్ - సంక్రాంతి 'బరి'కి రెడీ!
Best Courses After Intermediate : ఇంటర్ తర్వాత ఈ ట్రెండింగ్ కోర్సులు ఎంచుకోండి.. అద్భుతమైన కెరీర్ అవకాశాలు మీ సొంతమవుతాయి
ఇంటర్ తర్వాత ఈ ట్రెండింగ్ కోర్సులు ఎంచుకోండి.. అద్భుతమైన కెరీర్ అవకాశాలు మీ సొంతమవుతాయి
Shukra Gochar 2026: మేష రాశిలోకి శుక్రుడు! ఏప్రిల్ 19 వరకూ ఈ 5 రాశులవారికి పండుగే, మిగిలిన రాశులపై ఎలాంటి ప్రభావం?
మేష రాశిలోకి శుక్రుడు! ఏప్రిల్ 19 వరకూ ఈ 5 రాశులవారికి పండుగే, మిగిలిన రాశులపై ఎలాంటి ప్రభావం?
PM Modi Meeting CMs: నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు! రాష్ట్రాలకు ప్రధానమంత్రి కీలక ఆదేశాలు!
నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు! రాష్ట్రాలకు ప్రధానమంత్రి కీలక ఆదేశాలు!
Embed widget