అన్వేషించండి

Makara Jyothi Darshan: శబరిమలలో పవిత్ర ఘట్టం.. మకరజ్యోతిని దర్శించుకున్న భక్తులు

Sabarimala Makaravilakku 2026 | శబరిమలలో భక్తులు మకర జ్యోతిని దర్శించుకున్నారు. శబరిమల చరిత్రలో మొదటిసారిగా రద్దీగా ఉండే పెట్టా జంక్షన్ వద్ద భక్తులను తాడులతో నిలిపివేశారు.

కేరళలోని ప్రముఖ శబరిమల క్షేత్రంలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. భోగి పండుగ నాడు (బుధవారం) సాయంత్రం పొన్నాంబలమేడు పైనుంచి మకర జ్యోతి మూడుసార్లు దర్శనమిచ్చింది. మకరజ్యోతిని అయ్యప్ప భక్తులు స్వయంగా వీక్షించి తన్మయత్వం పొందారు. కోట్లాది భక్తులు తమ ఇళ్ల వద్దే పలు మాధ్యమాల ద్వారా శబరిమల మకరజ్యోతి దర్శనం చేసుకున్నారు. మకర జ్యోతి దర్శనం వేళ అయ్యప్ప భక్తుల  స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోయింది.

మకర విలక్కు (మకర జ్యోతి) అంటే ఏమిటి?

మకర విలక్కు శబరిమలలోని ప్రధాన ఆధ్యాత్మిక విషయాలలో ఒకటి. మకర జ్యోతి శబరిమల ఆలయం నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నాంబలం కొండపై భక్తులకు మూడుసార్లు కనిపిస్తుంది. స్థానిక భక్తుల ప్రకారం, ఈ పవిత్ర మకరజ్యోతిని అయ్యప్ప భగవంతుని దైవిక ఉనికి, ఆశీర్వాదాలకు చిహ్నంగా భావిస్తారు.

మకర జ్యోతి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
మకర విలక్కు (మకర జ్యోతి) అనేది విశ్వాసం, భక్తి, దైవిక శక్తి కలిసే శక్తివంతమైన ఆధ్యాత్మిక క్షణం. అయ్యప్ప మాలధారులు పొన్నాంబలమేడు పైనుంచి కనిపించే మకర జ్యోతి దర్శించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తారు. ప్రతి ఏడాది భారీ సంఖ్యలో భక్తులు శబరిమలకు మకర జ్యోతి దర్శనం చూసేందుకు వెళ్తుంటారు. అయ్యప్ప భక్తులు మాలధారణ సమయంలో క్రమశిక్షణతో కూడిన దినచర్యను అనుసరిస్తారు. 

మకర జ్యోతి మతపరమైన ఆచారంగా వస్తుంది. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సమయంలో భోగి పండుగ నాడు పొన్నాంబలమేడు పైనుంచి భక్తులకు మకర జ్యోతి దర్శనమిస్తుంది. ఈ సమయంలో భక్తులు శబరిమల వద్దకు పెద్ద ఎత్తున చేరుకుంటారు. అయ్యప్ప స్వామికి ప్రార్థనలు చేసి, నైవేద్యాలు సమర్పిస్తుంటారు. మకర జ్యోతిని చూడటం వల్ల తమకు అంతా మంచే జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. 

 

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మకర జ్యోతికి ముందు బుధవారం భారీగా గుంపులు గుమిగూడడంతో గందరగోళం నెలకొంది. మకర జ్యోతి అనేది ఆలయంలో అత్యంత పవిత్రమైన, ప్రధానమైన వేడుకగా భావిస్తారు. మకర జ్యోతి వీక్షించేందుకు దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు శబరిమలకు చేరుకున్నారు. కొండ ప్రాంతంలో ఇప్పటికే యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంది. అటువంటి పరిస్థితి మరింత దిగజారింది. 

గుంపును నియంత్రించే ఉద్దేశ్యంతో పోలీసులు పంపాకు వెళ్లే వాహనాలను పట్టణంలోనే నిలిపివేశారు. ఈ నిర్ణయంతో ఆగ్రహించిన భక్తులు రోడ్డుపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు శరణం జపిస్తూ రోడ్డు మధ్యలో కూర్చొని ట్రాఫిక్‌ను పూర్తిగా స్తంభింపజేసి నిరసన తెలిపారు. వీరిలో పొరుగు రాష్ట్రాల నుండి వచ్చిన యాత్రికులు అధిక సంఖ్యలో ఉన్నారు.

పాదచారులను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం

పంపా నది, నీలక్కల్ ప్రాంతాల్లో అధిక రద్దీ కారణంగా పోలీసులు పాదచారులను అడ్డుకోవడానికి తాడులను ఉపయోగించడంతో పరిస్థితి  ఉద్రిక్తంగా మారింది. స్థానికుల ప్రకారం, శబరిమల చరిత్రలో రద్దీగా ఉండే పెట్టా జంక్షన్ వద్ద పాదచారులను తాడులతో అడ్డుకోవడం ఇదే మొదటిసారి. దీని కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్‌ అయింది.

పోలీసులు కఠినమైన మార్గదర్శకాలు, సూచనలు 

మకరవిళక్కు ఉత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు, స్థానిక పోలీసులు బుధవారం నాడు కఠినమైన మార్గదర్శకాలను విడుదల చేశారు. అధికారుల ప్రకారం, బుధవారం ఉదయం 10 గంటల వరకు మాత్రమే పంపా- నీలక్కల్ రోడ్డులో వాహనాలకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత అన్ని వాహనాలను నీలక్కల్‌లో నిలిపివేస్తారు. దీంతో పాటు ఉదయం 11 గంటల తర్వాత ఏ యాత్రికుడినీ పంపా నుండి సన్నిధానం వరకు కాలినడకన వెళ్లడానికి అనుమతించరు. ఈ చర్యలు భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నామని అధికారులు చెబుతుండగా, మెరుగైన నిర్వహణ, సమన్వయం కోసం భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Karnataka Crime News: కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
Sonam Wangchuk vs Anna Hazare: వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష.. పట్టించుకోని జెన్-జీ - అన్నా హజారేలా ఎందుకు కదిలించలేకపోతున్నారు ?
వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష.. పట్టించుకోని జెన్-జీ - అన్నా హజారేలా ఎందుకు కదిలించలేకపోతున్నారు ?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget