అన్వేషించండి

PM Modi In Rajya Sabha: మణిపూర్‌పై రాజకీయాలు ఆపండి, కాంగ్రెస్ కు ప్రధాని నరేంద్ర మోదీ చురకలు

Manipur Violence : మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు.

PM Modi In Rajya Sabha:  రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాజ్యసభలో మణిపూర్‌ అంశాన్ని ప్రస్తావించారు. మణిపూర్‌లో పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి కేంద్రం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టాయని అన్నారు. మణిపూర్‌లో జరిగిన హింసను కాంగ్రెస్ రాజకీయం చేయడం మానేయాలని మోదీ హితవు పలికారు. మణిపూర్ అంశంపై అగ్నికి ఆజ్యం పోయవద్దని ఆయన సూచించారు. 18వ లోక్‌సభ ఏర్పడిన తర్వాత మణిపూర్ హింసాత్మక ఘటనలపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. మణిపూర్‌లో హింస తగ్గుతోందని, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయని ప్రధాని మోదీ అన్నారు. సంపూర్ణ శాంతి నెలకొల్పేందుకు కృషి చేస్తున్నామన్నారు. మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని పార్టీలతో చర్చలు జరుపుతున్నాయి.

11,000కు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు
ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మణిపూర్‌లో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. 11,000 కంటే ఎక్కువ ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. 500 మందికి పైగా అరెస్టు అయ్యారు. ఈ రోజు మణిపూర్‌లోని చాలా ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు,  ఇతర సంస్థలు సాధారణ రోజుల మాదిరిగానే తెరుచుకుంటున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించినట్లే మణిపూర్‌లో కూడా పరీక్షలు నిర్వహించి చిన్నారుల భవిష్యత్ మనుగడకు సహకారం అందించామన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో దేశంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు.. రాష్ట్రపతి పాలనను విధించేవారని విమర్శలు గుప్పించారు. అయితే తాము మణిపూర్‌లో పరిస్థితిని చక్కదిద్దేందుకు అన్ని  రకాల ప్రయత్నాలు చేస్తున్నామని మోదీ చెప్పుకొచ్చారు.

గతంలో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన
మణిపూర్‌లో హింసను ప్రేరేపించిన వారి గురించి కఠిన స్వరంతో హెచ్చరించారు ప్రధాని మోదీ..  మణిపూర్ అగ్నికి ఆజ్యం పోయడానికి ప్రయత్నిస్తున్న వారందరికీ ఆ పనులను తక్షణమే ఆపాలని హెచ్చరించారు. మణిపూర్ ప్రజలు వారిని తిరస్కరించే సమయం వస్తుందని అన్నారు.  మణిపూర్‌కు సుదీర్ఘ సామాజిక పోరాట చరిత్ర ఉందని .. ఈ పోరాటాల కారణంగానే మణిపూర్ లాంటి చిన్న రాష్ట్రంలో 10 సార్లు రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చిందన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు.  దాదాపు 30 ఏళ్ల నాటి హింసను ప్రస్తావిస్తూ, 1993లో కూడా ఇదే విధమైన హింసాకాండ కొనసాగిందని ప్రధాని మోదీ అన్నారు. పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడంలో సహాయం చేయాలనుకునే వారికి మద్దతు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు మోదీ ప్రకటించారు. 

వారం రోజులు రాష్ట్రంలోనే అమిత్ షా  
మణిపూర్‌లో హింస చెలరేగడంతో కేంద్ర హోంమంత్రి స్వయంగా చాలా రోజులు రాష్ట్రంలోనే ఉన్నారని ప్రధాని మోదీ గుర్తు చేశారు.  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వారంరోజులు అక్కడే ఉండి పరిస్థితులు చక్కదిద్దిన తర్వాతే తిరిగి వెళ్లారన్నారు.  మణిపూర్‌లో వరద సంక్షోభం నుంచి తేరుకునేందుకు  రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోంది. నేడు ఎన్‌డిఆర్‌ఎఫ్‌కి చెందిన రెండు బృందాలు అక్కడికి చేరుకున్నాయని ప్రధాని అన్నారు. పరిస్థితిని అదుపులోకి తేవాలి కానీ, అగ్ని ఆజ్యం పోసి రాజకీయాలు చేయకూడదన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Karnataka Crime News: కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
Sonam Wangchuk vs Anna Hazare: వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష.. పట్టించుకోని జెన్-జీ - అన్నా హజారేలా ఎందుకు కదిలించలేకపోతున్నారు ?
వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష.. పట్టించుకోని జెన్-జీ - అన్నా హజారేలా ఎందుకు కదిలించలేకపోతున్నారు ?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget