![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
పెట్రోల్ డీజిల్పై వ్యాట్ పెంచిన ప్రభుత్వం, ఇకపై మరింత భారం
Petrol Diesel Prices: పంజాబ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై వ్యాట్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
![పెట్రోల్ డీజిల్పై వ్యాట్ పెంచిన ప్రభుత్వం, ఇకపై మరింత భారం Petrol Diesel Prices Another blow to inflation, Punjab government increased VAT on petrol-diesel పెట్రోల్ డీజిల్పై వ్యాట్ పెంచిన ప్రభుత్వం, ఇకపై మరింత భారం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/11/e4bebe56b328ee9ff65425aabf47b45b1686467903388517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Petrol Diesel Prices:
పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం..
పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై వ్యాట్ (VAT on Petrol) పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇకపై లీటర్ పెట్రోల్, డీజిల్ ధరల్లో భారీ మార్పులు రానున్నాయి. ఈ మేరకు ప్రజలపై భారం పడనుంది. డీజిల్ ధరల్నీ పెంచేసింది. ఈ పెరిగిన ధరల తరవాత అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.98.65 గా ఉండగా...డీజిల్ లీటర్ ధర రూ.88.95కి పెరిగింది. దాదాపు ఏడాదిగా రాష్ట్రంలో పెట్రో ధరల్లో ఎలాంటి మార్పులూ చేయలేదు ప్రభుత్వం. గతేడాది ఏప్రిల్ నుంచి స్థిరంగానే ఉన్నాయి. ఇప్పుడు ఉన్నట్టుండి వ్యాట్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్పై 1.8% వ్యాట్ పెంచుతున్నట్టు తెలిపింది. ఈ ఆధారంగా చూస్తే...గతంలో ఉన్న ధరకు 92 పైసలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక డీజిల్ విషయానికొస్తే వ్యాట్ని 1.13%కి పెంచింది పంజాబ్ ప్రభుత్వం. అంటే అదనంగా 90 పైసలు చెల్లించాలి. ఈ రోజు (జూన్ 11) 12 గంటల తరవాత ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. కేబినెట్ మీటింగ్లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోగా...కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే...ఇప్పటి వరకూ అధికారికంగా ఆప్ ఈ ప్రకటన చేయలేదు. న్యూస్ ఏజెన్సీ ANI ఈ వివరాలు వెల్లడించింది.
Punjab government increases VAT on petrol and diesel prices. Petrol price in the state to be Rs 98.65 per litre and diesel price to be Rs 88.95 per litre
— ANI (@ANI) June 11, 2023
పంజాబ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే...కేంద్రం మాత్రం తీపి కబురు చెప్పింది. త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రం మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏప్రిల్ 2022 నుంచి చమురు ధరలు పెరగకుండా చూసిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు స్థిరంగా కొనసాగితే ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ఈ విషయంపై దృష్టి పెట్టే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై తానేమీ చెప్పలేనని ఆయన వ్యాఖ్యానించారు. సమయం గడుస్తున్నా కొద్దీ ఈ విషయంపై స్పష్టత వస్తుందన్నారు. గత త్రైమాసికంలో ప్రభుత్వ రంగ చమురు విక్రయ సంసఅథలు సంతృప్తికర ఆర్థిక ఫలితాలు సాధించాయని వివరించారు. కొంతమేర నష్టాలను పూడ్చుకోగలిగాయన్నారు. ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో ధరలు తగ్గించడంపై ఏం చేయాలనేది ఆలోచిస్తామని చెప్పారు. సామాన్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. పెట్రోలియం ధరల విషయంలో బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్లను బీజేపీ ప్రభుత్వాల కంటే ఎక్కువ ధరలకు అమ్ముతున్నప్పుడు కూడా వ్యాట్ను తగ్గించకుండా ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు.
Also Read: Gehlot Vs Pilot: ఈ సారి గెలిస్తే సచిన్ పైలట్కే సీఎం పదవి! నిర్ణయం తీసుకున్న హైకమాండ్?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)