అన్వేషించండి

Gyanvapi ASI Report: జ్ఞాన్‌వాపి మసీదులో ఏఎస్ఐ సర్వే ఎలా చేసింది? అక్కడ దొరికాయో తెలుసా?

Gyanvapi ASI Survey: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో పెద్ద హిందూ దేవాలయ నిర్మాణం ఉందని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురువారం రిపోర్టు ఇచ్చింది. 

ASI Report On Gyanvapi: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని జ్ఞాన్‌వాపి (Gyanvapi) మసీదు సముదాయంలో పెద్ద హిందూ దేవాలయ నిర్మాణం ఉందని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (Archaeological Survey of India) గురువారం రిపోర్టు ఇచ్చింది. ఈ కేసులో హిందూ తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ (Vishnu Shankar Jain) గురువారం (జనవరి 25) విలేకరుల సమావేశంలో  సర్వేను చదివి వినిపించారు. 17వ శతాబ్దంలో ఆలయాన్ని కూల్చి మసీదును కట్టారని పురావస్తు శాఖ తేల్చిందన్నారు. ఆ మసీదు కింద ఓ నిర్మాణం ఉన్నట్లుగా గుర్తించామని, హిందూ ఆలయంలోని కొన్ని స్తంభాలను చెక్కి మసీదు నిర్మాణంలో వాడినట్లుగా గుర్తించినట్లు వెల్లడించారు.

జ్ఞానవాపి మసీదు కింది భాగంలో కొన్ని దేవతల విగ్రహాలు ఉన్నాయని విష్ణు శంకర్ జైన్ పేర్కొన్నారు. ప్రస్తుత సర్వేలో మొత్తం 34 శాసనాలు నమోదు చేయబడ్డాయని, అందులో 32 హిందూ శాసనాలను సైతం గుర్తించామని, దేవనాగరి, తెలుగు, కన్నడ భాషల్లో శాషనాలు ఉన్నట్లు విష్ణు జైన్ సర్వేను చదువుతూ చెప్పారు. మసీదు లోపల కనుగొన్నవస్తువులన్నీ డాక్యుమెంట్ చేయబడ్డాయని అన్నారు. అంతకు ముందు బుధవారం (జనవరి 24), వారణాసి జిల్లా కోర్టు ఏఎస్‌ఐ నివేదికను హిందూ, ముస్లిం పక్షాలకు అందుబాటులో ఉంచడానికి అంగీకరించింది.

ఏఎస్‌ఐ సర్వేను ఎలా నిర్వహించింది?
జ్ఞాన్‌వాపి మసీదు ఉన్న ప్రాంతంలో 2,150.5 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇనుప కంచె వేయబడి శాస్త్రీయ సర్వే నిర్వహించారు. అయితే మసీదు సముదాయంలోని 'వజుఖానా కొలను'ను సర్వే నుంచి మినహాయించారు. 2022 మేలో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వజుఖానాను మూసివేశారు.

ముస్లింలు నమాజ్ చేయడానికి ముందు వజుఖానా కొలనులో పవిత్ర స్నానాలు చేసేవారు. అక్కడ లింగం ఆకారంలో నిర్మాణం బయటపడడంతో అది శివలింగమని హిందువులు వాదించారు. ముస్లింలు దానిని వాటర్ ఫౌంటేన్ అని వాదించారు. దీంతో అక్కడ పెద్ద వివాదం నడిచింది. ఈ నేపథ్యంలో మే 16, 2022లో వజుఖానా కొలనును మూసివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.   

ముస్లిం, హిందూ పక్షాల నుంచి మరో సారి పిటిషన్లు రావడంతో 'వజుఖానా'ను తెరవాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. అందులోని నీరు, చనిపోయిన చేపలను తొలగించి శుభ్రం చేయాలని ఆదేశించింది. జనవరి 20న వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో శుభ్రత పనులు పూర్తయ్యాయి.

'వజుఖానా' మినహా అక్కడ దొరికిన శాసనాలు, శిల్పాలు, నాణేలు, నిర్మాణ శకలాలు, కుండలు, టెర్రకోట వస్తువులు, రాయి, లోహం, గాజులపై ఏఎస్‌ఐ శాస్త్రీయ సర్వే నిర్వహించింది. వాటన్నింటిని పరిశీలించిన తర్వాత, అన్ని వస్తువులను సురక్షితంగా వారణాసి జిల్లా యంత్రాంగానికి అప్పగించారు. జ్ఞాన్‌వాపీ మసీదు శాస్త్రీయ సర్వే ప్రక్రియ సమయంలో, ప్రస్తుత నిర్మాణానికి ఎటువంటి నష్టం లేకుండా ఏఎస్‌ఐ సర్వే చేపట్టింది.

ఎందుకు సర్వే చేశారు?
జ్ఞానవాపి మసీదు స్థానంలో హిందూ ఆలయం ఉండేదని హిందువులు ఆరోపించారు. 17 శతాబ్ధంలో ఆలయం కూల్చి వేసి మసీదు నిర్మించారని హిందువులు కోర్టును ఆశ్రయించారు. దీంతో 2023 జులైలో దీనిపై ‘వివరణాత్మక శాస్త్రీయ సర్వే’ నిర్వహించాలని వారణాసి కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే  ఏఎస్ఐ సర్వే నిర్వహించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Embed widget