అన్వేషించండి

హర్యానా అల్లర్ల ఘటనలో 80 మంది అరెస్ట్- 44 ఎఫ్‌ఐఆర్ లు!

దేశంలో రోజురోజుకి హింస పెరిగిపోతుంది. మణిపూర్ లో చెలరేగిన అల్లర్లు ఇంకా చల్లారకముందే హర్యానాలో అల్లరి మూకలు రెచ్చిపోతున్నారు.

దేశంలో రోజురోజుకి హింస పెరిగిపోతుంది. మణిపూర్ లో చెలరేగిన అల్లర్లు ఇంకా చల్లారకముందే హర్యానాలో అల్లరి మూకలు రెచ్చిపోతున్నారు. గురుగ్రామ్‌ పరిసర ప్రాంతాల్లో సోమవారం అర్థరాత్రి రెండువర్గాల మధ్య మత ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల వల్ల ఇప్పటి వరకు నలుగురు చనిపోగా, అనేక మంది గాయపడ్డారు.

ఈ క్రమంలో ఈ అల్లర్ల ప్రభావం పక్క రాష్ట్రాల మీద ఉంటుందేమో అనే ఉద్దేశంతో పక్క రాష్ట్రాల పోలీసులు ముందుగానే అప్రమత్తం అవుతున్నారు. తమ రాష్ట్రాల్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని లో అధికారులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పోలీసులు ముఖ్యమైన అన్ని ప్రదేశాలలో కూడా అధికారులతో పెట్రోలింగ్‌ పెంచినట్లు తెలిపారు. 

దీని గురించి స్పందించిన ఓ పోలీసు అధికారి ఇప్పటి వరకు మాకు ఎటువంటి ఆదేశాలు రాకపోయినప్పటికీ పరిస్థితులు చూస్తుంటే చాలా ఉద్రిక్తంగా అనిపిస్తున్నాయి. అందుకు మేము ముందుగానే అప్రమత్తంగా ఉన్నామని వారు తెలిపారు.

ఇదిలా ఉంటే హర్యానాలోని గురుగ్రామ్ లో ఇంకా 144 సెక్షన్ కొనసాగుతూనే ఉంది. సోమవారం అర్థరాత్రి నుంచి ఈ కర్ఫ్యూ కొనసాగుతుంది. దీంతో పాఠశాలలకు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందుస్తుగా పోలీసు బలగాలు మోహరించాయి.

ఇదిలా ఉంటే..హర్యానాలోని నుహ్‌ ప్రాంతంలో ఇప్పటి వరకు పోలీసులు 80 మందిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. సుమారు 22 మంది పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటి వరకు సుమారు 44 ఎఫ్‌ఐఆర్‌ లు నమోదు చేసినట్లు తెలిపారు.  సోమవారం అర్థరాత్రి సమయంలో హర్యానాలోని  గురుగ్రామ్‌లోని సెక్టార్ 57లోని మసీదుపై సోమవారం అర్థరాత్రి 45 మందితో కూడిన గుంపు దాడి చేసి మసీదుకు నిప్పంటించింది.

ఈ ఘటనలో ఒకరు మరణించారని, ముగ్గురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మసీదు వద్ద రాళ్లు రువ్వడంతో పాటు గుంపు మసీదులోకి ప్రవేశించి నిప్పు పెట్టారు. అంతటితో ఆగకుండా ఓ ఇంటి బయట నిద్రిస్తున్న 23 సంవత్సరాల యువకుడిని కత్తితో పొడవడంతో ఆ యువకుడు తీవ్ర గాయాల పాలై మరణించాడు.

ఈ నేపథ్యంలో జరిగిన అల్లర్లు, చెలరేగిన మత ఘర్షణల గురించి తెలుసుకున్న పోలీసులు 48 గంటల పాటు కర్ఫ్యూ విధించారు. అంతేకాకుండా అన్ని షాపులు, సంస్థలు, స్కూళ్లను మూయించారు. నుహ్‌లో విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునేందుకు జరిగిన రాళ్ల దాడి ఫలితమే ఇంతటి అల్లర్లు జరగడానికి కారణమని పోలీసుల భావిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Embed widget