News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు

Cauvery Water Dispute: కర్ణాటక బంద్ కారణంగా బెంగళూరు విమానాశ్రయంలో 44 ఫ్లైట్స్ రద్దు చేశారు.

FOLLOW US: 
Share:

Cauvery Water Dispute: 


44 ఫ్లైట్స్ క్యాన్సిల్..

కావేరి జలాల వివాదం తమిళనాడు, కర్ణాటక మధ్య చిచ్చు పెట్టింది. రెండు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. కర్ణాటకలో ఇవాళ పలు సంస్థలు బంద్‌కి పిలుపునిచ్చాయి. ఆటోలు, ట్యాక్సీలు నడవడం లేదు. KSRTC బస్‌లు కూడా డిపోలకే పరిమితమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక విమాన ప్రయాణికులకూ ఈ సమస్యలు తప్పడంలేదు. బంద్ కారణంగా బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో 44 ఫ్లైట్స్‌ రద్దయ్యాయి. కన్నడ సంస్థ ఒక్కుట పిలుపునిచ్చిన బంద్‌లో భాగంగా ఫ్లైట్ సర్వీస్‌లను రద్దుచేశారు.

అయితే...ఎయిర్‌పోర్ట్ సిబ్బంది మాత్రం అందుకు వేరే కారణం చెబుతోంది. ఆపరేషనల్ రీజన్స్‌ వల్ల విమానాలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే ప్రయాణికులకు ఇదే సమాచారం అందించింది. కేవలం బంద్ కారణంగానే ఫ్లైట్‌లు రద్దయ్యాయని కొందరు వాదిస్తున్నారు. బంద్ వల్ల ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోలేని వాళ్లు చాలా మంది ఉన్నారని, వాళ్లంతా టికెట్‌లు క్యాన్సిల్ చేసుకున్నారని తెలుస్తోంది. ఎయిర్‌పోర్ట్ వద్ద కూడా ఆందోళనకారులు అలజడి సృష్టించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమిళనాడుకి కావేరి జలాలు ఇచ్చేదే లేదని తేల్చి చెప్పారు. ఎయిర్‌పోర్ట్ వద్ద నిరసనలు చేపట్టిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఐదుగురూ ఎయిర్‌పోర్ట్‌లో ఎంట్రీ కోసం టికెట్‌లు కూడా బుక్ చేసుకున్నారు. ఆసాకుతో లోపలికి వచ్చి ఆందోళన చేశారు. ఈ బంద్ కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. 

Published at : 29 Sep 2023 12:33 PM (IST) Tags: Bengaluru airport Cauvery Water Dispute Karnataka Bandh 44 Flights Cancelled

ఇవి కూడా చూడండి

Bhagwant Mann: 'అబద్ధాల మా నాన్న మూడోసారి తండ్రి కాబోతున్నారు' - పంజాబ్ సీఎం భగవంత్ పై కుమార్తె సంచలన వ్యాఖ్యలు

Bhagwant Mann: 'అబద్ధాల మా నాన్న మూడోసారి తండ్రి కాబోతున్నారు' - పంజాబ్ సీఎం భగవంత్ పై కుమార్తె సంచలన వ్యాఖ్యలు

Article 370: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు - కేంద్రం నిర్ణయం సరైనదేనని స్పష్టీకరణ

Article 370: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు - కేంద్రం నిర్ణయం సరైనదేనని స్పష్టీకరణ

Sabrimala Temple: శబరిమలలో విషాదం, అయ్యప్ప ఆలయంలో ఆగిన చిన్నారి గుండె

Sabrimala Temple: శబరిమలలో విషాదం, అయ్యప్ప ఆలయంలో ఆగిన చిన్నారి గుండె

Jharkhand CM: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు - ఆరోసారి సమన్లు పంపిన అధికారులు

Jharkhand CM: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు - ఆరోసారి సమన్లు పంపిన అధికారులు

MP Dheeraj Sahu: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో నోట్ల కట్టు- లెక్కించడానికి 80 మంది సిబ్బంది

MP Dheeraj Sahu: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో నోట్ల కట్టు- లెక్కించడానికి 80 మంది సిబ్బంది

టాప్ స్టోరీస్

TS Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసాపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన

TS Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసాపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి-  మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ పాదయాత్ర- 20న భోగాపురంలో ముగింపు సభ

మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ పాదయాత్ర- 20న భోగాపురంలో ముగింపు సభ