అన్వేషించండి

తెలుగు రాష్ట్రాల ఇరిగేషన్ కార్యదర్శులతో నేడు కేంద్ర జలశక్తి సమావేశం, నాలుగు అంశాలే అజెండా

తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి వివాదాలు, ప్రాజెక్టుల వ్యవహారంపై నేడు ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఇవాళ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

Jalshakti Department Review : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) మధ్య ఉన్న నీటి వివాదాలు, ప్రాజెక్టుల వ్యవహారంపై నేడు కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జలశక్తి శాఖ (Central Jalshakti Department) కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ (Debasri Mukharjee) ఇవాళ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని (High Level Meeting) ఏర్పాటు చేశారు. నాలుగు అంశాలను సమావేశ ఎజెండాలో పొందుపరిచారు.

ఢిల్లీ (Delhi)వేదికగా జరిగే సమావేశానికి తెలంగాణ నీటిపారుదల శాఖ, ఏపీ జలవనరుల శాఖ అధికారులు హాజరుకానున్నారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ప్రాజెక్టుల స్వాధీనం, శ్రీశైలం, సాగర్ ఆపరేషన్ ప్రోటోకాల్స్‌, బోర్డుకు సంబంధించిన నిధులే అజెండాగా భేటీ జరగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులతో సమావేశం కానున్న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి చర్చించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ నిర్వహిస్తున్న సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. 

శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాంల ఆపరేషన్ ప్రోటోకాల్ పై ప్రధాన చర్చ
కేంద్ర జలశక్తి శాఖ గతంలో జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం... కృష్ణా నదిపై గుర్తించిన 15 ఉమ్మడి జలాశయాల నిర్వహణను నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించలేదు. ఇవాళ జరిగే సమావేశంలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. సాగర్ వివాదంపై గతంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఢిల్లీలోని కేంద్ర జలశక్తి శాఖ కార్యాలయంలో జరిగే సమావేశంలో...నాగార్జునసాగర్ వద్ద పరిస్థితిని సమీక్షించనున్నారు. మళ్లీ ఉద్రిక్తలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించనున్నారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాంల ఆపరేషన్ ప్రోటోకాల్ అంశంపైనా రెండు రాష్ట్రాల అధికారులతో దేబశ్రీ ముఖర్జీ చర్చించనున్నారు. 

నిధులు విడుదలలో రెండు రాష్ట్రాలు అలసత్వం
కేఆర్ఎంబీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి నిధుల విడుదల అంశంపైనా సమావేశంలో చర్చించనున్నారు. బోర్డు నిర్వహణ కోసం బడ్జెట్​కు అనుగుణంగా ప్రతి ఏటా తెలంగాణ, ఏపీ నిధులు విడుదల చేయాల్సి ఉంటది. అయితే రెండు రాష్ట్రాలు నిధులు విడుదలలో అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. దీంతో బకాయిలు భారీగా పెరిగిపోయాయి. ఉద్యోగులు, సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉందని ఇటీవల బోర్డు వెల్లడించింది. దీనిపై ఈ నెల 12న బోర్డు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పటికీ...ఇవాళ్టి భేటీ నేపథ్యంలో వాయిదా వేశారు. కృష్ణా బోర్డు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.45.63 కోట్ల నిధులు వచ్చాయి. ఇప్పటి వరకు రూ.45.45 కోట్లు ఖర్చు చేశారు. అందులో ఏపీ ఇచ్చిన మొత్తం రూ.24.91 కోట్లు, తెలంగాణ ఇచ్చిన మొత్తం రూ.19.71 కోట్లు. కేంద్రం ఇచ్చిన కోటి రూపాయల కార్పస్ ఫండ్ కూడా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం వరకు తెలంగాణ రూ.13.61 కోట్లు, ఏపీ రూ.11.75 కోట్లు బోర్డుకు ఇవ్వాల్సి ఉంది. మే నెలలో ఏపీ ప్రభుత్వం రూ.3.35 కోట్లు ఇచ్చింది. ఈ సమావేశంలో బోర్డుకు నిధుల అంశం కూడా ప్రధానంగా చర్చించనున్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన పరస్పర ఫిర్యాదులపైనా సమీక్ష జరపనున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Constable Suicide: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
Nara Lokesh: ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
Accident Politics:   చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
Advertisement

వీడియోలు

Kavitha Janambata Interview | ఆదిలాబాద్ జిల్లాలో కవిత జనం బాట వెనుక మతలబు ఇదేనా.? | ABP Desam
Smrithi Mandhana Jemimah Gesture | ఆడి వరల్డ్ కప్ సాధించారు..ప్రత్యర్థులను ఓదార్చి హృదయాలు గెలిచారు | ABP Desam
Tribute to Mithali Raj Jhulan Goswami | ప్రపంచకప్ గెలిచి మిథాలీ, ఝులన్ గోస్వామికి ట్రిబ్యూట్ | ABP Desam
India vs South Africa Final | Deepti Sharma | మ్యాచ్‌ని మలుపు తిప్పిన దీప్తి శర్మ
Women's ODI Final | Smriti Mandhana | చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Constable Suicide: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
Nara Lokesh: ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
Accident Politics:   చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
Pawan Kalyan: ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
Vidadala Rajani: ఉద్యోగాల పేరుతో రూ. రూ.5 కోట్లు మోసం - మాజీ మంత్రి విడదల రజని పీఏలు, అనుచరులపై ఆరోపణలు
ఉద్యోగాల పేరుతో రూ. రూ.5 కోట్లు మోసం - మాజీ మంత్రి విడదల రజని పీఏలు, అనుచరులపై ఆరోపణలు
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో .. పత్తి రైతులతో కవిత
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో .. పత్తి రైతులతో కవిత
Youngest Self Made Billionaires: ముగ్గురు స్నేహితులు ఏఐ కంపెనీ పెట్టి 20 ఏళ్లకే బిలియనీర్లు అయ్యారు - వారిలో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్లు!
ముగ్గురు స్నేహితులు ఏఐ కంపెనీ పెట్టి 20 ఏళ్లకే బిలియనీర్లు అయ్యారు - వారిలో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్లు!
Embed widget