Uttar Pradesh Election 2022: వాళ్లే గుంపుగా వస్తారు.. కాంగ్రెస్ సింగిల్‌గా వస్తుంది: ప్రియాంక గాంధీ

ABP Desam Updated at: 14 Nov 2021 08:24 PM (IST)
Edited By: Murali Krishna

ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రకటించారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఒంటరి పోరు

NEXT PREV

ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగుతుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రకటించారు. బులంద్‌షహర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ఈసారి అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు.







యోగి ఆదిత్యనాథ్ పాలనతో ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలు విసిగిపోయారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ పార్టీదే. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవద్దని చాలా మంది కార్యకర్తలు నాతో అన్నారు. నేను మీ అందరికీ మాట ఇస్తున్నా.. కాంగ్రెస్ అన్ని స్థానాల్లోనూ బరిలోకి దిగుతుంది.. సింగిల్‌గానే పోటీ చేస్తుంది.  -                                            ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి


ఇవే హామీలు..



  • కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆశావర్కర్లకు నెలకు రూ. 10 వేల గౌరవ వేతనం ఇస్తామని వాగ్దానం. 

  • రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ.

  • గోధమ, వరి పంటలు క్వింటాల్‌కు రూ. 2,500, క్వింటాల్ చెరకును రూ. 400ల చొప్పున కొనుగోలు చేస్తామని ప్రకటన.

  • ప్రజలందరికీ రూ. 10 లక్షల వరకు ఉచితంగా వైద్య చికిత్స అందిస్తామని హామీ.

  • విద్యార్థులకు స్మార్ట్‌ ఫోన్లు, ఎలక్ట్రిక్ స్కూటీలు అందజేస్తామని వాగ్దానం.


మాయావతిని కలిసి..


అంతకుముందు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతిని ప్రియాంక గాంధీ పరామర్శించారు. మాయావతి తల్లి రాంరతి (92) శనివారం దిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ వార్త తెలిసిన ప్రియాంక గాంధీ.. మాయావతిని నేరుగా కలిసి ఓదార్చారు.


Also Read: ED, CBI Directors Tenure: సీబీఐ, ఈడీ చీఫ్‌ల పదవీకాలం పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం 


Also Read: CJI Ramana Update: 'అన్యాయం జరిగిన బాధితుడికి న్యాయవ్యవస్థే ఆఖరి ఆశాకిరణం'


Also Read: Yogi Adityanath on Taliban: 'తాలిబన్లపై బాంబుల వర్షం అమెరికా పనే.. కానీ కారణం మాత్రం దేవుడే'


Also Read: Gaya Naxal Attack: భయంభయం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ఉరి తీసిన నక్సల్స్!


Also Read: FIR Against Shilpa-Raj Kundra: మరో వివాదంలో శిల్పాశెట్టి దంపతులు.. చీటింగ్ కేసు నమోదు


Also Read: Amit Shah Andhra Visit: 'ఎన్నో పదవులకు ఆయన వన్నె తెచ్చారు.. నా కోరిక నేటికి నెరవేరింది'


Also Read: Punjab Election 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో సోనూసూద్ సోదరి


Also read: ABP-CVoter Survey: యూపీ భాజపాకే.. కానీ 100 సీట్లు హాంఫట్.. పంజాబ్‌లో ఒకటి కూడా కష్టమే!


Also read:  తెల్ల బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్... రెండింటిలో ఏది తింటే బెటర్? ఏది తినకూడదు?



Also read: గోల్డెన్ అవ‌ర్ అనేది ఒకటుంది తెలుసా... ఆ సమయంలో ఇలా చేస్తే ప్రాణాలు కాపాడినట్టే...


Also read: గర్భస్రావం కాకుండా వాడే ఆ మందుతో పుట్టే బిడ్డకు క్యాన్సర్... వెల్లడించిన కొత్త అధ్యయనం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


Published at: 14 Nov 2021 08:23 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.