అన్వేషించండి

దుబాయ్‌లో ఘోర ప్రమాదం, గాయపడిన భారతీయుడికి రూ.11 కోట్ల పరిహారం

Indian Man Awarded: దుబాయ్‌లో జరిగిన ప్రమాదంలో గాయపడిన భారతీయుడికి రూ.11 కోట్ల పరిహారం అందించారు.

Indian Man Awarded:

2019లో ప్రమాదం..

2019లో దుబాయ్‌లో జరిగిన ఓ ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారతీయుడికి అక్కడి ప్రభుత్వం 11 కోట్ల రూపాయల పరిహారం అందించింది. 2019లో ఓ బస్సు మెట్రో స్టేషన్ వద్ద బ్యారియెర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జైంది. 17 మంది ప్రాణాలు కోల్పోగా...వీరిలో 12 మంది భారతీయులే. నిర్లక్ష్యంగా బస్సుని నడిపిన డ్రైవర్‌కు దుబాయ్ ప్రభుత్వం 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాధిత కుటుంబాలకు 3.4 మిలియన్ దిర్హాంలు చెల్లించాలని జరిమానా కూడా విధించింది. భారత్‌కు చెందిన 20 ఏళ్ల మహమ్మద్ బైగ్ మిర్జా ప్రమాదం జరిగిన సమయంలో ఒమన్ నుంచి యూఏఈకి ప్రయాణిస్తున్నాడు. తీవ్ర గాయాలపాలయ్యాడు. దీనిపై కోర్టుకు వెళ్లింది బాధిత కుటుంబం. మిర్జా తరపున వాదించిన న్యాయవాది...కేసు బలంగా ఉండేలా చూసుకున్నారు. భారీ మొత్తంలో పరిహారం వచ్చేలా వాదించారు. అప్పటికే UAE Insurance Authority 1 మిలియన్ దిర్హాంలు ఇచ్చేందుకు అంగీకరించింది. ఆ తరవాత దుబాయ్ కోర్టుకు వెళ్లాడు బాధితుడు. ఆ మొత్తం సరిపోదు అని న్యాయపోరాటం చేశాడు. చివరకు 5 మిలియన్ దిర్హాంలు ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది. ఈ మేరకు అధికారిక తీర్పుని కూడా ఇచ్చింది. 

కోమాలోకి వెళ్లి...

ప్రమాదం జరిగే సమయానికి మిర్జా...మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా కోర్స్ చేస్తున్నాడు. ప్రమాదం జరిగాక దాదాపు 14 రోజుల పాటు కోమాలోనే ఉన్నాడు. దాదాపు రెండు నెలల పాటు వైద్యం చేస్తేకానీ...మళ్లీ మామూలు మనిషి కాలేకపోయాడు. ఆ తరవాత రిహాబిలిటేషన్ సెంటర్‌కి పంపించారు. ఈ యాక్సిడెంట్‌లో మెదడుకి బలంగా గాయమైనట్టు వైద్యులు వెల్లడించారు. మళ్లీ సాధారణ జీవితం గడపడానికి చాలా సమయం పడుతుందని స్పష్టం చేశారు. చెవులు, నోరు, భుజాలు..ఇలా అన్ని అవయవాలకూ తీవ్ర గాయాలయ్యాయని వివరించారు. 

అమెరికాలో ఇలా...

వడదెబ్బ తగిలి మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి అమెరికాలో ఒక‌ యూనివర్సిటీ భారీ నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. తమ కుమారుడి మృతికి అమెరికాలోని యూనివర్సిటీ యాజమాన్యమే కారణమని బాధిత కుటుంబం ఆరోపించింది. దీంతో సదరు యూనివర్సిటీ 14 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 110 కోట్లు) పరిహారంగా చెల్లించేందుకు అంగీకరించింది. కుప్పకూలి మరణించాడు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కెంటకీలో ఆగస్ట్ 31 2020న రెజ్లింగ్‌కు సంబంధించిన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో గ్రాంట్‌ బ్రేస్ అనే 20 ఏళ్ల యువకుడు పాల్గొన్నాడు. అయితే, శిక్షణ స‌మ‌యంలో నార్కోలెప్సీ, ADHDతో బాధపడుతున్న బ్రేస్ కొండపైకి, కిందికి చాలాసార్లు పరుగెత్త‌డంలో బాగా అల‌సిపోయాడు. విప‌రీత‌మైన దాహంతో బాధ‌ప‌డుతూ మంచినీరు కావాల‌ని వేడుకుంటున్నప్పటికీ కోచ్‌లు అత‌ను నీరు తాగడానికి నిరాక‌రించారు. త‌న శారీర‌క ప‌రిస్థితిని వివ‌రించినా వైద్య స‌హాయాన్ని అందించ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. శిక్షణలో భాగమని పేర్కొంటూ ఇత‌రులెవ‌రూ అతనికి నీరు ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఫ‌లితంగా డీహైడ్రేషన్‌తో బాధపడుతూ బ్రేస్ కొద్దిసేపటికే మరణించాడు. తమ కుమారుడి మరణానికి యూనివర్సిటీ యాజమాన్యమే కారణమంటూ బ్రేస్ కుటుంబం కోర్టును ఆశ్ర‌యించింది. త‌మ‌ కుమారుడి పట్ల కఠినంగా వ్యవహరించడం వల్లే అతడు మృతి చెందాడ‌ని న్యాయ‌స్థానానికి బాధిత త‌ల్లిదండ్రులు వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో బాధిత కుటుంబానికి విశ్వవిద్యాలయం 14 మిలియన్ డాలర్లు చెల్లించడానికి ముందుకొచ్చింది. 

Also Read: Manish Sisodia's Letter: మోదీకి సైన్స్‌పై అవగాహన లేదు,చదువుకోని ప్రధాని దేశానికే ప్రమాదకరం - సిసోడియా లేఖ

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget