అన్వేషించండి

BJP: దేశంలో ఎవరికైనా కొత్త పార్టీలు పెట్టుకునే హక్కు ఉంది, కానీ బీఆర్ఎస్‌తో ఏ లాభం లేదు: కిషన్ రెడ్డి

2047 నాటికి అంటే వచ్చే 25 ఏళ్ల అమృత కాలంలో జరిగే వేగవంతమైన అభివృద్ధిలో భారత సమాజాన్ని భాగస్వామిని చేసేందుకు కార్యకర్తలు, నాయకులు కృషిచేయాలని ప్రధాని సూచించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

- దేశాభివృద్ధిలో సమాజాన్ని భాగస్వామిని చేస్తూ ముందుకెళ్లాలన్నదే ప్రధానమంత్రి సందేశం
- అప్పుడే సమగ్రమైన పురోగతి సాధ్యమని ప్రధాని చెప్పారన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
- 2024 పార్లమెంటు ఎన్నికలు నడ్డా నేతృత్వంలోనే.. ఆలోపలే 9 రాష్ట్రాల ఎన్నికలు కూడా..
- బీఆర్ఎస్, కల్వకుంట్ల కుటుంబం పట్ల ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉంది
- వారిని త్వరలోనే ఫాం హౌజ్ కు పరిమితం చేయడం ఖాయం అన్న కిషన్ రెడ్డి
- ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతమున్న పరిస్థితుల ప్రకారం భారతదేశానికి భవ్యమైన భవిష్యత్తు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకోసం 2047 నాటికి అంటే వచ్చే 25 ఏళ్ల అమృత కాలంలో జరిగే వేగవంతమైన అభివృద్ధిలో భారత సమాజాన్ని భాగస్వామిని చేసేందుకు కార్యకర్తలు, నాయకులు కృషిచేయాలని ప్రధాని సూచించారని ఆయన అన్నారు. రెండ్రోజులపాటు దేశ రాజధానిలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఈ రెండ్రోజుల్లో పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుందని, వచ్చే సార్వత్రిక ఎన్నికలతోపాటు రానున్న 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు జేపీ నడ్డా నేతృత్వంలోనే పార్టీ ముందుకెళ్తుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. సమావేశాల ముగింపులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తిదాయకమైన మార్గదర్శనం చేశారని ఆయన అన్నారు. ప్రస్తుతం పార్టీ ఆధర్వ్యంలో జరుగుతున్న కార్యక్రమాలను మరింతగా ముందుకు తీసుకెళ్లాలని మోదీ సూచించారన్నారు. 
 
2047 వరకు నిర్దేశించుకున్న అమృత కాలాన్ని ప్రస్తావిస్తూ.. మన పూర్వీకుల ఆకాంక్షలను పూర్తిచేసేందుకు సరైన సమయం ఆసన్నమైందని, ఇందుకోసం సమాజంలోని అన్ని వర్గాలకు కలుపుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని మోదీ సూచించారన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రధాని ఎవరన్నది ముఖ్యం కాదని, దేశాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతి కార్యకర్త కృషిచేయాలని ప్రధాని మార్గదర్శనం చేశారన్నారు. 

దేశంలో ఎవరికైనా కొత్త పార్టీలు పెట్టుకునే హక్కుందని, కానీ ప్రజల ఆకాంక్షలను వదిలిపెట్టి రాజకీయాలు చేస్తే ఆ ప్రజలే సరైన బుద్ధి చెబుతారన్నారు. టీఆర్ఎస్ పార్టీ పట్ల, కల్వకుంట్ల కుటుంబం పట్ల తెలంగాణ ప్రజల్లో విశ్వాసం లేదని, రాష్ట్రాన్ని నిలువుదోపిడీ చేసిన కుటుంబం.. దేశాన్ని దోపిడీ చేద్దామని అనుకుంటోందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలోనే టీఆర్ఎస్ పార్టీకి భూమి కదిలిపోతోందని, అలాంటిది దేశ రాజకీయాల్లోకి వచ్చి కల్వకుంట్ల కుటుంబం సాధించేది ఏమీ ఉండదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల, కల్వకుంట్ల కుటుంబం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉందని అందుకే త్వరలోనే ఈ కుటుంబాన్ని ఫాం హౌజ్ కు పరిమితం చేయడం ఖాయమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

దేశంలో రాజకీయ పరిస్థితులపై "రాజకీయ తీర్మానం" ప్రవేశపెట్టిన ఈటల రాజేందర్ మాట్లాడారు. ప్రజలని నమ్ముకొని నాయకులు ఎన్నికలకి వెళ్తున్నారు, కానీ తెలంగాణ లో మాత్రం పైసలు తో ఎన్నికలు నడుస్తున్నాయని ఆరోపించారు. ఆత్మాభిమానానికి చిహ్నం అయిన ఓటుకు కెసిఆర్ వెలకడుతున్నారు. ఎమ్మెల్యే గా పోటీ చేయాలి అంటే భయపడే పరిస్థితి తీసుకువచ్చారు. టికెట్ ఇచ్చే ముందే ఎన్ని డబ్బులు ఉన్నాయి అని అడుగుతున్నారు. ఈ పరిస్థితిని మారాలన్నారు. కేంద్రం అయినా  రాష్ట్రం అయినా  (ప్రజా ధనం) ప్రజల పైసలు ఖర్చు చేస్తారు. ముఖ్యమంత్రులు "నేను" ఖర్చు పెట్టిన అంటున్నారు. కానీ, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఎప్పుడూ అలా చెప్పలేదు అన్నారు. ప్రజాస్వామ్యంలో "నేనే" అని చెప్పుకొనే పరిస్థితి మారాలన్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత కూడా ప్రభుత్వాలు పధకాలు ప్రవేశపెడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP India at 2047: అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్
అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్
Ramachandrapuram News: మంత్రి ఇలాఖాలో దారుణం.. మ‌హిళా ప్రయాణికులపై అసభ్య ప్రవర్తన.. ప్ర‌శ్నించిన ఆటో డ్రైవ‌ర్‌పై దాడి
మంత్రి ఇలాఖాలో దారుణం.. మ‌హిళా ప్రయాణికులపై అసభ్య ప్రవర్తన.. ప్ర‌శ్నించిన ఆటో డ్రైవ‌ర్‌పై దాడి
INDO-UK FTA యు.కెతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం..పంచ వాణిజ్య కేంద్రంగా భారత్‌ - ఏబీపీ సమ్మిట్‌లో ప్రకటించిన ప్రధాని మోదీ
UK తో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం..పంచ వాణిజ్య కేంద్రంగా భారత్‌ - ఏబీపీ సమ్మిట్‌లో ప్రకటించిన ప్రధాని మోదీ
PM Modi On Nation First: మాకు దేశమే ముఖ్యం.. అందుకే పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నాం- ఏబీపీ సమ్మిట్‌లో ప్రధాని
మాకు దేశమే ముఖ్యం.. అందుకే పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నాం- ఏబీపీ సమ్మిట్‌లో ప్రధాని

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Ticket Price Hike In Telangana:
Peddi Ticket Price Hike In Telangana: "పెద్ది"కి గుడ్ న్యూస్- తెలంగాణలో టికెట్‌ ధరలు పెంపు
Minister Ponnam Prabhakar counter to Pawan Kalyan: ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
NHAI Toll Exemption List: టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
AP DSC Sports Quota Controversy: ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
Annamalai Resigns BJP Tamil Nadu: బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
Kanpur Petrol Pump Scam: ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Embed widget