Jagadhatri Serial Today March 11th:గంజాయి స్మగ్లర్లు మీనన్ మనుషులేనా..? కౌషికి 10 కోట్లు తెచ్చి ఇంట్లో ఎందుకు పెట్టింది...?
Jagadhatri Serial Today Episode March 11th:గంజాయి స్మగ్లర్లు మీనన్ మనుషులేనా..? కౌషికి 10 కోట్లు తెచ్చి ఇంట్లో ఎందుకు పెట్టింది...?

Jagadhatri Serial Today Episode : పోలీసులను చూసి పారిపోతున్న భరత్తోపాటు రౌడీలను పట్టుకున్న జేడీ, కేడీ వాళ్లను చితకబాదుతారు. తప్పయిపోయిందని ఇంకెప్పుడు మత్తు పదార్థాలు తీసుకోనని భరత్ వేడుకుంటాడు. మర్యాదగా అమ్మాయిల ఫొటోలు తీసిన సెల్ఫోన్ ఎక్కడని అడగగా... భరత్కు ఏం అర్థంకాదు. ఫొటోలు ఏంటి, ఫోన్ ఏంటని అడుగుతాడు. నాకు ఏం తెలియదని అంటాడు. రౌడీలు కూడా మేం గంజాయి అమ్ముతాం గానీ ఈ ఫొటోలతో మాకు సంబంధం లేదని అంటారు. మరి యామిని పేరు చెప్పగానే ఎందుకు పారిపోయావని అనగా... ఆ రోజు తనను కూడా మత్తు మందు తీసుకోమని బలవంతం పెట్టానని అది మీకు చెప్పిందేమోనని భయపడి పారిపోయానని అంటాడు.
వెంటనే భరత్తోపాటు రౌడీల దగ్గర ఉన్న ఫోన్లు తీసుకుని రమ్య కంప్యూటర్లో చెక్చేస్తుంది. ఈ ఫోన్లలో అలాంటివి ఏమీ లేవని చెబుతుంది. వాళ్లను స్టేషన్కు తీసుకెళ్లమని చెప్పి జేడీ ఆలోచిస్తుంది. వీళ్లు కాకపోతే ఇంకెవరి పని అయ్యి ఉంటుందని ఆలోచిస్తుంది. ఇంతలో ఇనిస్టిట్యూట్ యజమాని వచ్చి మూడు నెలలుగా అమ్మాయిలు మా దగ్గర మానేసి వెళ్లిపోతున్నారని చెబుతాడు. ఇందుకేనేమోనని అంటాడు. వాళ్లను ఎంత అడిగినా వివరాలు చెప్పకుండా వెళ్లిపోతున్నారని అంటాడు.అయితే ఈ మూడునెలల్లో మీ దగ్గర కొత్తగా చేరిన స్టూడెంట్లు గానీ, ఫ్యాకల్టీగానీ ఉన్నారా అని అడగ్గా ఎవరూ లేరని చెబుతాడు.
అయితే కచ్చితంగా ఈ మూడు నెలల నుంచి ఇక్కడ చేరిన వాళ్లే ఈ పని చేస్తున్నారని జేడీ కేడీతో అంటుంది. అందరినీ విచారిస్తున్నప్పుడు... వాచ్మెన్ను కూడా వివరాలు అడగ్గా...నాకేమీ తెలియదని నేను వచ్చి మూడు నెలలే అవుతుందని చెప్పడం జేడీకి గుర్తుకు వస్తుంది. అతనే ఈ పని చేసి ఉంటాడని అనుమానిస్తుంది. అప్పటికే వాచ్మెన్ అక్కడి నుంచి జారుకుని గంజాయి స్మగ్లర్లకు ఫోన్ చేస్తాడు. నేను ఏదో విధంగా తప్పించుకుని వస్తానని... మీరు వచ్చి ఆ ఫోన్ తీసుకుని వెళ్లి ఫొటోలన్నీ ఇంటర్నెట్లో పెట్టమని చెబుతాడు. వాచ్మెన్ ఎక్కడ అని అడగ్గా...అతను చాలా పెద్దవాడని ఇలాంటి పని చేసి ఉండడని ఇనిస్టిట్యూట్ యజమాని చెబుతాడు.
యామిని వాళ్లు కూడా అదే చెబుతారు.అతను మాతో చాలా మంచిగా ఉంటాడని చెప్పగా...అదే మీ బలహీనత అని వారించి కేదార్ను వాచ్మెన్ను పట్టుకోమని పంపిస్తుంది. అప్పటికే పారిపోవడానికి రెడీగా ఉన్న వాచ్మెన్ను పట్టుకుని నిలదీయగా అసలు విషయం చెబుతాడు. అతని వద్ద ఉన్న ఫోన్ లాక్కుని స్టేషన్కు తరలిస్తుండగా.....మీనన్ మనుషులు వచ్చి కాల్చి చంపేస్తారు. వాళ్లను చూసిన కేదార్...వాళ్లు మీనన్ మనుషులని చెబుతాడు. మీనన్ చనిపోయిన తర్వాత గ్యాంగ్ను ఎవరు నడుపుతున్నారని అనుమానిస్తారు.అంటే వదిన చెప్పినట్లు మీనన్ చనిపోలేదన్నమాట అని జేడీ అంటుంది.మన ఇన్ఫార్మర్లు అందరికీ ఈ విషయం చెప్పి వివరాలు సేకరించమని చెబుతుంది.
పెద్ద బిజినెస్ ఢీల్ కోసం కౌషికి 10కోట్లరూపాయలు బ్యాంకు నుంచి డ్రా చేసుకుని ఇంటికి తీసుకొస్తుంది. అన్ని డబ్బులు ఒక్కదానివే తీసుకొచ్చేప్పుడు మాకు చెబితే తోడుగా వచ్చేవాళ్లం కదా అని కేదార్ అంటాడు.ఎందుకు కొట్టేయడానికేనా అని నిషిక అంటుంది. దొంగతనాలు, డబ్బులు కొట్టేయడాలు గురించి మీరు మాట్లాడితే బాగుండదని ధాత్రి కౌంటర్ ఇస్తుంది. ఆ మాటలకు ఉడుక్కున్న వైజయంతి....మేం దొంగల్లా కనిపిస్తున్నామా అని అంటుంది. మీరు అంత గట్టిగా నిలదీస్తే నిజమేనని చెప్పాల్సి ఉంటుందని కేదార్ అంటాడు. వెంటనే కలుగజేసుకున్న యువరాజు...ఏదిపడితే అది వాగితే చూస్తూ ఊరుకునేది లేదని అంటాడు.
ఇంతలో కలుగజేసుకున్న కౌషికి మొదట మొదలుపెట్టింది వీళ్లేనని చెప్పి సర్దిచెబుతుంది. ఇంత డబ్బు ఇంట్లో ఉంటే ఏదైనా జరిగితే ఏంటని నిషిక అంటుంది.ఈ డబ్బులు మీదగ్గరే ఉంచుకోండని చెప్పి వెళ్లిపోతుంది. వైజయంతి,యువరాజు కూడా ఆమె వెంటే వెళ్తారు. నాకు వీళ్లమీదే అనుమానమని సుధాకర్ అనగా....కంపెనీ డబ్బు ముట్టుకోరులే బాబాయి అని కౌషికి అంటుంది. యువరాజుకు కూడా ఈ ఢీల్ ఎంత ఇంపార్టెంటో తెలుసని అంటుంది. అంత డబ్బు కళ్లముందు కనిపిస్తుంటే కొట్టేయకుండా ఎలా ఉందామని వైజయంతి అనగా...ఆ ధాత్రి, కేదార్ ఉండగా ఆ డబ్బులు దరిదాపుల్లోకి కూడా మనం వెళ్లలేమని నిషిక అంటుంది. వీళ్లు ఖచ్చితంగా డబ్బుల కోసం ఏదో ప్లాన్స్ వేస్తారని...మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ధాత్రి,కేదార్తో అంటుంది.



















