అన్వేషించండి

Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం భారత్‌కు నేర్పిస్తున్న పాఠమిదే - ఉదయ్‌ కొటక్‌

Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మనకో పాఠం చెబుతోందని వెటరన్‌ బ్యాంకర్‌ ఉదయ్‌ కొటక్ అన్నారు. ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గించుకోవాలని సూచించారు.

Russia-Ukraine war teaches India: భారతదేశం స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరాన్ని రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మనకు చెబుతోందని వెటరన్‌ బ్యాంకర్‌ ఉదయ్‌ కొటక్ అన్నారు. ఆయుధాల కోసం మనమింకా అమెరికా, రష్యాలపై ఆధారపడుతున్నామని పేర్కొన్నారు. వీలైనంత వేగంగా 'ఆత్మనిర్భర్ భారత్‌'ను రూపొందించుకోవాలని పేర్కొన్నారు.

'ఇండియాకు పక్కనున్న పాకిస్థాన్‌, చైనా దేశాలు అణు సామర్థ్యం ఉన్నవి. మనమింకా మిలటరీ ఆయుధ వ్యవస్థల కోసం అమెరికా, రష్యాపై ఆధారపడుతున్నాం. మనకెన్నో సవాళ్లు ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మనకు చెబుతున్నది ఒకటే : 'ఆత్మ నిర్భర్‌ భారత్‌' అని ఉదయ్‌ కొటక్‌ ట్వీట్‌ చేశారు.

భారత్‌ ఇప్పటికీ ఆయుధాలను దిగుమతి చేసుకుంటూనే ఉంది. మనకు ఎక్కువ ఆయుధాలు సరఫరా చేస్తున్న దేశంగా రష్యా ఉంది. గతేడాది డిసెంబర్లో భారత్‌, రష్యా సైన్య సహకారం కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇండో, రష్యా రైఫిల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ద్వారా 6 లక్షల K-203 అసాల్ట్‌ రైఫిల్స్‌ను ఇండియాలో తయారు చేసేందుకు రెండు దేశాలు సంతకం చేసుకున్నాయి.

S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ కోసం 2018లో రష్యాతో 5.5 బిలియన్‌ డాలర్ల విలువైన ఒప్పందాన్ని భారత్‌ కుదుర్చుకుంది. ఇప్పటికే సరఫరా మొదలైంది. పంజాబ్‌లో మొదటి S-400 Missile Systemను మోహరించింది.

ఆత్మనిర్భర్‌ భారత్‌ గురించి ఉదయ్‌ కొటక్‌ ట్వీట్‌ చేయడం ఇదే మొదటిసారి కాదు. బడ్జెట్‌-2022 ప్రవేశపెట్టినప్పుడూ ఆయన ఇలాగే మాట్లాడాడు. 'బడ్జెట్‌: ఆత్మనిర్భర్‌ భారత్‌ను నిర్మించేందుకు నమ్మకమైన ప్రభుత్వ పాలన. పన్ను చెల్లింపుదారులు, వ్యాపారులు, పెట్టుబడిదారులపై మళ్లీ నమ్మకం పెంచింది. 25 ఏళ్ల విజన్‌తో పారదర్శకమైన డిజిటల్‌ ఇండియాను నిర్మిస్తోంది. ఒక భారతీయుడిగా నేనిందుకు గర్విస్తున్నాను' అని కొటక్‌ ట్వీట్‌ చేశారు.

రష్యా సైనిక చర్య చేపట్టడంతో ఉక్రెయిన్‌ అల్లాడుతోంది. అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మాట విని అణ్వాయుధాలను అప్పగించింది. ఇప్పుడు ప్రమాదకర, పవర్‌ఫుల్‌ ఆయుధాలు లేకపోవడంతో బిక్కుబిక్కుమంటోంది. అణ్వాయుధాలు ఉండుంటే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేది. అందుకే మెరుగైన ఆయుధ వ్యవస్థలు, ఇతర దేశాలపై ఆధారపడకుండా మనమే స్వయంగా అభివృద్ధి చేసుకోవాలని ఉదయ్‌ కొటక్‌ సూచిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

EPFO 3.0 PF withdrawal via ATM:ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
LPG Cylinder Prices Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
RBI Plastic Notes: ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
June 1 Rule Changes 2026:బిగ్ అలర్ట్! జూన్ 1 నుంచి మారే కీలక నియమాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవే!
బిగ్ అలర్ట్! జూన్ 1 నుంచి మారే కీలక నియమాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవే!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Embed widget