By: Rama Krishna Paladi | Updated at : 21 Jul 2023 04:02 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pixabay )
Stock Market Closing 21 July 2023:
స్టాక్ మార్కెట్లు శుక్రవారం బీభత్సం సృష్టించాయి. ఈ మధ్య కాలంలో కనీవినీ ఎరగని రీతిలో క్రాష్ అయ్యాయి. నాస్డాక్ సూచీ పతనం వల్ల భారత ఐటీ సూచీ కుప్పకూలింది. గ్లోబల్ మార్కెట్ల నుంచీ ప్రతికూల సంకేతాలు అందడంతో ఇన్వెస్టర్లు ఉదయం నుంచే షేర్లను తెగనమ్మారు. ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 234 పాయింట్లు తగ్గి 19,745 బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 887 పాయింట్లు పతనమై 67,190 వద్ద ముగిశాయి. మదుపర్లు నేడు రూ.5 లక్షల కోట్ల మేర సంపద నష్టపోయారు.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 67,571 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 66,907 వద్ద మొదలైంది. 66,533 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 67,190 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 887 పాయింట్ల నష్టంతో 66,584 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
గురువారం 19,979 వద్ద ముగిసిన ఎన్ఎస్ఈ నిఫ్టీ శుక్రవారం 19,800 వద్ద ఓపెనైంది. 19,700 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,887 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 234 పాయింట్లు పతనమై 19,745 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 46,063 వద్ద మొదలైంది. 45,952 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 46,369 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 111 పాయింట్లు తగ్గి 46,075 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 14 కంపెనీలు లాభాల్లో 36 నష్టాల్లో ఉన్నాయి. ఎల్టీ, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఎస్బీఐ, టాటా మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. ఇన్ఫీ, హిందుస్థాన్ లివర్, హెచ్సీఎల్ టెక్, విప్రో, టీసీఎస్ షేర్లు నష్టపోయాయి. ఆటో, మీడియా, పీఎస్యూ బ్యాంక్ సూచీలు పెరిగాయి. బ్యాంకు, ఎఫ్ఎంసీజీ, ఐటీ, హెల్త్కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు పతనమయ్యాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.310 తగ్గి రూ.60,440 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.1500 పెరిగి రూ.79,900 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.390 తగ్గి రూ.25,240 వద్ద ఉంది.
Also Read: ఇన్ఫీ నికర లాభంలో 11% గ్రోత్! రెవెన్యూ గైడెన్స్లో కోత - మళ్లీ నిరాశే!!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
The #NSEBell has rung in the celebration of the listing ceremony of Utkarsh Small Finance Bank Limited on NSE today! #NSE #NSEIndia #listing #IPO #StockMarket #ShareMarket #UtkarshSmallFinanceBankLimited @ashishchauhan pic.twitter.com/ndOGOgXXI3
— NSE India (@NSEIndia) July 21, 2023
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్లోకి పెట్టుబడుల వరద
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్
Nellore Alert : నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
Poco M7 Pro 5G: పోకో ఎం7 ప్రో 5జీ వచ్చేసింది - బడ్జెట్ ధరలో మంచి ఫోన్!
Ravichandran Ashwin: అశ్విన్... స్పిన్ కింగ్, క్రికెట్ పిచ్ పై చెరగని సంతకం రవిచంద్రన్