నాగరికత, సాంకేతిక పెరుగుతున్నా మహిళలపై దుర్భాషలాడటం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది! వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియా వేదికల్లో స్వేచ్ఛగా తమ గళాన్ని వినిపించలేకపోతున్నారు. తమ అభిప్రాయాలను బలంగా చెప్పలేకపోతున్నారు. ఆన్‌లైన్ ట్రోలింగ్‌ వారి నోరు నొక్కేస్తోంది! అందుకే మగువల కోసమే ప్రత్యేకంగా ఓ సోషల్‌ మీడియా వేదికను రూపొందిస్తున్నారు. దానిపేరే 'ఈవ్‌ వరల్డ్‌'.


తరుణ్‌ కతియాల్‌.. భారత మీడియాలో ప్రముఖంగా వినిపించే పేరిది! జీ5, బిగ్‌ ఎఫ్‌ఎంకు ఫౌండర్‌ సీఈవోగా పనిచేశారు. స్టార్‌ ఇండియా, రిలయన్స్‌ బ్రాడ్‌కాస్ట్‌ నెట్‌వర్క్‌, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సహా ఇంకా మరికొన్ని సంస్థల్లో ఆయన కీలక బాధ్యతలు చేపట్టారు. ఆయన సతీమణి మోనిషా సింగ్‌ కతియాల్‌ మీడియాలో పనిచేస్తారు. స్వేచ్ఛగా ఆమె తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. ఒకసారి ఆమెను వాట్సాప్‌లో ఎవరో ట్రోలింగ్‌ చేశారు. పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేద్దామని భావించారు. అలా చేసినా ప్రయోజనమేంటి అన్న వారి ఆలోచనల్లోంచే 'ఈవ్‌ వరల్డ్‌' పుట్టింది.


2021, జూన్‌లో ఈవ్‌ వరల్డ్‌ కార్యరూపం దాల్చింది. సింగపూర్‌కు చెందిన జంగిల్‌ వెంచర్స్‌ ఇందులో పెట్టుబడి పెట్టింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ తరహాలో ఈ సోషల్‌ మీడియా ఉంటుంది. మహిళలు ఇందులో తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకోవచ్చు. కంపెనీ ఉద్యోగుల్లోనూ 70 శాతం మంది మహిళలే ఉంటారు. బ్లాక్‌ చైన్ టెక్నాలజీతో ఈ వేదికను రూపొదిస్తుండటంతో మహిళా సాధికారతకూ కృషి చేస్తున్నారు. సభ్యులు తమ యాక్టివిటీ ద్వారా వర్చువల్‌ టోకెన్లు సంపాదించుకోవచ్చు. వాటి ద్వారా వైద్యులు, మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించొచ్చు. తక్కువ ధరకే ఎన్‌ఎఫ్‌టీలను కొనుగోలు చేయొచ్చు. మైక్రో ఎంటర్‌ప్రిన్యూర్లు తమ వ్యాపారాలను ప్రమోట్‌ చేసుకోవచ్చు. దీంతో ఈ వేదిక ద్వారా ఆదాయం సృష్టించొచ్చు.


దాదాపుగా ఈ వేదిక పూర్తి కావొచ్చింది. 2022, జనవరి-మార్చిలో ఈవ్‌ వరల్డ్‌ ఆరంభమవుతుందని అంచనా.


Also Read: 2000 Note : రూ. 2 వేల నోటు త్వరలోనే కనుమరుగు ! ఎవరికీ తెలియకుండానే కేంద్రం ఉపసంహరించుకుంటోందా ?


Also Read: Income Tax Filing: 31 చివరి తేదీ..! ఐటీఆర్‌ ఆలస్యమైతే పెనాల్టీ తప్పదు..! ఇలా చేయండి..!


Also Read: Forbes Most Powerful Women: అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో 'భారతీయం'.. నిర్మలా, కమలా హారిస్‌కు చోటు


Also Read: Kia Carens: కియా కొత్త కారు ఇదే.. అదిరిపోయే ఫీచర్లు.. లాంచ్ ఎప్పుడంటే?


Also Read: Indian Mobile Congress 2021: మెరుపు వేగంతో దేశంలో 5Gని ప్రవేశపెట్టాలన్న ముకేశ్ అంబానీ


Also Read: Multibagger stock: కనక వర్షం ! ఏడాదిలో లక్షను కోటి చేసిన మల్టీబ్యాగర్‌ స్టాక్‌ ఇది.!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి