అన్వేషించండి

Airtel Plan Rates: నిన్న జియో, ఈ రోజు ఎయిర్‌టెల్ - టారిఫ్‌లు పెంపు, జులై 03 నుంచి అమలు

Airtle Tariff Hikes: భారతి ఎయిర్‌టెల్ కూడా టారిఫ్ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. వచ్చే నెల 03 నుంచి ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ ప్లాన్‌ల కోసం ఎక్కువ డబ్బును ఖర్చు చేయాల్సి వస్తుంది.

Bharti Airtel -Reliance Jio Tariffs Hike: మొబైల్‌ ఫోన్‌ వినియోగదార్లకు వరుసగా రెండు షాక్‌లు తగిలాయి. ప్లాన్‌ ధరలు పెంచుతూ రిలయన్స్‌ జియో ప్రకటించిన వెంటనే, భారతి ఎయిర్‌టెల్ కూడా రేట్లను పెంచింది. ఎయిర్‌టెల్‌ సిమ్‌ వినియోగించాలంటే యూజర్లు ఇకపై 10 శాతం నుంచి 21 శాతం ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాలి.  

జులై 03 నుంచి కొత్త రేట్లు అమలు         
పెరిగిన భారతి ఎయిర్‌టెల్‌ టారిఫ్‌లు జులై 03, 2024 నుంచి అమలులోకి వస్తాయి. ఆ తేదీ నుంచి పోస్ట్‌ పెయిడ్ & ప్రి-పెయిడ్ ప్లాన్ల రేట్లు పెరుగుతాయి. ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు ప్రస్తుతం ఉన్న రేట్లు జులై 02వ తేదీ వరకు వర్తిస్తాయి.

భారతదేశంలోని టెలికాం కంపెనీలు ఆర్థికంగా బలంగా ఉండాలంటే "ప్రతి వినియోగదారు నుంచి వచ్చే సగటు ఆదాయం" (ARPU) రూ. 300 పైగా ఉండాలని భారతి ఎయిర్‌టెల్ స్టాక్ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు తెలిపింది. ARPUనకు తగ్గట్లుగా వ్యాపార నమూనా ఉండాలని వెల్లడించింది. ARPU రూ. 300 దాటితే... నెట్‌వర్క్ టెక్నాలజీ & స్పెక్ట్రమ్‌ కోసం పెద్ద మొత్తంలో అవసరమయ్యే పెట్టుబడులు అందుబాటులోకి వస్తాయని, మూలధనంపై సాధారణ రాబడిని పొందగమని తాము నమ్ముతున్నట్లు ఎక్సేంజ్‌ పైలింగ్‌లో భారతి ఎయిర్‌టెల్‌ పేర్కొంది. సామాన్య ప్రజల బడ్జెట్‌పై ఎలాంటి భారం లేకుండా, ఎంట్రీ-లెవల్ ప్లాన్‌ రేట్లను చాలా తక్కువ మొత్తంలో (రోజుకు 70 పైసల కంటే తక్కువ) పెంచినట్లు వెల్లడించింది.

నిన్న ప్లాన్‌ రేట్లు పెంచిన రిలయన్స్ జియో          
గురువారం, రిలయన్స్ జియో కూడా తన మొబైల్ ప్లాన్‌ రేట్లను 12 శాతం నుంచి 27 వరకు పెంచింది. జియో కొత్త టారిఫ్‌లు కూడా జులై 03, 2024 నుంచి అమల్లోకి వస్తాయి. జులై 02వ తేదీ వరకు ప్రస్తుత రేట్లే అమల్లో ఉంటాయి. రిలయన్స్‌ జియో... తన నెలవారీ (28 రోజులు) ప్లాన్‌లు, 2 నెలల ప్లాన్లు (56 రోజులు), 3 నెలల ప్లాన్లు (84 రోజులు), వార్షిక ప్లాన్ల (335 & 336 రోజులు) మొత్తాన్ని పెంచింది. 

28 రోజుల ప్లాన్‌ ధరలను 27 శాతం వరకు, 84 రోజుల ప్లాన్లను 20 శాతం వరకు రిలయన్స్‌ జియో పెంచింది. డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లు, పోస్ట్ పెయిడ్ టారిఫ్‌ రేట్లను సైతం జియో పెంచింది. దీంతో... కొత్త ప్లాన్లు కనిష్టంగా రూ. 189 నుంచి గరిష్టంగా రూ. 3,599 వరకు చేరాయి. ప్రస్తుతం ఇవి కనిష్టంగా రూ. 155 - గరిష్టంగా రూ. 2,999 మధ్యలో ఉన్నాయి. జియో యాడ్‌-ఆన్‌ ప్లాన్ల కొత్త ధరలు కనిష్టంగా రూ. 29 నుంచి గరిష్టంగా రూ. 69 వరకు ఉన్నాయి. 

పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్ల విషయానికి వస్తే... ప్రస్తుతం రూ. 299 ప్లాన్‌ జులై 03 నుంచి రూ. 349 అవుతుంది. ప్రస్తుతం రూ. 399గా ఉన్న ప్లాన్‌ కోసం జులై 03 నుంచి రూ. 449 చెల్లించాల్సి వస్తుంది.

వాస్తవానికి, టెలికాం కంపెనీలు ఈ ఏడాది ప్రారంభంలోనే టారిఫ్‌ రేట్లు పెంచాల్సి ఉంది. అయితే, లోక్‌సభ ఎన్నికలు ముగిసే వరకు ఆగాయి.

మరో ఆసక్తికర కథనం: భారీగా పెరిగిన జియో రీఛార్జ్ ప్లాన్స్ ధరలు, ఎంతో తెలిస్తే గుండె గుభేల్! 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

FASTag Annual Pass Fees: వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
Adobe CEO Shantanu Narayen : అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా - ఏఐ ఎఫెక్టే ?
అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా - ఏఐ ఎఫెక్టే ?
Sensex tumbles: మార్కెట్‌పై వార్ ఎఫెక్ట్ - ఒక్క రోజే 16 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద మాయం!
మార్కెట్‌పై వార్ ఎఫెక్ట్ - ఒక్క రోజే 16 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద మాయం!
Iran war threat: యుద్ధం ప్రభావంతో చమురు మంటలు పైపైకి! టెన్షన్ పెడుతున్న బంగారం! సామాన్యుడిపై ప్రభావం ఎంత?
యుద్ధం ప్రభావంతో చమురు మంటలు పైపైకి! టెన్షన్ పెడుతున్న బంగారం! సామాన్యుడిపై ప్రభావం ఎంత?

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Tata Nexon లేదా Maruti Brezza .. EMI కట్టడంలో ఏ కారు చౌక? ఈ విషయాలు తెలుసుకోండి
Tata Nexon లేదా Maruti Brezza .. EMI కట్టడంలో ఏ కారు చౌక? ఈ విషయాలు తెలుసుకోండి
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Embed widget