అన్వేషించండి

Machilipatnam Railway Station History: ఒక తెలుగు గాయకుడు బ్రిటీష్ వాళ్ళని మెప్పించి తెచ్చిన మంచిలీపట్నం రైల్వే లైన్ కథ తెలుసా?

Machilipatnam Railway Station History: ఒక తెలుగు గాయకుడు బ్రిటీష్ వాళ్ళని మెప్పించి తెచ్చిన మంచిలీపట్నం రైల్వే లైన్ కథ తెలుసా?

Machilipatnam Railway Station History: ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ తర్వాత  అంతటి ప్రముఖమైన రైల్వే స్టేషన్ "మచిలీపట్నం '. బందరు టౌన్, పోర్ట్‌ను ప్రధాన నగరాలతో కలిపే మచిలీపట్నం- విజయవాడ రైల్వే లైన్ ఆవిర్భవించడం వెనుక ఒక తెలుగు గాయకుడి కృషి ఉందన్న విషయం చాలా మందికి తెలియదు.ఆయనే "ఆంధ్ర గాయక పితామహ" గరికపర్తి కోటయ్య దేవర.

బందరులో పుట్టి నిజాం కొలువులో అస్థాన విద్వాంసుడుగా ఎదిగిన కోటయ్య దేవర 

1864లో బందరులోని వీరశైవ జంగమ కుటుంబంలో జన్మించాడు కొటయ్య దేవర. ఈయన తండ్రి లక్ష్మయ్య ఫిడేలు బాగా వాయించేవారు. తల్లి పేరు బసవమ్మ. తన తండ్రి వద్ద  చిన్నవయసు నుంచే సంగీతం నేర్చుకున్నారు కోటయ్య. ఆయనకు మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు బందరుకు ఉప్పెన వచ్చిన కారణంగా కరవు ఏర్పడింది. దీంతో తిండికి కష్టమైంది. దీంతో ఆయన తండ్రి మకాంను మచిలీపట్నం నుంచి హైదరాబాదుకు మార్చారు. అప్పటికి నిజాం నవాబు వద్ద దివానుగా పని చేస్తున్న సాలార్ జంగ్ స్వయంగా కోటయ్య దేవర సంగీత ప్రతిభ చూసి 10 ఏళ్లపాటు విద్య చెప్పించారు. ఆ తరువాత నిజాం కొలువులో చేరి 20 ఏళ్లపాటు అస్థాన విద్వాంసుడుగా పని చేశారు. కర్ణాటక సంగీతంతో పాటు వెస్ట్రన్ సంగీతంలో కూడా శిక్షణ పొంది దక్షిణ దేశ యాత్రలు చేశారు.

1894 నాటికి మద్రాస్, తంజావూర్ ప్రాంతాల్లో అనేక కచేరీలు చేసి సన్మానాలు, సత్కారాలు పొందారు. 1896లో పుట్టిన ఊరు బందరు చేరుకున్న కోటయ్య దేవర 300మంది విద్యార్థులతో సంగీత పాఠశాల ప్రారంభించారు. తన కచేరీల మీద వచ్చే డబ్బుతో  విద్యార్థులకు ఉచితంగా సంగీతం నేర్పేవారు. ఆయనకు ఆర్ధికంగా చల్లపల్లి, వల్లూరు సంస్థానాల జమీందార్లు కూడా సహకరించేవారు. సురభి నాటక కంపెనీల నుంచి వచ్చిన వారికి నాదస్వరంలో శిక్షణ ఇచ్చి వారి ద్వారా 'సురభి' నాటకాల్లో నాద స్వరానికి ప్రాధాన్యత కలిగేలా చూశారు.

మచిలీపట్నానికి రైల్వే లైన్ కోటయ్య దేవర చలువే

1906లో మద్రాస్ గవర్నర్ ఆలీవర్ రస్సెల్ (Oliver Russell, 2nd Baron Ampthill) అధికార పర్యటనలో భాగంగా బందర్ వచ్చారు. ఆయన కోసం ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో ఇంగ్లీషులో ఒక ట్యూన్ కట్టి  సొంతంగా పాట రాసి పాడారు కోటయ్యదేవర. అది చూసి ఆశ్చర్యపోయిన రస్సెల్ దొర ఏం కావాలో కోరుకో అని కోటయ్య దేవరను అడిగితే తనకు వ్యక్తిగతంగా ఏమీ వద్దు కానీ  ఎప్పటి నుంచో బందరువాసులు అడుగుతున్న మచిలీపట్నం విజయవాడ రైల్వే లైన్ ఏర్పాటు చెయ్యమని కోరారు కోటయ్య. దానికి సరే అన్న రస్సెల్ వెంటనే దానిని మంజూరు చేశారు.

తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయినప్పటికీ అందరూ బందరు-గుడివాడ రైల్వే లైన్ (37km ) పనులను కొనసాగించింది బ్రిటిష్ ప్రభుత్వం. దానితో మచిలీపట్నం- గుడివాడ- విజయవాడ రైల్వే లింక్ పూర్తైంది. 1908 ఫిబ్రవరి 4 న మచిలీపట్నం నుంచి విజయవాడ లైన్‌లో మొదటిసారి రైలు నడిచింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని అతి ముఖ్యమైన రైల్వే స్టేషన్లో ఒకటి గా మచిలీపట్నం సేవలు అందిస్తోంది. అయితే ఈ రైల్వేలైన్ ఏర్పాటుకు ప్రధాన కారణమైన కోటయ్య దేవర గురించి ఈ తరంలో తెలిసిన వాళ్ళు తక్కువే. 1924లో ఆయన మరణించే నాటికి  ఆయన వద్ద 600 మంది శిష్యులు ఉన్నారు. ఆయనకు నలుగురు కుమారులు. వారందరూ కూడా సంగీత వాయిద్యాలు తయారీలో  సిద్ధ హస్తులే.

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Chandra Babu About Mega DSC 2025: మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget