అన్వేషించండి

AP Minister Rajini: అవర్లీ బేసిస్ పై వైద్యుల నియామకం: మంత్రి రజిని

AP Minister Rajini: అవసరమైన చోట్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవర్లీ బేసిస్ పై వైద్యులను నియమించాలని మంత్రి విడదల రజినీ ఆదేశించారు. 

AP Minister Rajini: ప్రభుత్వాసుపత్రుల్లో అవసరమైన చోట్ల గంటల లెక్క విధానంలో వైద్యులను నియమించుకోవాలని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్లకు మార్గదర్శకాలు పంపాలని ఉన్నతాధికారులకు మంత్రి విడదల రజినీ ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన ఆస్పత్రుల్లో అనస్థీషియా వైద్యులను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు - పీహెచ్సీల్లో 572 స్టాఫ్ నర్సుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని మంత్రి సూచించారు. బుధవారం మంగళగిరిలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో ఫ్యామిలీ ఫిజిషియన్ విధానం పురోగతిపై మంత్రి విడదల రజినీ సమీక్ష నిర్వహించారు. 

"ప్రజల నుండి విశేషస్పందన"

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్ ను సమర్థంగా నిర్వహించి క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలు, ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ విధానం ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై అధికారులు నిరంతరం కసరత్తు చేయాలని మంత్రి ఆదేశించారు. అక్టోబర్ 21 వ తేదీ నుండి ఫ్యామిలీ ఫిజిషియన్ ట్రయల్ న్ ప్రారంభం అయిందని, అప్పటి నుండి ఈ పథకానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని వెల్లడించారు. ఫ్యామిలీ డాక్టర్ విధానానికి సంబంధించి తాను స్వయంగా ప్రజల నుండి అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. వారి నుండి అద్భుతమైన స్పందన కనిపిస్తోందని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 97,011 మంది బీపీ బాధితులు, 66,046 మధుమేహ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మూడు వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల 733 వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లకు రెండు సార్లు 104 మొబైల్ మెడికల్ యూనిట్ - ఎంఎంయూ వాహనాలు వెళ్లాయని, సిబ్బంది గ్రామాలకే వెళ్లి వైద్య పరీక్షల సేవలు అందించారని పేర్కొన్నారు. మరో 4 వేల 267 విలేజ్ హెల్త్ క్లినిక్ లకు 104 ఎంఎంయూ వాహనాలు ఒకసారి వెళ్లాయని వివరించారు. 

"ఖాళీలన్నీ భర్తీ చేశాం"

రాష్ట్ర వైద్య రంగానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం తాపత్రయ పడుతున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ పేర్కొన్నారు. వైద్య రంగ అభివృద్ధికి సీఎం ఎంతో కృషి చేస్తున్నారని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని వైఎస్సార్ ఆరోగ్య విశ్వ విద్యాలయంలో అండర్ గ్రాడ్యూయేట్ విద్యార్థులకు రీసెర్చ్ ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. వైద్య శాఖలో ఒక్క ఖాళీ కూడా లేకుండా పెద్ద ఎత్తున భర్తీ చేశామని ఈ క్రమంలో మంత్రి విడదల రజినీ వెల్లడించారు. వైఎస్సార్ హల్త్ వర్సిటీ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు సైతం పరిశోధనల్లో ప్రోత్సహించడం ప్రశంసనీయమని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఈ రీసెర్చ్ ఫలితాలు గ్రామీణ ప్రజలకు సైతం అందాలని పేర్కొన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:  బట్లర్‌ వీరోచిత శతకం , చివరి బంతికి  రాజస్థాన్‌  గెలుపు
బట్లర్‌ వీరోచిత శతకం , చివరి బంతికి రాజస్థాన్‌ గెలుపు
ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Raja Singh: శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KKR vs RR Match Highlights | లాస్ట్ ఓవర్ థ్రిల్లర్..KKR పై రాజస్థాన్ సూపర్ విక్టరీ | IPL 2024 | ABPCivils Ranker Sahana Interview | యూపీఎస్సీ ఫలితాల్లో కరీంనగర్ యువతి సత్తా | ABP DesamCivils Ranker Arpitha Khola Interview | IPS అవుతున్నారుగా.. ఏం మార్చగలరు..! | ABP DesamCivils Ranker Dheeraj Reddy Interview | ప్లాన్ 'B' నమ్ముకున్నా.. అందుకే సివిల్స్ సాధించా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:  బట్లర్‌ వీరోచిత శతకం , చివరి బంతికి  రాజస్థాన్‌  గెలుపు
బట్లర్‌ వీరోచిత శతకం , చివరి బంతికి రాజస్థాన్‌ గెలుపు
ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Raja Singh: శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
CM Jagan: కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతారు, నేనడిగితే తప్పా - పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతారు, నేనడిగితే తప్పా - పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
Nidhhi Agerwal: 'రాజా సాబ్' సెట్స్‌లో అడుగుపెట్టిన ఇస్మార్ట్ బ్యూటీ - షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?
'రాజా సాబ్' సెట్స్‌లో అడుగుపెట్టిన ఇస్మార్ట్ బ్యూటీ - షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Embed widget