అన్వేషించండి

Amara Raja Groups Donation: ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత

AP Floods Donation | అమర రాజా సంస్థ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా కు రూ.2 కోట్లు, తెలంగాణకు రూ 1 కోటి రూపాయలు విరాళం అందించింది. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది.

Donations for flood victims in AP and Telangana | విజయవాడ/ తిరుపతి: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు అమర రాజా గ్రూప్ ముందుకొచ్చింది. అంతర్జాతీయ వ్యాపార సంస్, అమర రాజా గ్రూప్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వరద సహాయక చర్యలకు తమ వంతు సహాయం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 2 కోట్లు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 1 కోటి విరాళాలు అందించింది అమర్ రాజా సంస్థ. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇటీవల వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు ఆ సంస్థ ఆపన్న హస్తం అందించింది.

అమరరాజా గ్రూపు (Amara Raja Group) సహ వ్యవస్థాపకురాలు గల్లా అరుణ కుమారి, అమర రాజా ఎనర్జీ & మొబిలిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమాదిత్య గౌరినేని హైదరాబాద్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రూ.1 కోటి చెక్కును అందజేశారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమ విరాళాలకు సంబంధించిన రూ.2 కోట్ల చెక్కును అందజేశారు.

వారు త్వరగా కోలుకోవాలని గల్లా జయదేవ్ ఆకాంక్ష

అమర రాజా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ జయదేవ్ గల్లా మాట్లాడుతూ.. "వరదల వల్ల తీవ్ర నష్టం జరిగింది. ఊహించని ఈ వరదల కారణంగా సంభవించిన విధ్వంసం లెక్కలేనన్ని కుటుంబాలను, ఎంతో మంది జీవనోపాధిని ప్రభావితం చేసింది. ఇంతకాలం మాకు మద్దతుగా ఉన్న వారిని ఆదుకోవడం మా కర్తవ్యంగా అమర రాజా భావిస్తోంది. ఈ కష్ట కాలంలో మేం అందిస్తున్న ఈ విరాళం, వరద బాధితులను ఆదుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలలో భాగం. వరదల వల్ల  ప్రభావితమైన వారు త్వరగా కోలుకోవాలి. వరద బాధితుల పునరావాసానికి తమ సాయం దోహదపడుతుందని’ ఆకాంక్షించారు.


Amara Raja Groups Donation: ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత

ఏపీ మంత్రి నారా లోకేష్‌ను కలిసిన పలువురు ప్రముఖులు

భారీ వర్షాలతో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు మరికొందరు ముందుకొచ్చారు. ఈ మేరకు ఉండవల్లిలోని నివాసంలో పలువురు ప్రముఖులు, వివిధ సంస్థల నిర్వాహకులు ఏపీ మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. ఎస్వీ యూనివర్సిటీ (SV University) ఇంఛార్జ్ వీసీ సీహెచ్.అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు నేతృత్వంలో బోధన, బోధనేతర సిబ్బంది, ఉపాధ్యాయ, శాశ్వత ఉద్యోగులు, టైం స్కేల్ ఉద్యోగులు, NMR ఉద్యోగులు, టీచింగ్ అసిస్టెంట్స్, పెన్షనర్లు కలిపి రూ.47,46,380 విరాళం అందించారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్, అమలాపురానికి చెందిన చెరుకూరి రామచంద్రరావు రూ.5 లక్షల చొప్పున సాయం చేశారు.


Amara Raja Groups Donation: ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత

హైదరాబాద్ కు చెందిన బొటిక్ నిర్వాహకురాలు ఎమ్.సునీత రూ.2,35,000, గుంటూరుకు చెందిన శ్రీరంగ మెడికల్ ఏజెన్సీ నిర్వాహకులు రామస్వామి రూ.1,11,111, విజయవాడ నిడమానురుకు చెందిన లాల్ బీ రూ.55,555, హైదరాబాద్ కు చెందిన పొట్లూరి సాయి నాగార్జున రూ.50 వేలు విరాళం ఇచ్చారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుకొచ్చిన వారందరికీ మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: Vijayawada Floods: విజయవాడ వరద బాధితులకు చంద్రబాబు బిగ్ గుడ్‌న్యూస్ - భారీగా ఆర్థిక సాయం ప్రకటన

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget