అన్వేషించండి

Flood Effect: వరద ముంపు పునరావాస కేంద్రంలోనే కలెక్టర్‌ భోజనం- ప్రజాప్రతినిధులకు అక్కడే భోజనం

తూర్పు గోదావరి జిల్లా వరద బాధితుల పునరావాస కేంద్రంలోని లబ్దిదారుల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ మాధవీలత, అధికారులు పరిశీలించారు. లంచ్ సమయంలో బాధితులతో కలిసి భోజనం చేశారు.

రాజమహేంద్రవరం రూరల్‌లోని ధవళేశ్వరం పునరావాస కేంద్రంలో ముంపు ప్రాంతాలలోని కుటుంబాలకు వసతి ఏర్పాట్లు చేశారు. మంగళవారం మధ్యాహ్నం ధవళేశ్వరంలోని వాడపేట ఎంపిపి పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని కలెక్టర్‌ మాధవీలత ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్వాసితులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ... పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు ఇంటిని తలపించేలా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. నిర్వాసితులు వారి ఇళ్లను వదిలి పునరావాస కేంద్రాలకు వచ్చినందున చక్కని ఆహారం, దుప్పట్లు, చక్కని శానిటేషన్ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. వరద బాధితులను గుర్తించి వారికి ప్రభుత్వ పరంగా రూ.2 వేలు ఆర్థిక సహాయం, నిత్యావసర సరకులు 25 కేజీలు బియ్యం, లీటరు పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజి బంగళాదుంప, ఐదు రకాల కూరగాయలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అధికారులు ఎప్పుడు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందచేయాలని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.

ఈ పునరావాస కేంద్రాల ఏర్పాట్లలో అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు, సచివాలయ వాలంటీర్ వ్యవస్థలు మెరుగైన పనితీరు చూపుతున్నారని మాధవీలత పేర్కొన్నారు. వరదల సమయంలో వాలంటీర్లు పనితీరును కలెక్టర్ ప్రశంసించారు మాధవీలత. పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించడం, గోదావరి గట్లు తెగిపోకుండా చూడడంలో, సమాచార లోపం రాకుండా అధికారులతో సమన్వయంతో చక్కటి పనితీరు చూపినట్లు పేర్కొన్నారు.

నిర్వాసితులతో కలెక్టర్ మాట్లాడుతూ పునరావాస కేంద్రాల్లో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీసి, వారితో కలిసి కలెక్టర్, రూడా చైర్ పర్సన్ భోజనం చేశారు. ఏర్పాట్ల పట్ల నిర్వాసితులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పునరావాస కేంద్రంలో ఉన్న నిర్వాసితులకు నిత్యవసర వస్తువులు నగదు పంపిణీ చేశారు.

వరదలు కారణంగా తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. గోదావరి నది పరివాహక ప్రాంతాలలోని ప్రజలు నానా అవస్థలు పడ్డారు. నీళ్లు, భోజనం దొరక్క ఇబ్బంది పడ్డారు. చిన్న పిల్లలకు తాగేందుకు పాలు కూడా దొరకలేదు. దీంతో ప్రభుత్వం ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంది.

ఇప్పటికే ఏరియల్ వ్యూ ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరద ప్రాంతాలను పరిశీలన చేశారు. శుక్రవారం ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోనసీమలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతుంది. వరద ప్రభావిత గ్రామాలలో విష సర్పాల బెడద తీవ్రంగా కనిపిస్తుంది. మరోపక్క వ్యాధుల బెడద కూడా అంతే స్థాయిలో ఆందోళన కలిగిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కోనసీమలో వరద  కష్టాలు తలుచుకుంటే చాలు కళ్ళల్లో నీళ్లు తిరిగేలా చేస్తున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
ChatGPT vs Human Brain : ప్రతి పనికి AI, ChatGPT ఉపయోగించే అలవాటు మానుకోండి.. లేదంటే మీ బ్రైయిన్ హాంఫట్
ప్రతి పనికి AI, ChatGPT ఉపయోగించే అలవాటు మానుకోండి.. లేదంటే మీ బ్రైయిన్ హాంఫట్

వీడియోలు

రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
ChatGPT vs Human Brain : ప్రతి పనికి AI, ChatGPT ఉపయోగించే అలవాటు మానుకోండి.. లేదంటే మీ బ్రైయిన్ హాంఫట్
ప్రతి పనికి AI, ChatGPT ఉపయోగించే అలవాటు మానుకోండి.. లేదంటే మీ బ్రైయిన్ హాంఫట్
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
New Kia Seltos: అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
Embed widget