అన్వేషించండి

Mylavaram : మైలవరం వైసీపీలో కుమ్ములాటలు, సీఎం జగన్ జోక్యంతో ఫుల్ స్టాప్ పడేనా?

మైలవరం పంచాయతీకి ఇక ఫుల్ స్టాప్ పడినట్లేనా? లేక కొనసాగింపు ఉంటుందా? నేరుగా జగన్ జోక్యం చేసుకోవటంతో ఈ వ్యవహరం ఇంతటితో ఆగినట్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సీఎం జగన్ పార్టీలో నేతల మధ్య విభేదాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా రాజకీయం హాట్ గా మారిన నేపథ్యంలో అలాంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నా నేరుగా ముఖ్యమంత్రే వాటి పరిష్కారంపై శ్రద్ధ చూపిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు తన్నులాటకు దిగటంతో క్యాడర్ గందరగోళం ఏర్పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఇదే నియోజకవర్గంలో సొంత పార్టీకి చెందిన నేతలు గ్రూపులుగా ఏర్పడటంపై జగన్  సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. స్థానిక శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ ఉండగా, అదే నియోజకవర్గంలో ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఏకైక మంత్రిగా ఉన్న జోగి రమేశ్ కూడా జోక్యం చేసుకుంటున్నారు. తన పాత నియోజకవర్గం కావటం, తన తండ్రి ఇతర కుటుంబ సభ్యులు సైతం అదే నియోజకవర్గంలో పార్టీ కోసం ఆవిర్భావం నుంచి కష్టపడటంతో జోగి రమేశ్ మైలవరం నియోజకవర్గం వైపు మనసు పెట్టుకున్నారు. దీంతో అక్కడ జోగి రమేశ్ వర్గం ఒకటి ఏర్పడి, స్థానిక శాసన సభ్యుడిగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ కు వ్యతిరేకంగా పనిచేయటం మొదలుపెట్టింది. ఇది వసంతకు ఇబ్బందిగా మారింది. ఒకే పార్టీలో ఉండి కూడా స్థానిక శాసనసభ్యుడికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేపట్టటం, అదే సమయంలో జోగికి మంత్రి పదవి రావడంతో వసంత అవమానంగా భావించారు. 

పార్టీ పెద్దల వద్ద తెగని పంచాయితీ 

మైలవరంలో మంత్రి జోగి రమేశ్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మధ్య విభేదాలపై ఇరువురు నేతలు బాహాటంగానే కామెంట్స్ చేసుకున్నారు. అయితే ఈ వ్యవహరంపై పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పంచాయితీ కూడా చేశారు. అయినా ఇరువురు నేతలు తమ వైఖరిని మార్చుకోలేదు. దీంతో ఈ వ్యవహరాన్ని కృష్ణా, గుంటూరు జిల్లాల కోఆర్డినేటర్ గా ఉన్న మర్రి రాజశేఖర్ వద్దకు చేర్చారు. అయినా అక్కడ పంచాయితీ తెగలేదు. చివరకు ముఖ్యమంత్రి జగన్ నేరుగా జోక్యం చేసుకున్నారు. మైలవరంలో నీకేంటి పని అంటూ మంత్రి జోగి రమేశ్ ను జగన్ ను ప్రశ్నించారని, ఎవరి నియోజకవర్గాల్లో వారు పని చేయాలని తెగేసి చెప్పటంతో వ్యవహరం కొలిక్కి వచ్చిందని నేతలు అంటున్నారు. 

వివాదం తెర పడిందా? 

ముఖ్యమంత్రి జోక్యంతో ఈ వివాదం సమసిపోయిందని ఎవరి పనివారు చేసుకుంటామని వసంత వెల్లడించారు. అంతే కాదు తాను ఎప్పటికీ జగన్ వెంటే ఉంటానని క్లారటీ ఇచ్చారు. గతంలో తాను పార్టీ మారుతున్నానని అనేక రకాలుగా తప్పుడు ప్రచారాలు చేశారని అన్నారు. తన తండ్రి చేసిన వ్యాఖ్యలతో తనకు ముడిపెట్టి, పార్టీలో ఉన్నా కోవర్ట్ గా ముద్ర వేసేందుకు ప్రయత్నం జరిగిందని, అయితే ఈ విషయంపై జగన్ కు అన్ని వివరాలను అందించి, జరిగిన వ్యవహారాలు అన్ని ఆయనకు వివరించటంతో సమస్య పరిష్కారం అయ్యిందని వసంత స్పష్టం చేశారు. ఇకనైనా ఇద్దరు నేతలు వివాదాల విడిచిపెట్టి పార్టీ కోసం పనిచేస్తారో లేదో వేచిచూడాలి. 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
PDS Rice Smuggling: మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Embed widget