అన్వేషించండి

MP GVL Narasimha: వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిరాసక్తత వల్లే ఏపీ అధ్వాన్నంగా ఉంది - ఎంపీ జీవీఎల్‌

MP GVL Narasimha: వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిరాసక్తత వల్లే ఆంధ్ర రాష్ట్రంలో ఐటీ రంగం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని, అట్టడుగు స్థాయికి చేరుకుందని ఎంపీ జీవీఎల్ నరసింహ రావు అన్నారు. 

MP GVL Narasimha: వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిరాసక్తత వల్లే ఆంధ్రప్రదేశ్ పని తీరు అధ్వాన్నంగా ఉందని ఎంపీ జీవీఎల్‌ నరసింహ తెలిపారు. భారతదేశం నుంచి సాఫ్ట్‌వేర్ ఎగుమతులు రూ. 11.59 లక్షల కోట్లు కాగా.. ఏపీ నుంచి కేవలం రూ.1290 కోట్లు మాత్రమే ఉండడమే అందుకు నిదర్శనం అన్నారు. 2021-22లో భారతదేశం నుండి సాఫ్ట్‌వేర్ ఎగుమతుల ఏ మేరకు ఉన్నాయని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమాధానం తెలిపారు. ఇందులో ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ రంగాల నుండి ఎగుమతులు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. మొత్తం సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టిపిఐ) కింద నమోదైన యూనిట్లు రూ.6.29 లక్షల కోట్లు కాగా, సెజ్ కింద నమోదైన యూనిట్లు రూ.5.3 లక్షల కోట్లుగా ఉన్నాయని మంత్రి రాజీవ్ చంద్రశేఖర్  పేర్కొన్నారు.

అత్యధిక సాఫ్ట్‌వేర్ ఎగుమతులు కలిగిన రాష్ట్రాలు కర్ణాటక (3.96 లక్షల కోట్లు), మహారాష్ట్ర (రూ.2.37 లక్షల కోట్లు), తెలంగాణ (1.81 లక్షల కోట్లు) అని వివరించారు. దీనితో పోల్చితే, ఆంధ్రప్రదేశ్ నుండి ఎగుమతులు కేవలం రూ. 1256 కోట్లు, ఇది భారతదేశ ఎగుమతుల విలువలో కేవలం 0.1% శాతం మాత్రమేనని అన్నారు. పెద్ద సంఖ్యలో ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలు మరియు సాంకేతిక సంస్థలతో విశాఖపట్నం నగరం రూ.776 కోట్ల మేర ఐటీ/ఐటీల ఎగుమతులకు మాత్రమే దోహద పడిందన్నారు. 

"ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు సాఫ్ట్ వేర్ రంగాన్ని శాసిస్తున్నారన్నది వాస్తవం. అందునా ఆంధ్ర ప్రదేశ్ నుంచి వెళ్లినటువంటి సాఫ్ట్ వేర్ రంగ నిపుణులు దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థల్లో పని చేసి ఐటీ రంగానికి విశిష్ట సేవలు అందిస్తున్నారు. దీనిపై నేను ఈరోజు పార్లమెంట్ ప్రశ్నం అడగడం జరిగింది. వచ్చిన సమాధానం చూస్తే.. ఆంధ్ర ప్రదేశ్ లో సాఫ్ట్ వేర్ రంగం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందని తెలుస్తుంది. దీనికి వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఐటీ రంగాన్ని ఏమాత్రం అభివృద్ధి చెందకుండా మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు. ఐటీ రంగంలో విశిష్ట స్థాయిలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటే ఆంధ్ర యువతకు మీరు ఎందుకు ఇలాంటి పరిస్థితి కల్పిస్తున్నారు. ఎవరిని అడిగినా మేము హైదరాబాద్ లో , బెంగళూరులో పని చేస్తున్నామని చెబుతున్నారే తప్ప విజయవాడలో, విశాఖలో చేస్తున్నామని మాత్రం ఏ ఒక్కరూ చెప్పడం లేదు. అందుకు కారణం వైసీపీ ప్రభుత్వ అలసత్వమే. ఇప్పటికైనా చర్యలు తీసుకొని రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలి" - జీవీఎల్ నరసింహరావు, ఎంపీ

అయితే దీనిపై ఎంపీ జీవీఎల్ నసరింహ రావు స్పందిస్తూ... వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందిని, దీని ఫలితంగా సాఫ్ట్‌వేర్ రంగం దయనీయంగా మారిందని తెలిపారు. అత్యంత విజయవంతమైన మరియు సమర్థవంతమైన ఐటీ మానవ వనరులను అందించడంలో దేశానికి మరియు ప్రపంచానికి అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగం నుండి పూర్తిగా లేకపోవడం దిగ్భ్రాంతికరం అని అన్నారు. ఏపీలో ఐటీ రంగం అభివృద్ధి చెందేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని చురుగ్గా కోరుతూనే ఉంటానని, ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను మార్చగల సామర్థ్యం ఉన్న ఐటీ రంగాన్ని రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం విస్మరించడం మానుకోవాలని ఎంపీ జీవీఎల్ కోరారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Embed widget