అన్వేషించండి

MP GVL Narasimha: వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిరాసక్తత వల్లే ఏపీ అధ్వాన్నంగా ఉంది - ఎంపీ జీవీఎల్‌

MP GVL Narasimha: వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిరాసక్తత వల్లే ఆంధ్ర రాష్ట్రంలో ఐటీ రంగం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని, అట్టడుగు స్థాయికి చేరుకుందని ఎంపీ జీవీఎల్ నరసింహ రావు అన్నారు. 

MP GVL Narasimha: వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిరాసక్తత వల్లే ఆంధ్రప్రదేశ్ పని తీరు అధ్వాన్నంగా ఉందని ఎంపీ జీవీఎల్‌ నరసింహ తెలిపారు. భారతదేశం నుంచి సాఫ్ట్‌వేర్ ఎగుమతులు రూ. 11.59 లక్షల కోట్లు కాగా.. ఏపీ నుంచి కేవలం రూ.1290 కోట్లు మాత్రమే ఉండడమే అందుకు నిదర్శనం అన్నారు. 2021-22లో భారతదేశం నుండి సాఫ్ట్‌వేర్ ఎగుమతుల ఏ మేరకు ఉన్నాయని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమాధానం తెలిపారు. ఇందులో ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ రంగాల నుండి ఎగుమతులు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. మొత్తం సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టిపిఐ) కింద నమోదైన యూనిట్లు రూ.6.29 లక్షల కోట్లు కాగా, సెజ్ కింద నమోదైన యూనిట్లు రూ.5.3 లక్షల కోట్లుగా ఉన్నాయని మంత్రి రాజీవ్ చంద్రశేఖర్  పేర్కొన్నారు.

అత్యధిక సాఫ్ట్‌వేర్ ఎగుమతులు కలిగిన రాష్ట్రాలు కర్ణాటక (3.96 లక్షల కోట్లు), మహారాష్ట్ర (రూ.2.37 లక్షల కోట్లు), తెలంగాణ (1.81 లక్షల కోట్లు) అని వివరించారు. దీనితో పోల్చితే, ఆంధ్రప్రదేశ్ నుండి ఎగుమతులు కేవలం రూ. 1256 కోట్లు, ఇది భారతదేశ ఎగుమతుల విలువలో కేవలం 0.1% శాతం మాత్రమేనని అన్నారు. పెద్ద సంఖ్యలో ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలు మరియు సాంకేతిక సంస్థలతో విశాఖపట్నం నగరం రూ.776 కోట్ల మేర ఐటీ/ఐటీల ఎగుమతులకు మాత్రమే దోహద పడిందన్నారు. 

"ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు సాఫ్ట్ వేర్ రంగాన్ని శాసిస్తున్నారన్నది వాస్తవం. అందునా ఆంధ్ర ప్రదేశ్ నుంచి వెళ్లినటువంటి సాఫ్ట్ వేర్ రంగ నిపుణులు దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థల్లో పని చేసి ఐటీ రంగానికి విశిష్ట సేవలు అందిస్తున్నారు. దీనిపై నేను ఈరోజు పార్లమెంట్ ప్రశ్నం అడగడం జరిగింది. వచ్చిన సమాధానం చూస్తే.. ఆంధ్ర ప్రదేశ్ లో సాఫ్ట్ వేర్ రంగం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందని తెలుస్తుంది. దీనికి వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఐటీ రంగాన్ని ఏమాత్రం అభివృద్ధి చెందకుండా మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు. ఐటీ రంగంలో విశిష్ట స్థాయిలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటే ఆంధ్ర యువతకు మీరు ఎందుకు ఇలాంటి పరిస్థితి కల్పిస్తున్నారు. ఎవరిని అడిగినా మేము హైదరాబాద్ లో , బెంగళూరులో పని చేస్తున్నామని చెబుతున్నారే తప్ప విజయవాడలో, విశాఖలో చేస్తున్నామని మాత్రం ఏ ఒక్కరూ చెప్పడం లేదు. అందుకు కారణం వైసీపీ ప్రభుత్వ అలసత్వమే. ఇప్పటికైనా చర్యలు తీసుకొని రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలి" - జీవీఎల్ నరసింహరావు, ఎంపీ

అయితే దీనిపై ఎంపీ జీవీఎల్ నసరింహ రావు స్పందిస్తూ... వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందిని, దీని ఫలితంగా సాఫ్ట్‌వేర్ రంగం దయనీయంగా మారిందని తెలిపారు. అత్యంత విజయవంతమైన మరియు సమర్థవంతమైన ఐటీ మానవ వనరులను అందించడంలో దేశానికి మరియు ప్రపంచానికి అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగం నుండి పూర్తిగా లేకపోవడం దిగ్భ్రాంతికరం అని అన్నారు. ఏపీలో ఐటీ రంగం అభివృద్ధి చెందేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని చురుగ్గా కోరుతూనే ఉంటానని, ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను మార్చగల సామర్థ్యం ఉన్న ఐటీ రంగాన్ని రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం విస్మరించడం మానుకోవాలని ఎంపీ జీవీఎల్ కోరారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
Why YSRCP Fire Brands Silent: వైసీపీలో అసలైన ఫైర్ బ్రాండ్స్ సైలెంట్ - పార్ట్ టైమ్ పాలిటిక్స్‌కే మొగ్గు- ఫుల్ టైం ఎప్పటి నుంచి ?
వైసీపీలో అసలైన ఫైర్ బ్రాండ్స్ సైలెంట్ - పార్ట్ టైమ్ పాలిటిక్స్‌కే మొగ్గు- ఫుల్ టైం ఎప్పటి నుంచి ?
Amaravati Mega Metropolitan Region: అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
Trainee IPS Uday Krishna Reddy Remand: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Warangal Viral News: వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
Embed widget