అన్వేషించండి

MP GVL Narasimha: వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిరాసక్తత వల్లే ఏపీ అధ్వాన్నంగా ఉంది - ఎంపీ జీవీఎల్‌

MP GVL Narasimha: వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిరాసక్తత వల్లే ఆంధ్ర రాష్ట్రంలో ఐటీ రంగం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని, అట్టడుగు స్థాయికి చేరుకుందని ఎంపీ జీవీఎల్ నరసింహ రావు అన్నారు. 

MP GVL Narasimha: వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిరాసక్తత వల్లే ఆంధ్రప్రదేశ్ పని తీరు అధ్వాన్నంగా ఉందని ఎంపీ జీవీఎల్‌ నరసింహ తెలిపారు. భారతదేశం నుంచి సాఫ్ట్‌వేర్ ఎగుమతులు రూ. 11.59 లక్షల కోట్లు కాగా.. ఏపీ నుంచి కేవలం రూ.1290 కోట్లు మాత్రమే ఉండడమే అందుకు నిదర్శనం అన్నారు. 2021-22లో భారతదేశం నుండి సాఫ్ట్‌వేర్ ఎగుమతుల ఏ మేరకు ఉన్నాయని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమాధానం తెలిపారు. ఇందులో ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ రంగాల నుండి ఎగుమతులు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. మొత్తం సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టిపిఐ) కింద నమోదైన యూనిట్లు రూ.6.29 లక్షల కోట్లు కాగా, సెజ్ కింద నమోదైన యూనిట్లు రూ.5.3 లక్షల కోట్లుగా ఉన్నాయని మంత్రి రాజీవ్ చంద్రశేఖర్  పేర్కొన్నారు.

అత్యధిక సాఫ్ట్‌వేర్ ఎగుమతులు కలిగిన రాష్ట్రాలు కర్ణాటక (3.96 లక్షల కోట్లు), మహారాష్ట్ర (రూ.2.37 లక్షల కోట్లు), తెలంగాణ (1.81 లక్షల కోట్లు) అని వివరించారు. దీనితో పోల్చితే, ఆంధ్రప్రదేశ్ నుండి ఎగుమతులు కేవలం రూ. 1256 కోట్లు, ఇది భారతదేశ ఎగుమతుల విలువలో కేవలం 0.1% శాతం మాత్రమేనని అన్నారు. పెద్ద సంఖ్యలో ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలు మరియు సాంకేతిక సంస్థలతో విశాఖపట్నం నగరం రూ.776 కోట్ల మేర ఐటీ/ఐటీల ఎగుమతులకు మాత్రమే దోహద పడిందన్నారు. 

"ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు సాఫ్ట్ వేర్ రంగాన్ని శాసిస్తున్నారన్నది వాస్తవం. అందునా ఆంధ్ర ప్రదేశ్ నుంచి వెళ్లినటువంటి సాఫ్ట్ వేర్ రంగ నిపుణులు దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థల్లో పని చేసి ఐటీ రంగానికి విశిష్ట సేవలు అందిస్తున్నారు. దీనిపై నేను ఈరోజు పార్లమెంట్ ప్రశ్నం అడగడం జరిగింది. వచ్చిన సమాధానం చూస్తే.. ఆంధ్ర ప్రదేశ్ లో సాఫ్ట్ వేర్ రంగం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందని తెలుస్తుంది. దీనికి వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఐటీ రంగాన్ని ఏమాత్రం అభివృద్ధి చెందకుండా మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు. ఐటీ రంగంలో విశిష్ట స్థాయిలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటే ఆంధ్ర యువతకు మీరు ఎందుకు ఇలాంటి పరిస్థితి కల్పిస్తున్నారు. ఎవరిని అడిగినా మేము హైదరాబాద్ లో , బెంగళూరులో పని చేస్తున్నామని చెబుతున్నారే తప్ప విజయవాడలో, విశాఖలో చేస్తున్నామని మాత్రం ఏ ఒక్కరూ చెప్పడం లేదు. అందుకు కారణం వైసీపీ ప్రభుత్వ అలసత్వమే. ఇప్పటికైనా చర్యలు తీసుకొని రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలి" - జీవీఎల్ నరసింహరావు, ఎంపీ

అయితే దీనిపై ఎంపీ జీవీఎల్ నసరింహ రావు స్పందిస్తూ... వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందిని, దీని ఫలితంగా సాఫ్ట్‌వేర్ రంగం దయనీయంగా మారిందని తెలిపారు. అత్యంత విజయవంతమైన మరియు సమర్థవంతమైన ఐటీ మానవ వనరులను అందించడంలో దేశానికి మరియు ప్రపంచానికి అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగం నుండి పూర్తిగా లేకపోవడం దిగ్భ్రాంతికరం అని అన్నారు. ఏపీలో ఐటీ రంగం అభివృద్ధి చెందేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని చురుగ్గా కోరుతూనే ఉంటానని, ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను మార్చగల సామర్థ్యం ఉన్న ఐటీ రంగాన్ని రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం విస్మరించడం మానుకోవాలని ఎంపీ జీవీఎల్ కోరారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: 10 రోజుల్లో నాలుగోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
10 రోజుల్లో నాలుగోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
YSRCP Political Strategy Failures: వ్యూహాత్మక తప్పిదమా? లేక సెల్ఫ్ గోల్స్? జగన్ ప్రెస్ మీట్లు ఎందుకు బెడిసికొడుతున్నాయి!
వ్యూహాత్మక తప్పిదమా? లేక సెల్ఫ్ గోల్స్? జగన్ ప్రెస్ మీట్లు ఎందుకు బెడిసికొడుతున్నాయి?
Pawan Kalyan Politics: జనసేనకు పవన్ కళ్యాణ్ మార్క్ రిపేర్లు.. క్షేత్రస్థాయి పర్యటనలు మొదలుపెట్టిన డిప్యూటీ సీఎం
జనసేనకు పవన్ కళ్యాణ్ మార్క్ రిపేర్లు.. క్షేత్రస్థాయి పర్యటనలు మొదలుపెట్టిన డిప్యూటీ సీఎం
Heatwave In AP And Telangana: వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Politics: జనసేనకు పవన్ కళ్యాణ్ మార్క్ రిపేర్లు.. క్షేత్రస్థాయి పర్యటనలు మొదలుపెట్టిన డిప్యూటీ సీఎం
జనసేనకు పవన్ కళ్యాణ్ మార్క్ రిపేర్లు.. క్షేత్రస్థాయి పర్యటనలు మొదలుపెట్టిన డిప్యూటీ సీఎం
Heatwave In AP And Telangana: వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
YSRCP Political Strategy Failures: వ్యూహాత్మక తప్పిదమా? లేక సెల్ఫ్ గోల్స్? జగన్ ప్రెస్ మీట్లు ఎందుకు బెడిసికొడుతున్నాయి!
వ్యూహాత్మక తప్పిదమా? లేక సెల్ఫ్ గోల్స్? జగన్ ప్రెస్ మీట్లు ఎందుకు బెడిసికొడుతున్నాయి?
Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
Medigadda Fire Accident: మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
CM Chandrababu: లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
IPL 2026 Play Offs Shchedule: రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
Embed widget