అన్వేషించండి

Amarraja Issue : అమరరాజా వెళ్లడం కాదు ...ప్రభుత్వమే దండం పెట్టి పొమ్మంటోంది : సజ్జల

అమరరాజా సంస్థ కాలుష్య కారకమని దండం పెట్టి ఏపీ నుంచి వెళ్లిపొమ్మని చెబుతున్నామని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సజ్జల ప్రకటించారు.


ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారిన అమరరాజా పరిశ్రమను తమిళనాడుకు తరలిస్తున్న అంశంలో ప్రభుత్వం తరపున సలహాదారు  సూటిగా స్పందించారు. అమరరాజా వెళ్లడం కాదు... తాము వెళ్లిపొమ్మంటున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.  ప్రభుత్వం తరపున మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అమర్‌రాజా తరలింపు అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై స్పందించిన ఆయన .. . తామే దణ్ణం పెట్టి "వెళ్లిపొమ్మంటున్నామని" నేరుగా చెప్పేశారు. అమరరాజాతో ఉద్యోగులకు.. స్థానికులకు తీవ్రమైన సమస్యలు వస్తున్నాయని చెప్పారు.  అమర రాజా సంస్థ కాలుష్యంతో ప్రజల ఆరోగ్యం  క్షీణిస్తోందని..అది విష తుల్యమైన పరిశ్రమ అని ఆయన అన్నారు.  ఈ విషయాన్ని హైకోర్టు కూడా చెప్పిందని సజ్జల మీడియాతో వ్యాఖ్యానించారు. 

అయితే రాజకీయాలకు.. అమరరాజా సంస్థతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు సంబంధం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. కేవలం పొల్యూటెడ్ అయినందునే... దండం పెట్టి తాము.. వెళ్లి పొమ్మని చెబుతున్నామని అంటున్నారు. ఈ విషయాన్ని తెలుగుదేశం రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తోందని.. ప్రజల ఆరోగ్యం కంటే తమకు ఏదీ ముఖ్యం కాదని చెప్పారు.  టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా సంస్థ ... వాహనాలకు అవసరమైన బ్యాటరీలు, ఇన్వర్టర్ బ్యాటరీల తయారీలో ప్రపంచంలోనే ప్రముఖ కంపెనీగా ఉంది. అమరాన్ బ్రాండ్ పేరుతో ఉత్పత్తులు అమ్ముతూంటారు. భవిష్యత్ లో అంతా లిథియం ఆయాన్ బ్యాటరీల హవా నడుస్తుందన్న ఉద్దేశంతో.. చిత్తూరులో వాటికి సంబంధించిన ప్లాంట్ పెట్టాలని అనుకున్నారు. 

ఇప్పుడు ఆ ప్లాంట్‌ను తమిళనాడులో పెట్టేందుకు అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా పారిశ్రామిక వర్గాల్లో ప్రచారం జరగడం సంచలనం సృష్టించింది. ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా తేలికగా తీసుకున్నట్లుగా ఉందని.. సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లోనే అర్థమవుతోంది. విభజన తర్వాత ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉంది. పారిశ్రామికీకరణ జరిగితేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని అనుకుంటున్నారు. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున పరిశ్రమల్ని ఆకర్షించేందుకు ప్రయత్నించింది. అయితే అనూహ్యంగా ప్రస్తుత ప్రభుత్వం.. తామే పరిశ్రమల్ని దండం పెట్టి వెళ్లిపొమ్మని చెబుతున్నామని ప్రకటించడం...  సంచలనంగా మారింది. 

అమరరాజా సంస్థ ద్వారా కొన్ని వేల మంది చిత్తూరు జిల్లాలో ఉపాధి పొందుతున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కనీసం పదిహేను వేల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయని చెబుతున్నారు.  అమరరాజా కంపెనీ ఇష్యూ  రాజకీయంగా కలకలం రేపే అవకాశం కనిపిస్తోంది. అమరరాజా కంపెనీ ఇంత వరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. తరలింపుఅంశం కానీ.. తమిళనాడులో ప్లాంట్ పెట్టాలనుకున్న అంశంపైనా స్పందించలేదు. కానీ రాజకీయంగా మాత్రం దుమారం రేగుతోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Snake In Meeting: కౌన్సిల్ సమావేశానికి నాగుపామును తెచ్చిన సభ్యుడు.. మంత్రి నియోజకవర్గంలో షాకింగ్ సీన్
కౌన్సిల్ సమావేశానికి నాగుపామును తెచ్చిన సభ్యుడు.. మంత్రి నియోజకవర్గంలో షాకింగ్ సీన్
Geetu Royal: తిరుమల గుడి ముందు రీల్స్‌కు రి'యాక్షన్'... గీతూ రాయల్‌కు ఏడుపు ఒకటే తక్కువ
తిరుమల గుడి ముందు రీల్స్‌కు రి'యాక్షన్'... గీతూ రాయల్‌కు ఏడుపు ఒకటే తక్కువ
AP Free Bus: దివ్యాంగులకు శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ!
దివ్యాంగులకు శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ!
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, పక్కా ఇళ్లు- నలుగురు అధికారులపై వేటు!
వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, పక్కా ఇళ్లు- నలుగురు అధికారులపై వేటు!

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Embed widget