Breaking News: రేవంత్ చిలక మనదే.. పలుకు పరాయిది.. మంత్రి కేటీఆర్ ఎద్దేవా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఆగస్టు 27న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
కర్నూలు జిల్లా అల్లూరు సబ్ రిజిస్టర్ శ్రీనివాసులును స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ కిరణ్ కుమార్ సస్పెండ్ చేశారు. రెండు రోజుల క్రితం అల్లూరు రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేసింది. లెక్కల్లో చూపిన రూ.75 వేల నగదు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీనిపై విచారించిన డీఐజీ కిరణ్ కుమార్, సబ్ రిజిస్టర్ శ్రీనివాసులు సస్పెండ్ చేశారు.
తెలంగాణలో కొత్తగా 339 కోవిడ్ కేసులు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 339 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 80,568 శాంపిళ్లను పరీక్షించగా.. ఈ మేరకు వెల్లడైంది. గత 24 గంటల వ్యవధిలో ఇద్దరు కోవిడ్ కారణంగా మరణించారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్లో వెల్లడించింది. వీరితో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 3,867కి చేరింది. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిలో నిన్న ఒక్క రోజే 417 మంది కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం రికవరీల సంఖ్య 6.46 లక్షలకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,166 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తమిళనాడు గవర్నర్ భన్వర్లాల్ పురోహిత్కు అదనపు బాధ్యతలు..
తమిళనాడు గవర్నర్ భన్వర్లాల్ పురోహిత్కు పంజాబ్, ఛండీగర్ రాష్ట్రాల గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలిపారు.
President Ram Nath Kovind appoints Banwarilal Purohit, Governor of Tamil Nadu to discharge the functions of Governor of Punjab, in addition to his own duties from the date he assumes charge of the office of the Governor of Punjab, until regular arrangements are made.
— ANI (@ANI) August 27, 2021
(File pic) pic.twitter.com/L7fZLCNSaG





















