అన్వేషించండి

YS Jagan: జ‌గ‌న్ పాల‌న‌లో రూ.850 కోట్ల యాడ్స్ స్కామ్ - అసెంబ్లీలో లెక్కలు బయటపెట్టిన కూటమి నేతలు

YS Jagan News: హయాంలో జ‌రిగిన యాడ్స్ స్కాంపై హౌస్‌ కమిటీ వేయాలని తెలుగుదేశం ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. స‌మాచార ప్ర‌సార శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి స్పీక‌ర్‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు.

AP News: వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌క‌ట‌నల పేరుతో భారీగా నిధుల దుర్వినియోగం జ‌రిగింద‌ని అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి మంత్రులు ఆరోప‌ణ‌లు చేశారు. అసెంబ్లీ స‌మావేశాల ముగింపు రోజైన శుక్ర‌వారం ఏపీ అసెంబ్లీలో ప‌త్రిక‌ల‌కు యాడ్స్ ఇవ్వ‌డంలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయని, వాటిపై విచార‌ణ జ‌ర‌పాల‌ని టీడీపీ స‌భ్యులు డిమాండ్ చేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, తెనాలి శ్రవణ్‌కుమార్‌, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్‌ మాట్లాడారు. 2019-24 మధ్య రూ.850 కోట్ల మేర పత్రికల్లో ప్రకటనలకు ఖర్చు చేశారని తెలిపారు. దీనిపై హౌస్ కమిటీ వేయాలని వారు డిమాండ్ చేశారు. డిజిటల్ మీడియా ద్వారా వందల కోట్లు దోచి పెట్టారని, మీడియాను అడ్డుపెట్టుకుని జగన్ అడ్డగోలుగా వ్యవహరించారని పలువురు మంత్రులు ఆరోపించారు. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారన్నారు. వారికి కావాల్సిన మీడియాకే నిబంధనలకు విరుద్ధంగా యాడ్స్ ఇచ్చి లబ్ధి చేకూర్చారని ఆరోపించారు.

ప్రతి 15 రోజులకు తమకు కావాల్సిన పత్రికలు, మీడియాలో నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు ఇచ్చి అనుచిత లబ్ధి కలిగించారన్నారు. నాటి సీఎం జగన్‌ సతీమణి ఆధ్వర్యంలో నడిచిన సాక్షి పత్రికకు పెద్ద ఎత్తున ప్రకటనల డబ్బు చెల్లించారని ఆరోపించారు. ఈ సమావేశంలో కూటమి మంత్రులు అసెంబ్లీ వేదికగా గత వైసీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు. ఐదేళ్లలో సాక్షి పత్రికకు రూ.403 కోట్లు, . ఈనాడుకు 190 కోట్లు, ఆంధ్రజ్యోతికి కేవలం రూ.21 లక్షలు మాత్రమే ఇచ్చారని శ్రావణ్ కుమార్ అన్నారు. మిగతా పత్రికలన్నింటికీ రూ.488 కోట్ల మేర ప్రకటనలు ఇచ్చారని అని మంత్రి పార్థసారథి తెలిపారు. ఇది పెద్ద కుంభకోణం..వెంటనే విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

అనంతరం సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దీనిపై వివరణ ఇచ్చారు. సభ్యుల డిమాండ్‌ మేరకు హౌస్‌ కమిటీ వేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఈ అంశంపై స్పీకర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 2019-24 మధ్య ప్రకటనల్లో పక్షపాత ధోరణి వాస్తవమేనని.. దీనిపై విచారణ జరిపిస్తామని వెల్లడించారు. ఒక్క సాక్షి పత్రికకే రూ.400కోట్ల మేర కేటాయించారని మంత్రి తెలిపారు.

గ‌తేడాది యాడ్స్ లెక్క‌లు బ‌య‌ట‌పెట్టిన వైసీపీ ప్ర‌భుత్వం

గ‌త ఏడాది మార్చిలో జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశంలోనూ ఇదే విధంగా అంత‌కుముందు అధికారంలో ఉన్న చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌ల కోసం భారీగా ఖ‌ర్చు చేసింద‌ని వైసీపీ ప్ర‌భుత్వం ఆరోపించింది. 2014-19 వ‌ర‌కు తెలుగుదేశం ప్రభుత్వం యాడ్స్ కోసం రూ.449 కోట్లు ఖర్చు చేసింద‌ని అసెంబ్లీలో నాటి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వివ‌రించారు. యాడ్స్ ఇచ్చే వ్యవహారంలో పారదర్శకత లేకుండా  ఇష్టానుసారంగా ఎవరికి పడితే వాళ్లకి యాడ్స్ ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్రానికి సంబంధం లేని ఇతర రాష్ట్రాలకు చెందిన పేపర్లకు కూడా యాడ్స్ ఇచ్చార‌ని వివ‌రించారు. తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పత్రికలకు పెద్దపీట వేశారని విమ‌ర్శించారు. ఈనాడు పత్రికకు 50 శాతం రేటు పెంచి రూ.120 కోట్లు యాడ్స్ ఇచ్చారన్నారు.

సర్కులేషన్‌ లో మూడో స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి నిబంధనలను తుంగలోకి తొక్కి రూ.72 కోట్ల యాడ్స్ ఇచ్చారని వేణు మండిపడ్డారు. రెండో స్థానంలో ఉన్న సాక్షి పేపర్‌కు కేవలం రూ.30 కోట్ల యాడ్స్ మాత్రమే ఇచ్చారని తెలిపారు. చంద్ర‌బాబు ప్రభుత్వంలో ఒక ఏజెన్సీ ద్వారా యాడ్స్ ఇచ్చేవారని, ఆ ఏజెన్సీకి 15 శాతం కమిషన్ ఇచ్చేవారని ఆరోపించారు. తాము మాత్రం డైరెక్టుగా యాడ్స్ ఇవ్వటం వల్ల రూ.80 కోట్లు ఆదా చేశామ‌ని మంత్రి చెల్లుబోయిన వేణు ఆరోజు అసెంబ్లీలో వివ‌రించారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నేడు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్‌ పర్యటన-సీదిరి అప్పలరాజుతో ములాఖత్‌
నేడు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్‌ పర్యటన-సీదిరి అప్పలరాజుతో ములాఖత్‌
Amaravati Mega Metropolitan Region: అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
Deepam 2 Scheme: ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ.139.53 కోట్లు విడుదల
ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ.139.53 కోట్లు విడుదల
Thalliki Vandanam Cybercrime: తల్లికి వందనం పథకంలో సైబర్ మోసం.. 28 మంది అకౌంట్లలో నగదు మాయం, ట్విస్ట్ ఏంటంటే
తల్లికి వందనం పథకంలో సైబర్ మోసం.. 28 మంది అకౌంట్లలో నగదు మాయం, ట్విస్ట్ ఏంటంటే

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
Embed widget