అన్వేషించండి

అమరావతికి పార్లమెంటు అండగా ఉంటుందని ప్రధాని హామీ ఇచ్చారు: చంద్రబాబు

Chandrababu Comments: అమరావతి రాజధాని కోసం పార్లమెంటు అండగా నిలుస్తుందని చంద్రాబుబు తెలిపారు. అమరావతి ఏ కులానికో, కొందరికో పరిమితం కాదని.. ఆ సంకల్పం వృథా పోదని స్పష్టం చేశారు.

Chandrababu Comments: ఏపీ రాజధానిగా అమరావతికి  పార్లమెంటు అండగా ఉంటుందని ప్రధాని మోదీ చెప్పినట్లు టీడీపీ నేత చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు ప్రధాని తనతో ఓ మాట చెప్పారని అన్నారు. అందేంటంటే... పవిత్రమైన యమునా జలాల్ని, చట్టాలు చేసే పార్లమెంటు ఆవరణ నుంచి మట్టి తెచ్చానని చెప్పి.. దాని ఉద్దేశం అమరావతికి ఆయన అండగా ఉంటానని చెప్పడమే అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆ మాటలు ఇప్పటికీ తన చెవుల్లో వినిపిస్తున్నాయని అన్నారు. ఈ సంకల్పం వృథా పోదని.. అంతిమంగా ధర్మమే గెలుస్తుందంటూ కామెంట్లు చేశారు. అమరావతి పరిరక్షణకు రైతులు చేస్తున్న పోరాటం కచ్చితంగా విజయం సాధిస్తుందన్నారు. 

కావాలనుకుంటే తిరుపతిలోనే రాజధాని పెట్టుకునేవాడిని..

వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నట్లుగా అమరావతి ఏ కులానికో, ఏ కొందరికో పరిమితం కాదని తెలిపారు. అమరావతిని ఐదు కోట్ల మంది ప్రజలకు మేలే చేసే ప్రజారాజధానిగా నిర్మించాలనుకున్నట్లు స్పష్టం చేశారు. ప్రాంతమో, కులమో చూసుకుంటే.. తిరుపతిలోనే రాజధానిని పెట్టుకునేవాడినని, నారావారి పల్లె నుంచి రంగంపేట, తిరుపతి వరకు వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని తెలిపారు.  కానీ తాను శాశ్వతం కాదని, నవ్యాంధ్రకు రాజధాని మాత్రమే శాశ్వతం అని ఆలోచించి.. అమరావతి రాజధానిగా చేయాలనుకున్నట్లు చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

జగన్ చెప్పిన దాని కంటే 24 వేల ఎకరాలు ఎక్కువ..

అయితే సీనియర్ పాత్రికేయుడు కందుల రమేష్ రచించిన అమరావతి వివాదాలు-వాస్తవాలు అన్న పుస్తకాన్ని గురువారం విజయవాడలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ క్రమంలోనే ఆయన అమరావతి గురించి చాలా విషయాలను తెలిపారు. అమరావతిపై వైసీపీ నాయుకులు, ప్రభుత్వం ప్రజల్లో సృష్టించిన అపోహల్ని కందుల రమేష్ తన పుస్తకంతో తొలగించారని, వాస్తవాలను మాత్రమే పేర్కొన్నారని చెప్పుకొచ్చారు. గుంటూరు విజయవాడ మధ్య 30 వేల ఎకరాల్లో రాజధాని పెడితే తమకు అభ్యంతరం లేదని ప్రతిపక్ష నేతగా జగన్ అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు. అలాగే రైతులు ఇచ్చింది, ప్రభుత్వ భూమి కలిపి రాజధానికి 54 వేల ఎకరాలు సమీకరించామని.. జగన్ చెప్పినదాని కన్నా 24 వేల ఎకరాలు ఎక్కువ ఉండగా... ఆయనకు అభ్యంతరం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. 

వైఎస్ఆర్ కూడా ప్రారంభించిన పనులు ఆపలేదు..

అమరావతి ఏ ఒక్కరికో పరిమితం కాదని.. అలా అనుకుంటే హైదరాబాద్ ని ఏ కులం కోసం అభివృద్ధి చేశానని అన్నారు. అమరావతిని అంత అభివృద్ధి చేశాక కూడా గత ఎన్నికల్లో ఎస్పీ స్థానమైన తాడికొండలో తెదేపా ఓడిపోయింది. హైదరాబాద్ ని అభివృద్ధి చేశాక... 2004 ఎన్నికల్లో ఖైరతాబాద్ లో ఓడిపోయామని.. కాబట్టి అభివృద్ధికి, ఎన్నికలకు సంబంధం లేదని చంద్రబాబు పేర్కొన్నారు. వైఎస్ హయాంలో కూడా తాను ప్రారంభించిన ఏ ఒక్క అబివృద్ధి పనిని అతను ఆపలేరని గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వాలు కూడా అలా చేయలేవని.. అందుకే హైదరాబాద్ అంతగా అభివృద్ధి చెందిందని తెలిపారు. అమరావతిని రాజధానిగా, విశాఖను ఆర్థిక రాజధానిగా, తిరుపతిని మరో మహా నగరంగా అభివృద్ధి చేయాలని సంకల్పించామని కేంద్ర విభజన చట్టం ప్రకారం మంజూరు చేసిన సంస్థల్ని రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని తెలిపారు. 

టాప్ హెడ్ లైన్స్

Tiger Hunt in Polavaram: ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP and Telangana: ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
Shreyas Iyer News: గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
Tiger Hunt in Polavaram: ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
Ramani Kalyanam OTT : ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Maruti Suzuki Announces Attractive Discounts: మారుతి సుజుకి కార్లపై ఊహించని రేంజ్ లో ఆఫర్ల వర్షం: కొత్త కార్ కొనాలనుకునే వారికి ఇదే బెస్ట్ టైమ్..
కొత్త కార్ కొనాలనుకునే వారికి ఇదే బెస్ట్ టైమ్.. విక్టోరిస్ మోడల్ పై భారీ తగ్గింపు.. స్విఫ్ట్, బ్రెజ్జా, వ్యాగన్ ఆర్ పై అదిరే ఆఫర్లు
B.Tech Student Missing: హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
Kamal Haasan : పుష్పక విమానం సీక్వెల్... 45 ఏళ్ల క్రితం స్టోరీ - కట్ చేస్తే సింగ్ గీతం... కమల్ హాసన్ చెప్పిన సీక్రెట్
పుష్పక విమానం సీక్వెల్... 45 ఏళ్ల క్రితం స్టోరీ - కట్ చేస్తే సింగ్ గీతం... కమల్ హాసన్ చెప్పిన సీక్రెట్
Embed widget