అన్వేషించండి

అమరావతికి పార్లమెంటు అండగా ఉంటుందని ప్రధాని హామీ ఇచ్చారు: చంద్రబాబు

Chandrababu Comments: అమరావతి రాజధాని కోసం పార్లమెంటు అండగా నిలుస్తుందని చంద్రాబుబు తెలిపారు. అమరావతి ఏ కులానికో, కొందరికో పరిమితం కాదని.. ఆ సంకల్పం వృథా పోదని స్పష్టం చేశారు.

Chandrababu Comments: ఏపీ రాజధానిగా అమరావతికి  పార్లమెంటు అండగా ఉంటుందని ప్రధాని మోదీ చెప్పినట్లు టీడీపీ నేత చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు ప్రధాని తనతో ఓ మాట చెప్పారని అన్నారు. అందేంటంటే... పవిత్రమైన యమునా జలాల్ని, చట్టాలు చేసే పార్లమెంటు ఆవరణ నుంచి మట్టి తెచ్చానని చెప్పి.. దాని ఉద్దేశం అమరావతికి ఆయన అండగా ఉంటానని చెప్పడమే అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆ మాటలు ఇప్పటికీ తన చెవుల్లో వినిపిస్తున్నాయని అన్నారు. ఈ సంకల్పం వృథా పోదని.. అంతిమంగా ధర్మమే గెలుస్తుందంటూ కామెంట్లు చేశారు. అమరావతి పరిరక్షణకు రైతులు చేస్తున్న పోరాటం కచ్చితంగా విజయం సాధిస్తుందన్నారు. 

కావాలనుకుంటే తిరుపతిలోనే రాజధాని పెట్టుకునేవాడిని..

వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నట్లుగా అమరావతి ఏ కులానికో, ఏ కొందరికో పరిమితం కాదని తెలిపారు. అమరావతిని ఐదు కోట్ల మంది ప్రజలకు మేలే చేసే ప్రజారాజధానిగా నిర్మించాలనుకున్నట్లు స్పష్టం చేశారు. ప్రాంతమో, కులమో చూసుకుంటే.. తిరుపతిలోనే రాజధానిని పెట్టుకునేవాడినని, నారావారి పల్లె నుంచి రంగంపేట, తిరుపతి వరకు వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని తెలిపారు.  కానీ తాను శాశ్వతం కాదని, నవ్యాంధ్రకు రాజధాని మాత్రమే శాశ్వతం అని ఆలోచించి.. అమరావతి రాజధానిగా చేయాలనుకున్నట్లు చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

జగన్ చెప్పిన దాని కంటే 24 వేల ఎకరాలు ఎక్కువ..

అయితే సీనియర్ పాత్రికేయుడు కందుల రమేష్ రచించిన అమరావతి వివాదాలు-వాస్తవాలు అన్న పుస్తకాన్ని గురువారం విజయవాడలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ క్రమంలోనే ఆయన అమరావతి గురించి చాలా విషయాలను తెలిపారు. అమరావతిపై వైసీపీ నాయుకులు, ప్రభుత్వం ప్రజల్లో సృష్టించిన అపోహల్ని కందుల రమేష్ తన పుస్తకంతో తొలగించారని, వాస్తవాలను మాత్రమే పేర్కొన్నారని చెప్పుకొచ్చారు. గుంటూరు విజయవాడ మధ్య 30 వేల ఎకరాల్లో రాజధాని పెడితే తమకు అభ్యంతరం లేదని ప్రతిపక్ష నేతగా జగన్ అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు. అలాగే రైతులు ఇచ్చింది, ప్రభుత్వ భూమి కలిపి రాజధానికి 54 వేల ఎకరాలు సమీకరించామని.. జగన్ చెప్పినదాని కన్నా 24 వేల ఎకరాలు ఎక్కువ ఉండగా... ఆయనకు అభ్యంతరం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. 

వైఎస్ఆర్ కూడా ప్రారంభించిన పనులు ఆపలేదు..

అమరావతి ఏ ఒక్కరికో పరిమితం కాదని.. అలా అనుకుంటే హైదరాబాద్ ని ఏ కులం కోసం అభివృద్ధి చేశానని అన్నారు. అమరావతిని అంత అభివృద్ధి చేశాక కూడా గత ఎన్నికల్లో ఎస్పీ స్థానమైన తాడికొండలో తెదేపా ఓడిపోయింది. హైదరాబాద్ ని అభివృద్ధి చేశాక... 2004 ఎన్నికల్లో ఖైరతాబాద్ లో ఓడిపోయామని.. కాబట్టి అభివృద్ధికి, ఎన్నికలకు సంబంధం లేదని చంద్రబాబు పేర్కొన్నారు. వైఎస్ హయాంలో కూడా తాను ప్రారంభించిన ఏ ఒక్క అబివృద్ధి పనిని అతను ఆపలేరని గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వాలు కూడా అలా చేయలేవని.. అందుకే హైదరాబాద్ అంతగా అభివృద్ధి చెందిందని తెలిపారు. అమరావతిని రాజధానిగా, విశాఖను ఆర్థిక రాజధానిగా, తిరుపతిని మరో మహా నగరంగా అభివృద్ధి చేయాలని సంకల్పించామని కేంద్ర విభజన చట్టం ప్రకారం మంజూరు చేసిన సంస్థల్ని రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని తెలిపారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"ఒక్కో ఉద్యోగం 40 లక్షలు" టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు 
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
YS Jagan News: ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే
ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News:
"ఒక్కో ఉద్యోగం 40 లక్షలు" టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు 
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
Karnataka Minister Ramalinga Reddy : కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
Peddi Collections: ఇండియాలో 'పెద్ది' ఫస్ట్ డే నెట్ ఎంత? ఏ లాంగ్వేజ్‌లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
ఇండియాలో 'పెద్ది' ఫస్ట్ డే నెట్ ఎంత? ఏ లాంగ్వేజ్‌లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
Embed widget