అన్వేషించండి

AP Employees News: ఏపీ సర్కారుతో చర్చలు విఫలం - ఛలో విజయవాడ కంటిన్యూ, ఉద్యోగుల హెచ్చరిక

Employes News: ప్రభుత్వ తీరుపై ఉద్యోగ సంఘాలు మండిపాటు, ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని ఆగ్రహం..ఉద్యమం కొనసాగించాలని నిర్ణయం; పునరాలోచించుకోవాలని కోరిన ప్రభుత్వం

Employes Agitations: ప్రభుత్వంతో చర్చలు విఫలమైనందున  ఉద్యమాన్ని కొనసాగించాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఈనెల 27న తలపెట్టిన చలో విజయవాడ(Vijayawada) కార్యక్రమంల యథాతథంగా కొనసాగుతుందని ఉద్యోగ సంఘం నేతలు స్పష్టం చేశారు. గత సమావేశాల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ ప్రభుత్వం నెరవేర్చలేదని  ఉద్యోగ సంఘ నేతలు మండిపడ్డారు. మధ్యంతర భృతి(I.R) ప్రకటించాలని అడుగుతుంటే జులైలో పీర్సీ(PRC) అమలు చేస్తామని తప్పించుకునేలా  ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల డిమాండ్ల విషయంలో ప్రభుత్వం నుంచి ఏమైనా పురోగతి కనిపిస్తే..అప్పుడు మరోసారి రాష్ట్ర కార్యవర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని లేకపోతే గతంలో ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ యథాతథంగా ఉంటుందని ఉద్యోగ సంఘ నేతలు  తెలిపారు..

ఉద్యోగుల పోరుబాట
డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఉద్యమ పోరు నుంచి వెనక్కి తగ్గేది లేదని ఏపీ ఉద్యోగులు స్పష్టం చేశారు. మంత్రుల కమిటీతో జరిపిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేనందున ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తామని ఉద్యోగ సంఘ నేతలు బండి శ్రీనివాసరావు(Bandi Srinivasarao), బొప్పరాజు వెంకటేశ్వర్లు(Bopparaju Venkateswarlu) తెలిపారు. సంప్రదాయం ప్రకారం పీఆర్సీ నియమించినప్పుడు  అది అమలయ్యే వరకు మధ్యంతర భృతి(I.R) ఇవ్వడం ఆనవాయితీ అని దాన్ని ప్రకటించాలని కోరితే  జులై 31 లోపు పీఆర్సీ సెటిల్ చేస్తామని చెబుతోందన్నారు. పెండింగ్ బకాయిలే ఇవ్వలేని ప్రభుత్వం....14వేల 800కోట్ల పీఆర్సీ అరియర్స్ ఎక్కడ నుంచి తీసుకొచ్చి ఇస్తుందని ఉద్యోగ సంఘాలు ప్రశ్నించాయి. అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ , గత పీఆర్సీ అరియర్ లు, ఉద్యోగ విరమణ చేసిన  వారికి చెల్లింపులు పై స్పష్టత ఇస్తామని గత సమావేశంలో మంత్రుల కమిటీ చెప్పింది. కానీ ఇప్పటికీ వాటిపై స్పష్టత ఇవ్వలేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. తాము చేసిన డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పిందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దకరణకు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఇబ్బందులు పెడుతోందన్నారు. 10 వేల మందిని రెగ్యులర్ చేస్తామని చెప్పి ఇప్పటికీ 1300 మందిని మాత్రమే చేశారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు(Bopparjau) మండిపడ్డారు. గత సమావేశంలో చెప్పిన వాటిని ప్రభుత్వం ఇంకా నెరవేర్చాల్సి ఉందని ఏపీ జేసీసీ(AP JAC) అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు  అన్నారు. 30శాతం ఐఆర్ ప్రకటించాలని కోరితే...ప్రభుత్వం మాత్రం జూన్ నెలాఖరు కల్లా మొత్త పీఆర్సీ ఇస్తామని చెప్పిందన్నారు. పీఆర్సీ అరియర్స్ పైనా క్లారిటీ ఇవ్వలేదన్నారు.

పెండింగ్ బకాయిలు చెల్లుంపు, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం చెబుతున్న దానికి, చేస్తున్నదానికి ఎక్కడా పొంతన కుదరడం లేదన్నారు.

ప్రభుత్వం వాదన
ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించడానికి  ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana)తెలిపారు. మార్చి నెలాఖరు కల్లా బకాయిల చెల్లింపు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పీఆర్సీని పూర్తిస్థాయిలో ప్రకటించనున్నందున  ఐఆర్ గురించి ఆలోంచాల్సిన అవసరం లేదన్నారు. క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పై  వచ్చిన వినతిపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ నెల 27 చలో విజయవాడ ను విరమించుకోమని  ఉద్యోగ సంఘ నేతలను కోరామని....వారి నుంచి సానుకూల నిర్ణయమే వస్తుందని ఆశిస్తున్నామన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Deepam 2 Scheme: ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ.139.53 కోట్లు విడుదల
ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ.139.53 కోట్లు విడుదల
Thalliki Vandanam Cybercrime: తల్లికి వందనం పథకంలో సైబర్ మోసం.. 28 మంది అకౌంట్లలో నగదు మాయం, ట్విస్ట్ ఏంటంటే
తల్లికి వందనం పథకంలో సైబర్ మోసం.. 28 మంది అకౌంట్లలో నగదు మాయం, ట్విస్ట్ ఏంటంటే
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
Embed widget