Pratigya Rally: 70 ఏళ్లలో దేశాన్ని కాంగ్రెస్ నిర్మిస్తే.. 7 ఏళ్లలో భాజపా అమ్మేసింది: ప్రియాంక గాంధీ

ABP Desam Updated at: 31 Oct 2021 06:44 PM (IST)
Edited By: Murali Krishna

70వ ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎన్నో నిర్మిస్తే.. 7 ఏళ్ల పాలనలో భాజపా వాటిని అమ్ముకుంటోందని ప్రియాంక గాంధీ విమర్శించారు.

'70 ఏళ్లలో దేశాన్ని కాంగ్రెస్ నిర్మిస్తే.. 7 ఏళ్లలో భాజపా అమ్మేసింది'

NEXT PREV

ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. గోరఖ్‌పుర్‌లో జరిగిన ప్రతిజ్ఞ ర్యాలీలో భాజపాపై విమర్శలు గుప్పించారు. రైతుల ఆందోళన సహా పలు సమస్యలపై భాజపాను ప్రశ్నించారు.







లఖింపుర్ ఖేరీలో రైతులను హత్య చేసి వారి బాధను కూడా వినే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఇది యోగి సర్కార్ దుస్థితి. రైతుల బాధలను ఎవరూ వినే పరిస్థితిలో లేరని ఈ ఘటనతో అర్థమైంది. దళితులు, ఓబీసీలు, పేదలు, మైనార్టీలు, బ్రాహ్మణులు ఇలా ఈ సర్కార్‌ అందరినీ మోసం చేసింది. ప్రతిరోజూ మోసం చేస్తూనే ఉంది.  గురు గోరఖ్‌నాథ్ ప్రవచనాలకు విరుద్ధంగా యోగి ఆదిత్య నాథ్ సర్కార్‌ను నడుపుతున్నారు. నా సోదరీమణలకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీ తరఫున పోరాడటానికి నేను, కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నాం. మీకు అధికారం రావాలని నేను అనుకున్నాను. అందుకే మీకు అవకాశం ఇచ్చేందుకే 40 శాతం సీట్లు మహిళలకే కేటాయించాను. మీరే ఈ రాజకీయాలను మార్చగలరు.                                               -  ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి


ఈరోజు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెను ప్రియాంక గుర్తుచేసుకున్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఇందిరా గాంధీ దేనికీ తలొగ్గలేదన్నారు.







హత్య చేస్తారని ఆమెకు (ఇందిరా గాంధీ) తెలుసు. కానీ ఎప్పుడూ తలొగ్గలేదు. మీరు ఆమెపై ఉంచిన విశ్వాసం కంటే ఏదీ ఎక్కువ కాదని తనకు తెలుసు. ఆమె నేర్పించిన పాఠాలతోనే నేను ఈ రోజు మీ ముందు నిల్చున్నా. నేను కూడా మీ నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ముచేయను.                      -                          ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి


కాంగ్రెస్ నిర్మిస్తే..


ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపైనా ప్రియాంక గాంధీ ధ్వజమెత్తారు. 70 ఏళ్ల పాలనలో రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, ఎన్నో దిగ్గజ సంస్థలు, కంపెనీలను కాంగ్రెస్ నిర్మించిందని ప్రియాంక అన్నారు. అయితే ఈ ఏడేళ్ల పాలనలో భాజపా వాటిని అమ్ముకనే పనిలో ఉందని ప్రియాంక ఘాటు విమర్శలు చేశారు.


Also Read: National Unity Day 2021: 'భారతజాతి ఐక్యత, సమగ్రతను ఎవరూ దెబ్బతీయలేరు'


Also Read: Pee Power Project: ఏం ఐడియా సర్‌జీ..! ఛీఛీ అనుకోకండి.. దీంతో ఇంటి మొత్తానికి కరెంట్!


Also Read:Restaurant Update: పిజ్జా, బర్గర్లను కుమ్మేస్తున్నారా? వాటిలో ప్లాస్టిక్‌లో వాడే కెమికల్స్ ఉన్నాయట!


Also Read: G20 Summit: 'ప్రపంచానికి బాసటగా భారత్.. 2022 చివరి నాటికి 500 కోట్ల టీకా డోసులు'


Also Read: Dehradun: లోయలో పడిన వాహనం.. 11 మంది మృతి, నలుగురికి గాయాలు


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 12,830 కేసులు, 446 మరణాలు


Also read: ఈ అయిదు పనులు చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం... ముందుజాగ్రత్తపడమంటున్న వైద్యులు


Also read:  తెల్లవెంట్రుక పీకేస్తే... అవి మరింత ఎక్కువవుతాయంటారు నిజమేనా?


Also read: ఇది మంగళసూత్రం ప్రకటనా లేక లోదుస్తుల ప్రకటనా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 31 Oct 2021 06:41 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.