ABP  WhatsApp

National Unity Day 2021: 'భారతజాతి ఐక్యత, సమగ్రతను ఎవరూ దెబ్బతీయలేరు'

ABP Desam Updated at: 31 Oct 2021 03:57 PM (IST)
Edited By: Murali Krishna

సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు.

National Unity Day 2021: 'భారతజాతి ఐక్యత, సమగ్రతను ఎవరూ దెబ్బతీయలేరు'

'భారతజాతి ఐక్యతా, సమగ్రతను ఎవరూ దెబ్బతీయలేరు'

NEXT PREV

సర్దార్ వలభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను కీర్తించారు. 'ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్' కోసం సర్దార్ వల్లభ్​భాయ్ పటేల్ తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రతి ఒక్క భారతీయుడి హృదయాల్లో సర్దార్ పటేల్ చిరస్థాయిగా నిలిచి ఉన్నారన్నారు. ఈ మేరకు వీడియో సందేశం ఇచ్చారు మోదీ.






దేశ ఐక్యతకు ప్రతీక..


పటేల్​ జయంతి సందర్భంగా గుజరాత్​ కెవాడియాలోని ఐక్యతా విగ్రహం వద్దకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్లారు. 'రాష్ట్రీయ ఏక్తా దివస్​' పరేడ్​ను వీక్షించారు. ఒలింపిక్స్​లో పతకం సాధించిన భారత హాకీ టీం కెప్టెన్​ మన్​ప్రీత్​ సింగ్​తో పాటు మరికొందరు జట్టు సభ్యులు ఈ పరేడ్​లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రసంగించిన అమిత్ షా.. పటేల్ చేసిన కృషిని కొనియాడారు.






భారతదేశ ఐక్యత, సమగ్రతను ప్రపంచంలో ఎవరూ దెబ్బతీయలేరనే సందేశాన్ని సర్దార్​ వల్లభ్​భాయ్​ పటేల్​ ఇచ్చారని అమిత్​ షా అన్నారు. ఈ ప్రాంతం కేవలం పటేల్​ స్మారకంగానే కాకుండా దేశ భక్తిని పెంపొందించే పుణ్యక్షేత్రంగా మారిందన్నారు.



స్వాతంత్ర్యం తర్వాత దేశాన్ని ముక్కలు చేయడానికి బ్రిటీషర్లు కుట్ర పన్నారు. అయితే సర్దార్‌ పటేల్‌ వారి కుట్రను భగ్నం చేశారు. అఖండ భారత్‌ చేయాలని సంకల్పించారు. ఈ ఐక్యతా విగ్రహం దేశ ఐక్యత, సమగ్రతను ఎవరూ దెబ్బతీయలేరనే సందేశం ఇస్తుంది.                                                            - అమిత్ షా, కేంద్ర హోంమంత్రి


పటేల్​ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది అక్టోబర్​ 31న దేశం 'రాష్ట్రీయ ఏక్తా దివస్' జరుపుకుంటుంది. 


Also Read: Pee Power Project: ఏం ఐడియా సర్‌జీ..! ఛీఛీ అనుకోకండి.. దీంతో ఇంటి మొత్తానికి కరెంట్!


Also Read:Restaurant Update: పిజ్జా, బర్గర్లను కుమ్మేస్తున్నారా? వాటిలో ప్లాస్టిక్‌లో వాడే కెమికల్స్ ఉన్నాయట!


Also Read: G20 Summit: 'ప్రపంచానికి బాసటగా భారత్.. 2022 చివరి నాటికి 500 కోట్ల టీకా డోసులు'


Also Read: Dehradun: లోయలో పడిన వాహనం.. 11 మంది మృతి, నలుగురికి గాయాలు


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 12,830 కేసులు, 446 మరణాలు


Also read: ఈ అయిదు పనులు చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం... ముందుజాగ్రత్తపడమంటున్న వైద్యులు


Also read:  తెల్లవెంట్రుక పీకేస్తే... అవి మరింత ఎక్కువవుతాయంటారు నిజమేనా?


Also read: ఇది మంగళసూత్రం ప్రకటనా లేక లోదుస్తుల ప్రకటనా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 31 Oct 2021 03:55 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.