కరోనాపై పోరాటంలో భారత్ పాత్రపై ప్రధాని నరేంద్ర మోదీ.. జీ20 సదస్సు వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. 2022 చివరి నాటికి భారత్​ 500 కోట్ల కొవిడ్​ టీకా డోసులను ఉత్పత్తి చేసి కరోనా పోరాటంలో ప్రపంచానికి బాసటగా నిలుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కరోనా సంక్షోభ సమయంలో దాదాపు 150 దేశాలకు వైద్య సాయం చేసి భారత్ అండగా నిలిచిందని గుర్తుచేశారు.










ఈ మేరకు జీ-20 సదస్సులో 'ప్రపంచ ఆర్థిక, ఆరోగ్య సెషన్'​లో భాగంగా ప్రధాని మోదీ మాట్లాడారని భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా తెలిపారు. భారత్ తీసుకున్న​ సాహసోపేత ఆర్థిక సంస్కరణల గురించి కుడా మోదీ ఈ సదస్సులో వివరించారని ష్రింగ్లా వెల్లడించారు. ఆర్థిక పునరుద్ధరణ, సరఫరా గొలుసు వైవిధ్యీకరణలో భారత్​ను తమ భాగస్వామిగా మార్చుకోవాలని జీ20 దేశాలను మోదీ ఆహ్వానించారని పేర్కొన్నారు.


మోదీ స్పీచ్ హైలైట్స్..



  • అంతర్జాతీయ ప్రయాణాలు పునరుద్ధరించడం, కరోనా టీకా ధ్రుపత్రాలను పరస్పరం గుర్తించుకోవడం వంటి అంశాలను జీ-20 సదస్సులో మోదీ ప్రధానంగా ప్రస్తావించారు.

  • భారత్​ స్వదేశీ టీకా కొవాగ్జిన్​కు డబ్ల్యూహెచ్​ఓ ఆమోదం తెలపాల్సి ఉన్న విషయాన్ని పేర్కొన్నారు.

  • ఈ టీకాకు డబ్ల్యూహెచ్​ఓ ఆమోదం లభిస్తే ఇతర దేశాలకు భారత్ మరింత సాయపడగలదని వివరించారు.


Also Read: Dehradun: లోయలో పడిన వాహనం.. 11 మంది మృతి, నలుగురికి గాయాలు


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 12,830 కేసులు, 446 మరణాలు


Also read: ఈ అయిదు పనులు చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం... ముందుజాగ్రత్తపడమంటున్న వైద్యులు


Also read:  తెల్లవెంట్రుక పీకేస్తే... అవి మరింత ఎక్కువవుతాయంటారు నిజమేనా?


Also read: ఇది మంగళసూత్రం ప్రకటనా లేక లోదుస్తుల ప్రకటనా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి