దేశంలో కరోనా కేసులు 15వేల కన్నా తక్కువే నమోదయ్యాయి. కొత్తగా 12,830 కరోనా కేసులు నమోదు కాగా 446 మంది మరణించారు. 14,667 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.






ప్రస్తుతం రికవరీ రేటు 98.20%గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1 శాతం కంటే తక్కువే ఉన్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల శాతం 0.46%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం. 







  • మొత్తం కేసుల సంఖ్య: 3,42,73,300

  • యాక్టివ్ కేసులు: 1,59,272

  • మొత్తం రికవరీలు: 3,36,55,842

  • మొత్తం మరణాలు: 4,58,186

  • మొత్తం వ్యాక్సినేషన్: 1,06,14,40,335


కేరళ..


కేరళలో కొత్తగా 7,427 కేసులు నమోదుకాగా 62 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 49,61,490కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 31,514కి పెరిగింది.


మొత్తం 14 జిల్లాల్లో తిరువనంతపురంలో అత్యధికంగా 1,001 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో కోజికోడ్ (997), ఎర్నాకులం (862) ఉన్నాయి.


మహారాష్ట్ర..


మహారాష్ట్రలో కొత్తగా 1,130 కేసులు నమోదుకాగా 26 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 66,09,906కు పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 1,40,196కి చేరింది.


వ్యాక్సినేషన్​..


భారత్​లో టీకా పంపిణీ జోరుగా కొనసాగుతోంది. శనివారం మరో 68,04,806 డోసుల వ్యాక్సిన్​ అందించారు. మొత్తం ఇప్పటివరకు 1,06,14,40,335 డోసుల టీకా పంపిణీ జరిగింది.


Also read: ఈ అయిదు పనులు చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం... ముందుజాగ్రత్తపడమంటున్న వైద్యులు


Also read:  తెల్లవెంట్రుక పీకేస్తే... అవి మరింత ఎక్కువవుతాయంటారు నిజమేనా?


Also read: ఇది మంగళసూత్రం ప్రకటనా లేక లోదుస్తుల ప్రకటనా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి