కొద్ది రోజులుగా ఇంధన ధరలు మన దేశంలో క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా నేడు కూడా కొన్ని నగరాల్లో వ్యత్యాసం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో వరుసగా మళ్లీ ఇంధన ధరలు పెరిగాయి. నగరంలో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.0.36 పైసలు పెరిగి రూ.113.36గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.0.38 పైసలు పెరిగి రూ.106.60గా ఉంది. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.0.36 పైసలు పెరిగి రూ.113.24 అయింది. డీజిల్ ధర రూ.0.38 పైసలు పెరిగి రూ.106.52 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.


కరీంనగర్‌లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.66 పైసలు పెరిగి.. రూ.113.90గా ఉంది. డీజిల్ ధర రూ.0.66 పైసలు పెరిగి రూ.107.14 కు చేరింది. నిజామాబాద్‌లోనూ ఇంధన ధరలు కాస్త పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.04 పైసలు పెరిగి రూ.115.35 గా ఉంది. డీజిల్ ధర రూ.0.08 పైసలు పెరిగి రూ.108.49 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.


ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధరలు తాజాగా స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం రూ.115.94 గా ఉంది. పెట్రోల్ ధర రూ.0.48 పైసలు తగ్గింది. డీజిల్ ధర రూ.0.47 పైసలు తగ్గి రూ.108.55కి చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి.


Also Read: Aadhar Card Updates: ఆధార్‌ మిస్‌యూజ్‌ అవుతోందని డౌటా? ఫోన్‌కు ఓటీపీ రావడం లేదా? ఇలా తెలుసుకోండి!


విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.114.58గా ఉంది. గత ధరతో పోలిస్తే లీటరుకు రూ.0.10 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.107.25గా ఉంది. ఇది లీటరుకు రూ.0.14 చొప్పున పెరిగింది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.40 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి. తాజాగా స్వల్పంగా తగ్గాయి.


తిరుపతిలో ఇంధన ధరలు పెరిగాయి. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.0.35 పైసలు పెరిగి.. రూ.116.55 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఇక డీజిల్ ధర రూ.109.07గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.0.36 పైసలు పెరిగింది.


Also Read: Godrej Group Split: గోద్రేజ్‌ గ్రూప్‌ విభజన: రెండుగా విభజించేందుకు సోదరుల కసరత్తు!!


ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా అక్టోబరు 31 నాటి ధరల ప్రకారం 84.45 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.


Also Read: Gold-Silver Price: గుడ్‌న్యూస్.. దంతేరాస్ వేళ పసిడి తగ్గుముఖం.. స్వల్పంగా పెరిగిన వెండి, తాజా ధరలివే..


Also Read: Paytm IPO: పేటీఎం ఐపీవోకు సెబీ అనుమతి.. షేర్ల ధర, విలువ, లిస్టింగ్‌ వివరాలు ఇవే


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి