దేశ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పేటీఎం ఐపీవోకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ అనుమతి ఇచ్చింది. 20 బిలియన్‌ డాలర్ల విలువతో వన్‌97 కమ్యూనికేషన్స్ మార్కెట్లోకి ఎంటర్‌ అవ్వనుంది. షేర్ల ధరను రూ.2,080 - రూ.2,150 మధ్య నిర్ణయించింది. బుధవారం బీఎస్‌ఈ ఫైలింగ్‌లో ఈ వివరాలను వెల్లడించింది.


పేటీఎం ఐపీవో నవంబర్‌ 8న మొదలై 10న ముగుస్తుంది. ఫేస్‌ వాల్యూ ఒక రూపాయిగా ఉంది. ఇష్యూలో 75 శాతం అంటే రూ.13,725 కోట్లను క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయర్స్‌ (QIBs)కి రిజర్వు చేసింది. పది శాతం ఇష్యూ అంటే రూ.1830 కోట్లను రిటైల్‌ బయర్స్‌కు రిజర్వు చేసింది. ముందు రూ.16,600 కోట్ల విలువతో ఇష్యూకు రావాలనుకున్నా తర్వాత రూ.18,300 కోట్లతో వచ్చేందుకు నిర్ణయించుకుంది.


పేటీఎం ఐపీవోలో ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూ.10వేల కోట్లు, ప్రెష్‌ ఇష్యూ రూ.8300 కోట్లుగా ఉంది. స్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ, యాంట్‌ ఫైనాన్షియల్స్‌, అలీబాబా, ఎలివేషన్‌ క్యాపిటల్‌, సైఫ్‌ త్రి మారీషస్ కంపెనీ, సైఫ్‌ పార్ట్‌నర్స్‌కు పేటీఎంలో వాటాలు ఉన్నాయి. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో నెట్‌వర్త్‌పై కంపెనీ వెయిటెడ్‌ యావరేజ్‌ రిటర్న్‌ -36.9 శాతంగా ఉంది. పాన్‌ అనుసంధానమైన బ్యాంకు ఖాతా ద్వారా షేర్లు కొనుగోలు చేయొచ్చు. ఇన్వెస్టర్లు కనీసం ఆరు ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయాలి.


Also Read: Facebook New Name: పేరు మార్చుకున్న ఫేస్‌బుక్.. ఇకపై ‘మెటా’.. ఎందుకంటే?


Also Read: Azim Premji Update: అజీమ్‌ ప్రేమ్‌జీని మించి ప్రేమించేదెవరు! రోజుకు రూ.27 కోట్లు దానం చేసిన ఆధునిక కర్ణుడు!


Also Read: Loan on Credit Card: క్రెడిట్‌ కార్డుపై రుణమా.. యమ డేంజర్‌! ఈ విషయాలు తెలుసుకున్నాకే తీసుకోండి!


Also Read: Nykaa IPO Subscription: నైకా ఐపీఓ ఆరంభం.. షేర్ల ధర, కంపెనీ ఫైనాన్షియల్స్‌ వివరాలు ఇవే


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి