ఉత్తరాఖండ్​ దెహ్రాదూన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది మరణించగా నలుగురికి గాయాలయ్యాయి. చక్రతా నుంచి వికాస్​ నగర్​వైపు వెళ్తున్న ఓ వాహనం లోయలో పడింది.






వాహనంలో మొత్తం 15 మంది ఉన్నట్లు సమాచారం. త్యూనీ రోడ్డు వద్ద ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.


సీఎం సంతాపం..






రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.






Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 12,830 కేసులు, 446 మరణాలు


Also read: ఈ అయిదు పనులు చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం... ముందుజాగ్రత్తపడమంటున్న వైద్యులు


Also read:  తెల్లవెంట్రుక పీకేస్తే... అవి మరింత ఎక్కువవుతాయంటారు నిజమేనా?


Also read: ఇది మంగళసూత్రం ప్రకటనా లేక లోదుస్తుల ప్రకటనా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి