Kangana Ranaut: కంగనాకు దిల్లీ అసెంబ్లీ సమన్లు.. సిక్కులపై వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం

ABP Desam   |  Murali Krishna   |  25 Nov 2021 05:03 PM (IST)

నటి కంగనా రనౌత్‌ తమ ముందు హాజరు కావాలని దిల్లీ అసెంబ్లీ శాంతి సామరస్య కమిటీ సమన్లు జారీ చేసింది.

కంగనా రనౌత్‌కు దిల్లీ అసెంబ్లీ సమన్లు

హీరోయిన్ కంగనా రనౌత్‌కు దిల్లీ అసెంబ్లీ సమన్లు ​జారీ చేసింది. డిసెంబర్ 6 మధ్యాహ్నం 12:00 గంటలకు కంగానా తమ ముందు హాజరు కావాలని దిల్లీ అసెంబ్లీ శాంతిసామరస్య కమిటీ ఆదేశించింది. సిక్కు సమాజంపై ఇటీవల కంగానా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ సమన్లు జారీ చేశారు. ప్రస్తుతం ఈ కమిటీ ఛైర్మన్‌గా ఆమ్‌ఆద్మీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా ఉన్నారు. 

సినీ నటి కంగనా రనౌత్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ @kanganaranaut పోస్టులో అభ్యంతరకర, నేరపూరితమైన వ్యాఖ్యలు చేసినట్లు కమిటీకి చాలా ఫిర్యాదులు వచ్చాయి. కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పబ్లిష్ చేసిన స్టోరీలు చాలా మందికి చేరే అవకాశం ఉంది. ఆమెను ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల మంది వరకు ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నారు. అలాంటి ఖాతాలో సిక్కు వర్గంపై ఆమె అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీని వల్ల సమాజంలో శాంతి సామరస్యాలు దెబ్బతినే అవకాశం ఉంది.                                         - కమిటీ ప్రకటన

నూతన సాగు చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటన చేసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో కంగనా ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో భారత్‌ను 'జిహాదిస్ట్ నేషన్' అని పిలిచారు. సిక్కులను 'ఖలిస్థానీలు'గా కంగనా పిలిచారు. 

ఖలీస్థానీ తీవ్రవాదులు ఈ రోజు ప్రభుత్వాన్ని శాసించి ఉండవచ్చు.. కానీ అలాంటి వాళ్లను తన కాలి కింద అణిచివేసిన ఒకే ఒక మహిళా ప్రధాని (ఇందిరా గాంధీ) గురించి మరిచిపోవద్దు.                                                                      - కంగనా రనౌత్, సినీ నటి
 
కంగనా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కంగనా రనౌత్‌పై దిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులో, నటి కంగనా రనౌత్ సోషల్ మీడియా ద్వారా సిక్కు సమాజంపై తప్పుడు పుకార్లను వ్యాప్తి చేసినట్లు పేర్కొన్నారు. 

ఇటీవల కంగనా తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశ స్వాతంత్య్రంపై ఆమె చేసిన వ్యాఖ్యలను విపక్షాలు సహా అధికార భాజపాలోని కొందరు నేతలు ఖండించారు. 

Also Read: NEET Counselling 2021 Postponed: నీట్ కౌన్సిలింగ్ వాయిదా.. 'ఈడబ్ల్యూఎస్‌'పై కేంద్రం పునరాలోచన!

Also Read: Toilet Paper: బాబూ చిట్టీ.. ఇదేం రాజీనామా లేఖ నాయనా.. రాసేందుకు ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదా?

Also Read: INS Vela Pics: భారత అమ్ములపొదిలో ఐఎన్ఎస్ వేలా.. ఇది చాలా స్పెషల్ గురూ!

Also Read: Watch Video: 'రోడ్లు.. కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలి.. 'ఏంటి బాబు.. ఏమన్నావు?

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 9,119 కరోనా కేసులు, 396 మరణాలు నమోదు

Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం

Published at: 25 Nov 2021 04:59 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.