‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ నుంచి ఫొటో షేర్ చేసిన ఆనంద్ సాయి - ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ!
పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. పవన్ కళ్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సంక్రాంతి బరిలో ఉండనుందని వార్తలు వస్తున్నాయి. తప్పుకుందని కూడా వినిపిస్తుంది. ఈ విషయంపై సినిమా నిర్మాతలు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ ఫొటోను సినిమా ఆర్ట్ డైరెక్టర్, పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్ ఆనంద్ సాయి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. పోలీస్ గెటప్‌లో పవన్ కళ్యాణ్, పక్కనే ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి నడుచుకుంటూ రావడం చూడవచ్చు. పవర్ స్టార్ చేతిలో కడియం, పుస్తకం కూడా ఉన్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


లండన్‌కు బయల్దేరిన రవితేజ, హై బడ్జెట్ థ్రిల్లర్‌కు రెడీ!
‘ఈగిల్’ సినిమాలోని ముఖ్యమైన పార్ట్‌ను షూట్ చేయడానికి రవితేజతో పాటు మిగతా టీమ్ అంతా లండన్‌కు ప్రయాణమయ్యింది. రవితేజతో పాటు ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న తారాగణం కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గోనుంది. ఇప్పటికే విడుదలయిన గ్లింప్స్ చూస్తుంటే.. రవితేజ పాత్రకు ఇందులో చాలా షేడ్స్ ఉన్నట్టు తెలుస్తోంది. గ్లింప్స్‌లో చూపించిన విధంగా రవితేజ.. ఒక పెయింటర్‌గా, ఒక రైతుగా.. ఇలా మరెన్నో పాత్రల్లో కనిపించనున్నట్టు అర్థమవుతోంది. ‘ఈగల్’లో రవితేజకు జోడీగా అనుపమ పరమేశ్వరన్, కావ్య తాపర్ కనిపించనున్నారు. నవదీప్, మధుబాలా లాంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'గాంఢీవధారి అర్జున' బడ్జెట్ - రోజుకు కోటి కంటే తక్కువే!
మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కథానాయకుడిగా స్టైలిష్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ సత్తారు దర్శకత్వం వహించిన యాక్షన్ సినిమా 'గాంఢీవధారి అర్జున'. ఈ నెల 25వ తేదీన అంటే ఈ శుక్రవారమే సినిమా విడుదల అవుతోంది. 'గాంఢీవధారి అర్జున' సినిమా బడ్జెట్ రూ. 55 కోట్లు దాటిందని, ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ కావడంతో నిర్మాతలు కాస్త ఇబ్బంది పడుతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ నిజానికి 'గాంఢీవధారి అర్జున' సినిమా చిత్రీకరణకు 72 రోజులు అవసరం అవుతాయని ముందుగా ప్లాన్ చేశారు. ఆ ప్రకారం షెడ్యూల్స్ వేశారు. అయితే, దర్శకుడు ప్రవీణ్ సత్తారు, హీరో వరుణ్ తేజ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ వల్ల 53 రోజుల్లో సినిమా అంతా పూర్తి చేశారు. సినిమా నిర్మాణ వ్యయం కూడా 40 కోట్ల రూపాయలే. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


‘అందాల ఆటబొమ్మ’ సాంగ్ రీక్రియేట్? ఈసారి కాజల్‌తో బాలయ్య రొమాన్స్!
ఇన్నాళ్ల సినీ కెరీర్‌లో బాలకృష్ణ.. ఎన్నో మరపురాని పాటలను ప్రేక్షకులకు అందించారు. ఆయన ప్రతీ సినిమాలో యూత్‌ను ఆకట్టుకునే ఒక మాస్ పాటతో పాటు ఒక లవ్ సాంగ్ కూడా పక్కా ఉంటుంది. అలాంటి వాటిలో ఆయన నటించిన ‘సమరసింహారెడ్డి’ చిత్రంలోని ‘అందాల ఆటబొమ్మ’ పాట కూడా ఒకటి. ఈ ఫీల్ గుడ్ లవ్ సాంగ్‌కు బాలకృష్ణ, అంజలా జవేరి కలిసి స్టెప్పులేస్తుంటే చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంటుంది అంటారు ఫ్యాన్స్. ఈ పాట ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపుగా 24 ఏళ్లు అయ్యింది. అయినా ఇప్పటికీ ఈ సాంగ్ చాలామందికి గుర్తుంది అంటే సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన లిరిక్స్‌తో పాటు మణిశర్మ సంగీతం కూడా ముఖ్య కారణమే. అలాంటి ఒక క్లాసిక్ పాటను రీమేక్ చేయాలని తాజాగా ‘భగవంత్ కేసరి’ మేకర్స్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


అనుష్క షాకింగ్ రెమ్యునరేషన్ - ఒక్క మూవీకి ఎన్ని కోట్లో తెలుసా?
తెలుగులో మన హీరోలతో సమానంగా అనుష్కకు డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో అనుష్క ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు రూ.3 కోట్ల వరకు తీసుకున్న అనుష్క ఇప్పుడు ఒక్క మూవీకి రూ.6 కోట్ల పారితోషకాన్ని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే, తన కమ్ బ్యాక్ మూవీ ‘మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి’ మూవీకి రూ.3 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలిసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)