అన్వేషించండి

AP EAPCET: ఇంజినీరింగ్ ప్రవేశాలకు 'స్పెషల్' కౌన్సెలింగ్ ప్రారంభం, నవంబరు 7 వరకు ఆప్షన్ల నమోదుకు అవకాశం

ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించిన ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నవంబరు 6న ప్రారంభమైంది.  అభ్యర్థులు నవంబరు 6, 7 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించిన ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నవంబరు 6న ప్రారంభమైంది.  అభ్యర్థులు నవంబరు 6, 7 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నవంబరు 8న అర్ధరాత్రి 12 గంటల్లోపు ఆప్షన్లు మార్చుకునే వెసులుబాటు కల్పించారు. ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు అధికారులు నవంబరు 10న సాయంత్రం 6 గంటల తర్వాత సీట్లను కేటాయించనున్నారు. ఇప్పటి వరకు ఏ కేటగిరిలోనూ సీట్లు రాని విద్యార్థులు మాత్రమే ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. 

ఆప్షన్ల నమోదుకోసం క్లిక్ చేయండి..

ప్రత్యేక విడత కౌన్సెలింగ్ షెడ్యూలు..

➥ వెబ్ ఆప్షన్ల నమోదు: 06.11.2023 -  07.11.2023

➥ వెబ్ ఆప్షన్లలో మార్పులు: 08.11.2023

➥ సీట్ల కేటాయింపు: 10.11.2023

➥ సెల్ఫ్ రిపోర్టింగ్, కళాశాలలో రిపోర్టింగ్: 11.11.2023 - 13.11.2023

Notification

Counselling Website

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో కలిపి 27 వేల వరకు సీట్లు ఉండగా.. వాటిలో ఎక్కువగా మెకానికల్, సివిల్, ఈఈఈ సీట్లే ఉన్నాయి. ఇంజినీరింగ్‌కు ఏటా మూడు విడతల కౌన్సెలింగ్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో ప్రవేశాలు పొందిన వారికి ఫీజు రీయంబర్స్‌మెంట్ కల్పిస్తారు. కన్వీనర్ కోటాలో సీట్లు మిగిలితే కళాశాలల యాజమాన్యాలు స్పాట్ కోటా కింద భర్తీ చేసుకుంటాయి. 

ఈ ఏడాది ప్రభుత్వం రెండు విడతలు మాత్రమే నిర్వహించి, మిగిలిన సీట్లను స్పాట్ కింద భర్తీ చేసుకోవాలని యాజమాన్యాలకు సూచించింది. దీంతో యాజమాన్యాలు స్పాట్ కేటగిరిలో భర్తీ చేసుకున్నాయి. ఇప్పుడు విద్యార్థుల నుంచి డిమాండ్ వస్తుందంటూ ఎక్కడా సీట్లు రాని వారి కోసం మూడో విడత చేపట్టింది. మొదటి విడతలో ప్రవేశాలు పొందినవారికి సెప్టెంబరు మొదటి వారం నుంచే తరగతులు ప్రారంభమయ్యాయి. దాదాపు రెండు నెలల తరగతులు పూర్తయ్యాయి. దాంతో ఇప్పుడు మూడో విడతలో ప్రవేశాలు పొందినవారు అకడమిక్ పరంగా వెనుకబడే పరిస్థితి నెలకొంది.

ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాల్లో ఈ ఏడాది ఎన్నడూలేని విధంగా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇంజినీరింగ్ ప్రవేశాలకు మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారనుకున్న అభ్యర్థులకు ఉన్నత విద్యామండలి షాకిచ్చిన సంగతి తెలిసిందే. మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియను పక్కనపెడుతూ.. నేరుగా 'స్పాట్‌' ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీచేసింది. అక్టోబరు 4న ప్రారంభమైన స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ అక్టోబరు 18 వరకు కొనసాగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏటా మూడు విడతల కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా.. ఈ ఏడాది రెండు విడతల కౌన్సెలింగ్ మాత్రమే ఉన్నత విద్యామండలి నిర్వహించింది. దీనిపై విమర్శలు రావడంతో ఎట్టకేలకు కౌన్సెలింగ్ నిర్వహణకు ఉన్నత విద్యామండలి ఆమోదం తెలిపింది.

ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించకుండా స్పాట్ ప్రవేశాలు నిర్వహించడంపై ఉన్నత విద్యామండలి తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. ఎట్టకేలకు ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహణను ప్రారంభించింది. విద్యార్థులు నవంబరు 6 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇది వరకు కన్వీనర్ కోటా తర్వాత స్పాట్ కేటగిరి సీట్లు భర్తీ చేస్తుండగా.. ఇప్పుడు స్పాట్ తర్వాత కన్వీనర్ కోటా చేపట్టింది. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget