అన్వేషించండి

Hyderabad News : భాగ్యనగరంలో భారీ మోసం, దూది ఇచ్చి కోట్లు దోచేశారు!

Hyderabad News : హైదరాబాద్ లో వత్తుల పేరిట భారీ మోసం చేసిందో సంస్థ. సుమారు 600 మంది వద్ద రూ.20 కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేశారు.

Hyderabad News : హైదరాబాద్ లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. వత్తుల తయారీ పేరుతో ఓ సంస్థ డిపాజిట్ దారులను నిట్టనిలువునా ముంచింది. తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించాలనే అత్యాశను ఆసరాగా చేసుకున్న ఓ సంస్థ డిపాజిట్ల పేరుతో భారీ మోసానికి పాల్పడింది. హైదరాబాద్‌ బోడుప్పల్‌లో మరో భారీ మోసం బట్టబయలైంది. దూది వత్తుల తయారీ పేరిట ఏబీజీ అనే సంస్థ పెద్దఎత్తున డిపాజిట్లు సేకరించింది. వత్తుల తయారీకి యంత్రాలు, దూది తామే ఇస్తామని నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ.1.70 లక్షలు సేకరించారు. 

రూ.20 కోట్ల మేర మోసం! 

కిలో దూదికి రూ.300 చెల్లించి తీసుకుని వత్తులు తయారు చేసి ఇస్తే రూ.600 చెల్లిస్తామని నమ్మించారు. ఆరు నెలల తర్వాత చెల్లించిన డిపాజిట్ డబ్బులు తిరిగి చెల్లిస్తామని చెప్పారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు తిరిగి వస్తుందని నమ్మిన బాధితులు పెద్దఎత్తున డిపాజిట్లు కట్టారు. రెండు నెలల సజావుగా డబ్బు చెల్లించిన సంస్థ తర్వాత పత్తాలేకుండా పోయారు. దీంతో బాధితులు ఏబీజీ కంపెనీ యజమాని బాలస్వామి గౌడ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 600 మంది నుంచి డిపాజిట్లు సేకరించినట్లు పోలీసులు విచారణ తెలిపింది. రూ.20 కోట్ల మేర నిర్వాహకులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఏబీజీ సంస్థపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

వత్తుల మిషన్లు అంటగట్టి

ఇటీవల కరక్కాయ పొడి పేరిట ఓ గ్యాంగ్ భారీగా డిపాజిట్లు సేకరించి ముంచేసింది. తాజాగా వత్తుల మిషన్ పేరిట మరో సంస్థ మోసానికి పాల్పడింది. వత్తుల మిషన్లను బాధితులకు అంటగట్టి వారి నుంచి డిపాజిట్లు సేకరించారు. ఆ వత్తులు మళ్లీ తమకే అమ్మాలని నమ్మించారు. మొదట రెండు, మూడు నెలలు డబ్బులు సజావుగానే ఇచ్చారని బాధితులు చెబుతున్నారు. ఈ వత్తుల మిషన్ ద్వారా నెలకు రూ.30 నుంచి 50 వేలు సంపాదించవచ్చని బాధితులను నమ్మించారు. ఇందుకోసం యూట్యూబ్ లో బాలా స్వామిగౌడ్ వీడియోలు కూడా అప్లోడ్ చేశారని బాధితులు చెబుతున్నారు. ఒక్కో మిషన్ రూ.1.70 లక్షలకు కొనుగోలు చేశామని బాధితులు చెబుతున్నారు. మిషన్ తో పాటు ఒక్కొక్కరికీ 50 నుంచి 100 కేజీల దూది కూడా ఇచ్చారని చెబుతున్నారు. వత్తులు మళ్లీ బాలాస్వామి గౌడ్ కొంటామని చెప్పడంతో బాధితులు పూర్తిగా నమ్మారు. చాలా మంది మిషన్లు కొని వత్తులు చేయడం మొదలుపెట్టారు. ఒకరిద్దరికి డబ్బులు రావడంతో మరికొంత మంది మిషన్లకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. గత కొంతకాలంగా వత్తులు కొనడానికి రాకపోవడం, అడ్వాన్స్ ఇచ్చిన వాళ్లకు మిషన్లు ఇవ్వకపోవడంతో బాధితులు అనుమానం వచ్చింది. తీరా ఆరా తీస్తే సదరు సంస్థ బోర్డు తిప్పేసినట్లు తెలుస్తోంది. దిక్కులేదు.. అడ్వాన్స్ డబ్బులిచ్చినోళ్లకు మిషన్ల లేవు. ఫోన్లు చేస్తే అప్పుడిస్తామని..ఇప్పుడిస్తామంటూ సాగదీస్తున్నారని ఆరోపించారు. దీంతో మోస పోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 800 మంది బాధితులు  మోస పోయినట్టు తెలుస్తోంది. దీంతో లబోదిబోమని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Salman Khan Revanth Reddy: హాట్ టాపిక్ అవుతున్న సల్మాన్ ఖాన్, రేవంత్ రెడ్డి భేటీ - ఇదెప్పుడు జరిగింది?
హాట్ టాపిక్ అవుతున్న సల్మాన్ ఖాన్, రేవంత్ రెడ్డి భేటీ - ఇదెప్పుడు జరిగింది?
Begging banned in AP:  ఏపీలో భిక్షాటనకు పూర్తి నిషేధం - బెగ్గర్లకు పునరావాసం- చట్టం అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
ఏపీలో భిక్షాటనకు పూర్తి నిషేధం - బెగ్గర్లకు పునరావాసం- చట్టం అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
500 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతోంది: కేటీఆర్
500 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతోంది: కేటీఆర్
IND vs AUS 2nd T20 Highlights:బుమ్రా-చక్రవర్తి శ్రమ విఫలం, అభిషేక్ అర్ధ సెంచరీ వృథా; రెండో T20లో 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం
బుమ్రా-చక్రవర్తి శ్రమ విఫలం, అభిషేక్ అర్ధ సెంచరీ వృథా; రెండో T20లో 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం
Advertisement

వీడియోలు

వేస్ట్ కెప్టెన్ పీకేయాలి అన్నారు.. అవసరమైన చోట అదరగొట్టేసింది..!
ఏసయ్యే నన్ను నడిపించాడు.. విక్టరీ తర్వాత కన్నీళ్లతో జెమీమా
ఫైటింగ్ సెంచరీతో ఫైనల్ బెర్త్ తెచ్చింది..  పిచ్ మీద పడి చిన్నపిల్లలా ఏడ్చింది
పనికిరాదని పక్కన కూర్చోబెట్టారు.. పోరాడి ఫైనల్‌కి తీసుకెళ్ళింది
వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా.. దశాబ్దాల కలకి అడుగు దూరంలో..
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Salman Khan Revanth Reddy: హాట్ టాపిక్ అవుతున్న సల్మాన్ ఖాన్, రేవంత్ రెడ్డి భేటీ - ఇదెప్పుడు జరిగింది?
హాట్ టాపిక్ అవుతున్న సల్మాన్ ఖాన్, రేవంత్ రెడ్డి భేటీ - ఇదెప్పుడు జరిగింది?
Begging banned in AP:  ఏపీలో భిక్షాటనకు పూర్తి నిషేధం - బెగ్గర్లకు పునరావాసం- చట్టం అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
ఏపీలో భిక్షాటనకు పూర్తి నిషేధం - బెగ్గర్లకు పునరావాసం- చట్టం అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
500 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతోంది: కేటీఆర్
500 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతోంది: కేటీఆర్
IND vs AUS 2nd T20 Highlights:బుమ్రా-చక్రవర్తి శ్రమ విఫలం, అభిషేక్ అర్ధ సెంచరీ వృథా; రెండో T20లో 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం
బుమ్రా-చక్రవర్తి శ్రమ విఫలం, అభిషేక్ అర్ధ సెంచరీ వృథా; రెండో T20లో 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం
Madalasa Sharma : ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్! - 17 ఏళ్లకే వదిలేసి వెళ్లిపోవాలనుకున్నా... హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్! - 17 ఏళ్లకే వదిలేసి వెళ్లిపోవాలనుకున్నా... హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
Telangana Congress: మంత్రి పదవులు ఆశించిన వారికి ఇతర పదవులు - రాజగోపాల్ రెడ్డికి అక్కడా నిరాశే !
మంత్రి పదవులు ఆశించిన వారికి ఇతర పదవులు - రాజగోపాల్ రెడ్డికి అక్కడా నిరాశే !
వేస్ట్ కెప్టెన్ పీకేయాలి అన్నారు  అవసరమైన చోట అదరగొట్టేసింది..!
వేస్ట్ కెప్టెన్ పీకేయాలి అన్నారు అవసరమైన చోట అదరగొట్టేసింది..!
New Rules From November 1:బ్యాంకింగ్ రూల్స్ నుంచి ఆధార్ వరకు నవంబర్ నుంచి వస్తున్న 5 పెద్ద మార్పులు ఇవే!
బ్యాంకింగ్ రూల్స్ నుంచి ఆధార్ వరకు నవంబర్ నుంచి వస్తున్న 5 పెద్ద మార్పులు ఇవే!
Embed widget