search
×

LIC Pay Direct: ఎల్‌ఐసీ ప్రీమియం ఆన్‌లైన్‌లో చెల్లిస్తున్నారా? యాప్‌ను ఇలా వినియోగిస్తే బెటర్‌!

ఎల్‌ఐసీ కొవిడ్ నేపథ్యంలో ఆన్లైన్లో డబ్బులు చెల్లించేలా వినియోగదారులను ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం మొబైల్‌ యాప్‌ 'LIC Pay Direct' (ఎల్‌ఐసీ పే డైరెక్ట్‌) వినియోగించాలని సూచిస్తోంది.

FOLLOW US: 
Share:

కొవిడ్‌-19 మహమ్మారి వల్ల అనేక రంగాలు డీలా పడ్డాయి. పర్యాటక రంగం వంటివైతే పూర్తిగా కుదేలయ్యాయి. కొన్నింట్లో మాత్రం ఊహించలేనంత వృద్ధి నమోదైంది. బ్యాంకింగ్‌, బీమా, ఆన్‌లైన్‌, ఇంటర్నెట్‌ సేవలు, యూపీఐ, ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో వృద్ధిరేటు మాత్రం అమాంతం పెరిగింది.

ఇదే సమయంలో ఆన్‌లైన్‌లో బీమా తీసుకోవడం, ప్రీమియం చెల్లించడం పెరిగింది.  ప్రభుత్వ రంగ బీమా సంస్థైన భారతీయ జీవిత బీమా (ఎల్‌ఐసీ) సైతం ఆన్‌లైన్‌లోనే డబ్బులు చెల్లించేలా వినియోగదారులను ప్రోత్సహించింది. ఇందుకోసం మొబైల్‌ యాప్‌ 'LIC Pay Direct' (ఎల్‌ఐసీ పే డైరెక్ట్‌) వినియోగించాలని సూచించింది.

ఇది ఎల్‌ఐసీ అధీకృత యాప్‌ కావడంతో వినియోగించేందుకు భయం అవసరం లేదు! ఈ యాప్‌ను ఉపయోగించి ప్రీమియం చెల్లించి రిసిప్ట్‌ను ముద్రించుకోవద్దు.

Also Read: Hiring sentiment improves: పండగల వేళ ఉద్యోగ నియామకాల హేళ..! పెరగనున్న జీతాలు..!

ఎల్‌ఐసీ పే డైరెక్ట్‌ యాప్‌ను ఎలా ఉపయోగించాలంటే..

1. మొదట గూగుల్‌ ప్లే స్టోర్‌కి వెళ్లి ఎల్‌ఐసీ పే డైరెక్ట్‌ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
2. ఆ తర్వాత యాప్‌ను ఓపెన్‌ చేసి 'పే ప్రీమియం' ఆప్షన్‌ను ఓపెన్‌ చేయాలి. అప్పుడు యాప్‌లో ప్రీమియం పేమెంట్‌ స్క్రీన్‌ తెరచుకుంటుంది.
3. ఇప్పుడు ఆ స్క్రీన్‌లో సూచించిన విధంగా చేయాలి.
4. మీ పాలసీ సంఖ్య, ప్రీమియం, పుట్టిన తేదీ, మెయిల్‌ ఐడీ వంటి వివరాలను తెలియజేయాల్సి  ఉంటుంది.
5. వివరాలను పూర్తిగా నింపిన తర్వాత వాటన్నిటినీ సరి చూసుకోవాలి. ఆ తర్వాత పేమెంట్‌ బటన్‌పై నొక్కాలి.
6. ఇప్పుడు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా డబ్బులు చెల్లించాలి.
7. డబ్బులు చెల్లించాక ఎలక్ట్రానిక్‌ పేమెంట్‌ రిసిప్ట్‌ మీ మెయిల్‌ ఐడీకి వస్తుంది.

ఇలా మీరు ఎల్‌ఐసీ పే డైరెక్ట్‌ యాప్ ఉపయోగించి ఆన్‌లైన్‌లోనే నిశ్చింతంగా ప్రీమియం చెల్లించొచ్చు.

Also Read: JioBook Laptop: జియో చ‌వ‌కైన ల్యాప్ టాప్ వ‌చ్చేస్తుంది.. ఫీచ‌ర్లు కూడా లీక్!

లిస్టింగ్‌పై ఉద్యోగులకు హెచ్చరిక!


ఆర్థికంగా తిరుగులేని సంస్థ కావడంతో ఎల్‌ఐసీ లిస్టింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. షేరు ధర ఎలా ఉండబోతోంది? ఎప్పుడు లిస్టింగ్‌కు వస్తుంది? ఆఫర్‌ విలువ ఏంటి? వంటి వివరాల కోసం మదుపర్లు ఎదురు చూస్తున్నారు. కాగా ఐపీవో, ధర, లిస్టింగ్‌, విలువ గురించి బహిరంగంగా మాట్లాడొద్దని తమ ఉద్యోగులను ఎల్‌ఐసీ హెచ్చరించింది.  సంబంధిత వ్యవహారంపై  ఎల్‌ఐసీ ఛైర్మన్‌, నలుగురు మేనేజింగ్‌ డైరెక్టర్లు మాత్రమే మీడియాకు వివరాలు చెబుతారని స్పష్టం చేసింది.

Also Read: IPL 2021: ఎరుపు రంగు నుంచి నీలి రంగు జెర్సీకి మారిన ఆర్‌సీబీ.. ఎందుకో తెలుసా?

Published at : 14 Sep 2021 04:12 PM (IST) Tags: Life Insurance Corporation LIC Pay Direct LIC Online premium payment

ఇవి కూడా చూడండి

Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?

Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?

LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!

LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!

New Rules Change : ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు!

New Rules Change : ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు!

కొత్త సంవత్సరం మొదటి రోజే షాక్ ఇచ్చిన బంగారం, వెండి! జనవరి 1 2026న మీ నగరంలో తాజా రేటు తెలుసుకోండి

కొత్త సంవత్సరం మొదటి రోజే షాక్ ఇచ్చిన బంగారం, వెండి! జనవరి 1 2026న మీ నగరంలో తాజా రేటు తెలుసుకోండి

Year Ender 2025: పాతికేళ్లలో బంగారం కంటే భారీగా వెండి వృద్ధి; రూ.7,900 నుంచి రూ.2.4 లక్షల వరకు!

Year Ender 2025: పాతికేళ్లలో బంగారం కంటే భారీగా వెండి వృద్ధి; రూ.7,900 నుంచి రూ.2.4 లక్షల వరకు!

టాప్ స్టోరీస్

Amaravati Land Pooling: అమరావతి లో రెండోదశ పూలింగుకు ఏర్పాట్లు- ఏడు గ్రామాల్లో తొమ్మిది యూనిట్లు రెడీ

Amaravati Land Pooling: అమరావతి లో రెండోదశ పూలింగుకు ఏర్పాట్లు-  ఏడు గ్రామాల్లో తొమ్మిది యూనిట్లు రెడీ

Eluru Crime News: లవ్ మ్యారేజ్.. 18 గంటల్లో యువతి కిడ్నాప్ కేసు సుఖాంతం, నిందితుల అరెస్ట్.. ఏలూరులో ఘటన

Eluru Crime News: లవ్ మ్యారేజ్.. 18 గంటల్లో యువతి కిడ్నాప్ కేసు సుఖాంతం, నిందితుల అరెస్ట్.. ఏలూరులో ఘటన

CM Revanth Reddy: అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు

CM Revanth Reddy:  అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు

Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?

Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?