search
×

EPF Interest: కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం.. ఈపీఎఫ్ ఖాతాల్లోకి నగదు జమ అయ్యేది ఎప్పుడంటే..!

6 కోట్లకు పైగా ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ఆర్థిక శాఖ శుభవార్త చెప్పింది. వడ్డీ నగదును ఈఫీఎఫ్ ఖాతాల్లో జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

FOLLOW US: 
Share:

EPF interest: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పీఎఫ్ నగదుకు సంబంధించిన వడ్డీలపై కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. 2020-21కి గానూ రావాల్సిన ఈపీఎఫ్ వడ్డీని త్వరలోనే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనుంది. తద్వారా 6 కోట్లకు పైగా ఈపీఎఫ్ ఖాతాదారులైన ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. 

ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ప్రకటించడం తెలిసిందే. తాజాగా ఈపీఎఫ్ఓ   ఖాతాదారులకు దీపావళికి ముందే వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర కార్మిక శాఖ ఈపీఎఫ్ వడ్డీని త్వరలోనే జమ చేయనుందని ఆ శాఖ కార్యదర్శి సునీల్ బర్త్‌వాల్ వెల్లడించారు. దీపావళి పండుగ సమయంలో ప్రతి ఏడాది కేంద్ర కార్మిక శాఖ, ఈపీఎఫ్ఓలు పీఎఫ్ ఖాతాదారులు నెలాఖరులోగా వడ్డీ నగదు అందుకోనున్నారు. ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ చేయడంపై గత కొన్ని రోజులుగా ఆర్థికశాఖ ఉన్నతాధికారులు సమావేశమవుతున్నారు. 

Also Read: సేవింగ్స్‌ ఖాతాలపై 7 శాతం వడ్డీ కావాలా..! ఈ బ్యాంకుల్లో ఇస్తున్నారు

కరోనా కష్ట కాలంలో ఈపీఎఫ్ ఖాతాలలో ఉద్యోగుల నగదుపై చెల్లించే వడ్డీని తగ్గిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఈపీఎఫ్ఓ, కేంద్ర కార్మికశాఖ సమావేశమై వడ్డీ రేటును 8.5 శాతంగా యథాతథంగా ఉంచాలని నిర్ణయం తీసుకుంది. కనుక ఈపీఎఫ్ ఖాతాదారులుగా ఉన్న 6 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు గత ఏడాది లభించిన వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్ ఖాతాల్లో పొందనున్నారు. 

ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఈ విధానాల్లో తెలుసుకోండి..
ఎస్ఎంఎస్ ద్వారా..
యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ద్వారా ఈపీఎఫ్ ఖాతాదారులు తమ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఒక్క మెస్సేజ్ ద్వారా ఖాతాదారులకు పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు రిజిస్టర్డ్ మొబైల్‌కు వస్తాయి. EPFOHO UAN ENG  అని 7738299899  మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి మెస్సేజ్ చేయాలి. పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్, చివరి ఇన్‌స్టాల్ మెంట్ వివరాలు అందుతాయి.

Also Read: క్రెడిట్‌ కార్డుపై రుణమా.. యమ డేంజర్‌! ఈ విషయాలు తెలుసుకున్నాకే తీసుకోండి!

మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్..
ఈపీఎఫ్ బ్యాలెన్స్ మిస్డ్ కాల్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. ఈపీఎఫ్ ఖాతాలో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ నుంచి 011-22901406  నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఈపీఎఫ్ ఖాతా వివరాలు తెలుసుకోవచ్చు. అయితే యూఏఎన్ నెంబర్, కేవైసీ లింక్ చేసి ఉన్న వారికి మాత్రమే పీఎఫ్ వివరాలు అందుతాయని ఈపీఎఫ్ఓ పేర్కొంది.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 29 Oct 2021 08:51 PM (IST) Tags: EPFO Provident Fund PF Interest Rate PF Interest EPF Interest Rate How To Check PF Balance Employees Provident Fund Organization EPF interest

ఇవి కూడా చూడండి

YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే

YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే

Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?

Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?

Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది

Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది

Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా

Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా

Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?

Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?

టాప్ స్టోరీస్

Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!

Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!

Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు

Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు

Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన