అన్వేషించండి

Mahanadu 2022 Updates: అమరావతిని నాశనం చేశారు! ఏ పాపం చేసింది? పోలవరం కాపాడలేని అసమర్థులు - చంద్రబాబు

Mahanadu Ongole: మహానాడు వేదికపై చంద్రబాబు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దూరదృష్టి లేకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని అన్నారు.

Chandrababu on Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిందని, ప్రజలంతా బాధల్లో ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు. అందుకు దశ, దిశ నిర్దేశించే స్థలం ఈ మహానాడు అని చంద్రబాబు చెప్పారు. మహానాడు వేదికపై చంద్రబాబు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దూరదృష్టి లేకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని అన్నారు. అమరావతిని నాశనం చేశారని, తాము పోలవరాన్ని 72 శాతం పూర్తి చేస్తే దాన్ని కూడా కాపాడలేని అసమర్థులు అని ధ్వజమెత్తారు.

మహానాడు వేదికపై చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌ను నాలెడ్జ్ ఎకానమీగా చేశాం. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని దూరదృష్టితో పనులు చేపడుతుంటాను. అదే క్రమంలో జోనోమ్ వ్యాలీని ఆనాడు ప్రారంభించాను. ఇప్పుడు ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ అక్కడి నుంచే వచ్చింది. మొత్తానికి హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడం ద్వారా ఇప్పుడు ఆ ఫలితాలను తెలంగాణ అనుభవిస్తోంది. అలాగే రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏపీలో విజన్ 2029 ప్రవేశపెట్టి ఆ దిశగా విధానాలు రూపొందించాం. అమరావతి కోసం పైసా ఖర్చు లేకుండా ప్రపంచంలోనే తొలిసారిగా 33 వేల ఎకరాలు సేకరించాం. అలాంటి అమరావతిని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. అమరావతి ఏం పాపం చేసింది? దాదాపు రెండు నుంచి మూడు లక్షల కోట్ల రూపాయల సంపద మొత్తం నాశనం చేసేశారు.’’ అని చంద్రబాబు ఆవేదన చెందారు.

పోలవరం కాపాడలేని అసమర్థ ప్రభుత్వం: చంద్రబాబు
‘‘పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లిచ్చే అవకాశం ఉంటుంది. చట్ట ప్రకారం దీనికి కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. దాని ప్రకారం మేము 72 శాతం పనులు పూర్తి చేశాం. ఈ దుర్మార్గులు అధికారంలోకి వచ్చి రివర్స్ టెండరింగ్ అంటూ అమలు చేశారు. ఆ పనులకు డయాఫ్రం వాల్ కోట్టుకుపోయింది. పోలవరంలో అతి కీలకమైన డయాఫ్రం వాల్ పూర్తి చేసి, జాగ్రత్తగా పనులు పూర్తి చేశాం. దాన్ని కూడా కాపాడలేక అది కొట్టుకుపోయేలా చేశారు. అది ఎటు కొట్టుకుపోయిందో కూడా తెలియదు. ఇలాంటి అసమర్థ ప్రభుత్వం ఉంది. అసలు జగన్ కు పోలవరం గురించి ఏం తెలుసు? కనీసం కాపర్ డ్యామ్, డయాఫ్రం వాల్, స్పిల్ వే అంటే జగన్ కు తెలుసా?’’

వచ్చేది వర్షాకాలం.. ఇక రోడ్లపై చేపలు పట్టుకోవచ్చు!
‘‘రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఏంటి? మేం 25 వేల కిలో మీటర్ల మేర సిమెంట్ రోడ్లు వేస్తే మీరు వేసింది 2 కిలో మీటర్లు. 33 లక్షల ఇళ్లు కడతామని చెప్పి మీరు కట్టింది 3 ఇళ్లు. ఇంత అసమర్థ స్థితిలో ఉండి మీరు మాకు నీతులు చెప్తున్నారు. ప్రధాన రహదారులు సహా రోడ్లపై అంతా గుంతలు పడిపోతే మీరు తట్ట మట్టి అయినా వేశారా? ప్రశ్నిస్తే కేసులు! ఈ కేసులు మమ్మల్ని ఏమీ చేయలేవు. మళ్లీ వర్షాకాలం వస్తోంది. ఇక రోడ్లపై చేపలు పట్టుకోవచ్చు లేదా వరి నాట్లు వేసుకోవచ్చు! రోడ్ల విషయంలో ఏంటి ఈ అరాచకం?’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gaddar Film Awards: జూన్ 14న తెలంగాణలో గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సం- భట్టి విక్రమార్క, దిల్ రాజు
జూన్ 14న తెలంగాణలో గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సం- భట్టి విక్రమార్క, దిల్ రాజు
UPSC Results : యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
Glod Price Rs 1 Lakh: బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
Ram - Bhagyashri Borse: రామ్ ప్రేమలో భాగ్యశ్రీ... ఎంగేజ్మెంట్ జరిగిందా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
రామ్ ప్రేమలో భాగ్యశ్రీ... ఎంగేజ్మెంట్ జరిగిందా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Gujarat Titans Winning Strategy IPL 2025 | టాప్ లో ఉంటే చాలు..ఇంకేం అవసరం లేదంటున్న గుజరాత్ టైటాన్స్Trolling on Ajinkya Rahane vs GT IPL 2025 | బ్యాటర్ గా సక్సెస్..కెప్టెన్ గా ఫెయిల్..?GT vs KKR IPL 2025 Match Review | డిఫెండింగ్ ఛాంపియన్ దమ్ము చూపించలేకపోతున్న KKRSai Sudharsan 52 vs KKR IPL 2025 | నిలకడకు మారు పేరు..సురేశ్ రైనా ను తలపించే తీరు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gaddar Film Awards: జూన్ 14న తెలంగాణలో గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సం- భట్టి విక్రమార్క, దిల్ రాజు
జూన్ 14న తెలంగాణలో గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సం- భట్టి విక్రమార్క, దిల్ రాజు
UPSC Results : యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
Glod Price Rs 1 Lakh: బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
Ram - Bhagyashri Borse: రామ్ ప్రేమలో భాగ్యశ్రీ... ఎంగేజ్మెంట్ జరిగిందా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
రామ్ ప్రేమలో భాగ్యశ్రీ... ఎంగేజ్మెంట్ జరిగిందా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
IPS PSR Anjaneyulu arrested: నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలింపు
నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలింపు
Viral Video: ఫోన్ తీసుకుందని లెక్చరర్‌కి చెప్పుతో కొట్టిన స్టూడెంట్ -  ఈ చదువులేం నేర్పుతున్నాయి ?
ఫోన్ తీసుకుందని లెక్చరర్‌కి చెప్పుతో కొట్టిన స్టూడెంట్ - ఈ చదువులేం నేర్పుతున్నాయి ? వీడియో
Mahesh Babu: మహేష్ బాబు వెనుక డైనోసార్లు పరిగెడితే... మైండ్ బ్లాక్ అయ్యేలా రాజమౌళి సినిమాలో యాక్షన్ ఎపిసోడ్!
మహేష్ బాబు వెనుక డైనోసార్లు పరిగెడితే... మైండ్ బ్లాక్ అయ్యేలా రాజమౌళి సినిమాలో యాక్షన్ ఎపిసోడ్!
AP Liquor Scam Case: నాతో పెట్టుకోవద్దు... బట్టలు విప్పిస్తా !: విజయసాయిరెడ్డి మాస్ వార్నింగ్
నాతో పెట్టుకోవద్దు... బట్టలు విప్పిస్తా !: విజయసాయిరెడ్డి మాస్ వార్నింగ్
Embed widget