అన్వేషించండి

Memories Of Nellore City: నెల్లూరులో వెంకయ్య నాయుడు పెన్నులు ఎక్కడ కొనేవారో తెలుసా?

సుబ్రహ్మణ్యం పెన్ కార్నర్ సృష్టికర్త. అప్పట్లో మద్రాస్ లో కేవలం పెన్నులకు ఓ షాపు ఉండటం గమనించిన ఆయన.. అలాంటిదే నెల్లూరులో పెట్టాలనుకున్నారు. నెల్లూరులోని ట్రంక్ రోడ్ లో 1945లో దాన్ని స్థాపించారు.

ఐదు పదేళ్ల తర్వాత ఏదైనా ఊరికెళ్లి చూస్తే అంతా కొత్తగా ఉంటుంది. భలే మారిపోయిందే అనుకుంటాం. ఇళ్లు, షాపులు, వ్యాపార సంస్థలు.. అన్నిట్లో మార్పు సహజం. అలాంటిది 73 ఏళ్ల తర్వాత నెల్లూరులో ఒకే ఒక్క షాపు ఏమాత్రం మారకుండా అలాగే ఉంది. దాని పేరు పెన్ కార్నర్. కేవలం పెన్నులు మాత్రమే అమ్ముతారక్కడ. తరాలు మారినా, కాలం మారినా.. అక్కడ ఇప్పటికీ పెన్నులు మాత్రమే అమ్ముతున్నారు. 

ఆ పాత జ్ఞాపకాలు.. 
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విద్యార్థిగా ఉన్నప్పుడు ఆ షాపుకే వచ్చి పెన్నులు కొనేవారట. ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన సోదరుడు వివేకానందరెడ్డి, వారి కుటుంబ సభ్యులందరికీ అక్కడే పెన్నులు కొనడం అలవాటు. అంతేకాదు ఆ షాపుతో అనుబంధం ఉన్న చాలామంది ఇప్పుడు దేశ విదేశాల్లో ఉన్నారు. ఎక్కడెక్కడో వ్యాపారాల్లో స్థిరపడ్డారు. ఎప్పుడైనా నెల్లూరుకి వస్తే ఇదిగో ఈ షాపులోనే చిన్నప్పుడు తాము కలం ఖరీదు చేసేవాళ్లం అంటూ మనవళ్లకు, మనవరాళ్లకు చెప్పుకుని పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. 

మద్రాస్ ఇన్స్ పిరేషన్.. 
చక్రాల సుబ్రహ్మణ్యం ఈ పెన్ కార్నర్ సృష్టికర్త. అప్పట్లో మద్రాస్ లో కేవలం పెన్నులకు ఓ షాపు ఉండటం గమనించిన ఆయన.. అలాంటిదే నెల్లూరులో పెట్టాలనుకున్నారు. నెల్లూరులోని ట్రంక్ రోడ్ లో 1945లో దాన్ని స్థాపించారు. ఆ తర్వాత ఆయన కొడుకు చక్రాల జయదేవ్ దాన్ని కొనసాగిస్తున్నారు. తన స్నేహితులంతా వివిధ ఉద్యోగాల్లో స్థిరపడినా, తండ్రికిచ్చిన మాటకోసం తాను మాత్రం ఇంకా పెన్ కార్నర్ నడుపుతున్నానని అంటారు జయదేవ్. తన తర్వాత పెన్ కార్నర్ నిర్వహణ సాధ్యం కాదేమోనని, పిల్లలు సాఫ్ట్ వేర్ రంగంలో స్థిరపడ్డారని ఒకింత బాధగా చెబుతారు. 


Memories Of Nellore City: నెల్లూరులో వెంకయ్య నాయుడు పెన్నులు ఎక్కడ కొనేవారో తెలుసా?

అబ్బో ఎన్నిరకాలో.. 
అప్పట్లో పెన్నులన్నీ ముంబై నుంచి తయారై వచ్చేవి. మొదట్లో ఇంకు పెన్నులు, ఆ తర్వాత చెక్కతో తయారు చేసిన రీఫిల్ పెన్నులు, ఇప్పుడు ప్లాస్టిక్ పెన్నులు ఇలా రూపాంతరం చెందాయి. హీరో, పార్కర్, బ్రహ్మం, రత్నం అనే పెన్స్ ఉండేవి అప్పట్లో.  పైలట్, రైటర్, స్వామ్ అనే కంపెనీలు కూడా ఇంకు పెన్నుల్ని ఉత్పత్తి చేసేవి. గోల్డ్ నిబ్స్ అంటే బంగారంతో చేసిన పాళీతో తయారైన పెన్నులు అప్పట్లో బాగా ఫేమస్. ఆరోజుల్లోనే 100నుంచి 120 రూపాయలు ఆ పెన్ను ఖరీదు. ఒకసారి బంగారం నిబ్ పెన్ను కొంటే.. జీవితాంతం దాంతో రాయొచ్చట. ఇప్పట్లో బట్టల షాపింగ్ లాగే అప్పట్లో పెన్స్ చూసి కొనుక్కునేవారు. పెన్నుల షాపింగ్ కోసం గంట, గంటన్నర సమయాన్ని వెచ్చించేవారు. 


Memories Of Nellore City: నెల్లూరులో వెంకయ్య నాయుడు పెన్నులు ఎక్కడ కొనేవారో తెలుసా?

తయారీ, రిపేర్ వర్క్.. 
పెన్నులు ముంబై నుంచి తెచ్చి అమ్మడంతోపాటు.. నెల్లూరులోనే చెక్క పెన్నుల్ని తయారు చేసేవారు. పెన్నులను రిపేర్ కూడా చేసేవారు. ఇద్దరు మనుషుల్ని పెన్నుల తయారీకి, మరో ఇద్దర్ని పెన్నుల రిపేర్ కోసం నెల్లూరు పెన్ కార్నర్ లో పనికి కుదుర్చుకున్నారట. 1980 తర్వాత బాల్ పెన్నుల రాకతో పెన్నుల ఇండస్ట్రీలో కొత్త విప్లవం వచ్చిందని చెబుతారు జయదేవ్. రెడ్ లీఫ్ పేరుతో మొదట్లో బాల్ పెన్స్ వచ్చాయి. ఆ తర్వాత విల్సన్, రెనాల్డ్స్ కంపెనీలు జతచేరాయి. 


Memories Of Nellore City: నెల్లూరులో వెంకయ్య నాయుడు పెన్నులు ఎక్కడ కొనేవారో తెలుసా?

1945లో స్థాపించిన పెన్ కార్నర్ ఇంకా అదే పేరుతో, అదే ప్లేస్ లో, అదే కుటుంబ నిర్వహణలో ఉందంటే అతిశయోక్తి అనిపించక మానదు. వ్యాపారం కేవలం సంపాదనకోసం మాత్రమే కాదు, అదో సంతృప్తినిచ్చే వ్యాపకం అని జయదేవ్ లాంటి వారిని చూస్తే తెలుస్తుంది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రేవూరి పేరును రేవంత్ ఎలా ప్రకటిస్తారు? మంత్రి కొండా సురేఖ కుమార్తె సంచలన వ్యాఖ్యలు
రేవూరి పేరును రేవంత్ ఎలా ప్రకటిస్తారు? మంత్రి కొండా సురేఖ కుమార్తె సంచలన వ్యాఖ్యలు
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Vijaya Sai Reddy New Political Party: కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Embed widget