అన్వేషించండి

Har Ghar Tiranga AP : ఏపీలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి - హర్ ఘర్ తిరంగాకు ఘనమైన సన్నాహాలు !

ఏపీలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి సన్నాహాలు కూడా ప్రారంభించారు.

Har Ghar Tiranga :  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆగస్టు 11వ తేదీ నుండి 17వ తేదీ వరకూ రాష్ట్రంలోని ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సమీర్ శర్మ ప్రజలకు పిలుపు నిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా,  దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఆగస్టు 11వ తేదీ నుండి 17వ తేదీ వరకూ 'హర్ ఘర్ తిరంగా'  కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. 

ఆగస్టు 11 నుండి 17 వరకూ ప్రతి ఇంటిపై జాతీయ జెండా !

పంచాయితీ రాజ్,   గ్రామీణాభివృద్ధి శాఖ నోడల్ విభాగంగా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఆదేశించారు.  ప్రతి ఇంటిపైనా ప్రతి ప్రభుత్వ భవనంపైనా ఆగస్టు 11 నుండి 17 వరకూ మువ్వన్నెల జెండా ఎగుర వేసేలా చూడాలన్నారు.  రాష్ట్రంలో 90 లక్షల మందికిపైగా స్వయం సహాయక సంఘాల మహిళలున్నారని వారందరినీ ఈ కార్యక్రమంలో పూర్తిగా భాగస్వాములను చేయాలని చెప్పారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ప్రోత్సహించి నిర్దేశిత నమూనా సైజుతో కూడిన మువ్వన్నెల జెండాను సమకూర్చుకుని ప్రతి ఇంటిపైనా ఎగురవేసేలా చూడాలని  ఆదేశించారు.

ప్రజల్లో అవగాహన కల్పించాలన్న సీఎస్ 

ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేలా ప్రత్యేకంగా లఘ చిత్రాలను రూపొందించి సినిమా ధియేటర్లలో ప్రదర్శించేలా తగిన చర్యలు తీసుకోవాలని సమాచారశాఖ కమీషనర్ విజయకుమార్ రెడ్డిని సిఎస్ ఆదేశించారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాలు,పట్టణాల్లోని ముఖ్య కూడళ్ళలో హోర్డింగ్లు, ప్లెక్సీలను ఏర్పాటు చేయాలని చెప్పారు.రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులపై ప్రత్యేక పెయింటింగ్‌లు వేయడంతో పాటు బ్యానర్లను ఏర్పాటు చేయాలని ఆర్టీసి ఎండిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ఆదేశించారు. 

భారీగా ప్రచారం చేయాలని నిర్ణయం 
 
 ఆగస్టు 11 నుండి 17 వరకూ ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జెండా కార్యక్రమానికి సంబంధించి 20X30 అంగుళాల సైజుతో కూడిన మువ్వన్నెల జెండాను ఎగురవేయాల్సి ఉంటుందని మరో సీనియర్ అధికారి రజత్ భార్గవ చెప్పారు.రాష్ట్రంలో కోటి 26 లక్షల కుటుంబాలున్నాయని ప్రతి ఇంటిపైన ఈ మువ్వన్నెల జెండా ఎగురవేయాల్సి ఉందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని స్వాతంత్రోద్యమం, జాతీయ జెండా తదితర అంశాలపై జాతీయ,స్థానిక మీడియా చానళ్ళు, పత్రికల్లో ప్రత్యేక కధనాలు ప్రసారం,ప్రచురణ జరిగేలా చూడాల్సి ఉందని చెప్పారు.అలాగే విజయవాడ,విశాఖపట్నం తదితర ముఖ్య నగరాల్లో ఈకార్యక్రమానికి సంబంధించి ప్రత్యేక ఈవెంట్లను కూడా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు చెప్పారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Embed widget