TS PGECET Exam: టీఎస్‌ పీజీఈసెట్‌ నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీల వివరాలు..

Continues below advertisement

తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన తెలంగాణ స్టేట్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (టీఎస్ పీజీఈసెట్‌) - 2021 నోటిఫికేషన్ విడుదల అయింది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం టీఎస్ పీజీఈసెట్ దరఖాస్తు ప్రక్రియ ఎలాంటి అపరాధ రుసుము లేకుండా జూలై 5 వరకు కొనసాగనుంది. ఆలస్య రుసుము రూ.250తో జూలై 15 వ తేదీ వరకు, రూ.1000తో జూలై 22 వరకు, రూ.2500తో జూలై 30 వరకు, రూ.5000తో ఆగస్టు 7 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో తెలిపింది. టీఎస్ పీజీఈసెట్ పరీక్షలను ఆగస్టు 11 నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తామని వెల్లడించింది. దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలోనే స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. మరిన్ని వివరాలకు https://pgecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని అభ్యర్థులకు సూచించింది.  


టీఎస్ పీజీఈసెట్ దరఖాస్తుల స్వీకరణ మార్చి 12 నుంచి ప్రారంభమైంది. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో దరఖాస్తు గడువును పలుమార్లు పొడిగించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పేర్కొంది. పీజీఈసెట్ ద్వారా గేట్ జీప్యాట్ విద్యార్థులకు ఎంఈ / ఎంటెక్ / ఎంఫార్మా / ఎంఆర్క్ / గ్రాడ్యుయేట్ లెవల్ ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహిస్తోంది. తెలంగాణ రాష్ట్ర పీజీఈసెట్‌ను 19 (ఫార్మసీతో కలిపి) పేపర్లలో నిర్వహించనున్నారు. అభ్యర్థులు బీటెక్‌లో తాము చదివిన బ్రాంచ్‌ ఆధారంగా సంబంధిత పేపర్లలో పరీక్షకు హాజరయ్యే అవకాశం కల్పిస్తున్నారు. 
ముఖ్యమైన వివరాలు:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (Computer Based Test - CBT) ద్వారా ఎంపిక చేస్తారు. 
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.500, ఇతరులు రూ.1000 చెల్లించాలి. 
దరఖాస్తు చివరి తేది: జూలై 5, 2021 (ఆలస్య రుసుము లేకుండా)
వెబ్‌సైట్‌: https://pgecet.tsche.ac.in/ 
టీఎస్ పీజీఈసెట్ పరీక్షల తేదీ: ఆగస్టు 11 నుంచి 14 వరకు 
పరీక్ష విధానం: ఈ పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు (మల్టిపుల్ చాయిస్) ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ ఉండదు. కటాఫ్ మార్కులు 30గా నిర్ణయించారు. ఎస్సీ / ఎస్టీలకు కటాఫ్ మార్కులు ఉండవు. పరీక్ష రెండు గంటల పాటు నిర్వహిస్తారు. పీజీఈసెట్‌లో అడిగే ప్రశ్నలు అన్నీ కూడా బీటెక్‌ స్థాయిలో ఉంటాయి.  
విద్యార్హతలు: బీటెక్‌ / బీఈ / బీఫార్మసీ / బీఆర్క్‌ కోర్సులు లేదా సంబంధిత పేపర్లకు అర్హతగా నిర్దేశించిన బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సుల్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధించాలి. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola