Telangana Election 2023 News Updates: కామారెడ్డి రైతుల భూములు కాపాడటానికే కేసీఆర్‌పై పోటీ - గెలిపించాలని రేవంత్ విజ్ఞప్తి
కేసీఆర్ మాయమాటలు, కేటీఆర్ నక్కజిత్తులు నమ్మి బీఆర్ఎస్‌కు ( BRS ) ఓటు వేస్తే మోసపోవడం ఖాయం అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను గెలిపిస్తే కామారెడ్డిలో వేల కోట్ల విలువైన భూములను కబ్జా చేస్తారని హెచ్చరించారు. మంగళవారం కామారెడ్డిలో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కామారెడ్డిలో ( Kamareddy ) ఓటుకు రూ.10 వేలు ఇచ్చి ఓట్లను కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ చూస్తోందని ఆరోపించారు.  కేసీఆర్ ఇచ్చే రూ.10 వేలకు ఆశపడి బీఆర్ఎస్‌కు ఓటు వేయవద్దన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వని కేసీఆర్‌కు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


గెలిస్తే విజయ్ యాత్రతో వస్తా లేకుంటే శవయాత్రకు రండీ- బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎమోషనల్‌ స్పీచ్‌
తెలంగాణలో సాయంత్రం ఐదు గంటలతో ప్రచారం ముగియనుంది. దీంతో విజయం కోసం అభ్యర్థులు చేయని ప్రయత్నం లేదు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్ని విధాలుగా ట్రై చేయాలో అన్ని విధాలుగా చేస్తున్నారు. చివరకు ఏమోషనల్‌ అవుతున్నారు. హుజురాబాద్ నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేస్తున్న కౌశిక్ రెడ్డి ఎమోషనల్ అయ్యాడు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. ఫ్యామిలీతో ప్రచారం చేసిన కౌశిక్ రెడ్డి విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. తొలిసారి టికెట్ దక్కించుకున్న కౌశిక్‌ రెడ్డి కచ్చితంగా విజయాన్ని ముద్దాడాలని ఊరూవాడా కాలికి చక్రాలు కట్టుకొని తిరుగుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


తెలంగాణలో హైవోల్టేజ్, ఖరీదైన ఎన్నికలు - ఏపీ ఎన్నికల్లో ఎలా ఉంటుంది ?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడూ ఊహించనంత  హైవోల్టేజ్ పొలిటికల్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సారి మూడు ప్రధాన పార్టీలు తలపడుతున్నాయి. రెండు జాతీయ పార్టీలతో బీఆర్ఎస్ హోరాహోరీ తలపడుతుంది. ఎవరు ముందున్నారు.. ఎవరు వెనుకబడ్డారన్న సంగతి పక్కన పెడితే.. చివరి బాల్  వరకూ విజయం కోసం ప్రయత్నించడమే కీలకం. ఆ దిశగా రాజకీయ పార్టీలు ఎక్కడా తగ్గడం లేదు. పూర్తి స్థాయిలో తమ ఎఫర్ట్స్ పెడుతున్నాయి. ఎప్పటికప్పుడు  ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు కౌంటర్ ఇవ్వడానికి తగ్గడం లేదు. అదే్ సమయంలో ఎలక్షనీరింగ్ విషయంలోనూ తమ సత్తా చూపిస్తున్నాయి. ఇప్పుడు ఎలక్షనీరింగ్ అంటే.. డబ్బులు ఖర్చు  పెట్టడమే. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


అనంతపురంలో బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ! టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై వివాదం
 అనంతపురం నగరంలోని స్థానిక సప్తగిరి సర్కిల్లో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు డిప్యూటీ మేయర్ కోవటం విజయ భాస్కర్ రెడ్డి భూమిపూజ చేశారు.  టిప్పు సుల్తాన్ ట్రస్టు దీన్ని నిర్మిస్తోంది.  బిజెపి, బిజెపి అనుబంధ సంఘాలు ఈ భూమి పూజను తీవ్రంగా వ్యతిరేకించాయి. హిందూ సంస్కృతిని రూపుమాపేందుకు టిప్పు సుల్తాన్ హిందువులపై దాడి చేశారని అలాంటి వ్యక్తి విగ్రహాన్ని నగరంలో ఏర్పాటు చేయడం ఏంటని బిజెపి అనుబంధ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


రాజకీయాల నుంచి తప్పుకుంటా- కవిత సంచలన ప్రకటన
తెలంగాణలో నేటి సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. దీంతో పాటే సవాళ్ల పర్వాలు కూడా పీక్స్‌కు చేరాయి. నిరుద్యోగులతో ముచ్చట్లు చెబుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన సవాల్‌ స్వీకరించాలన్నారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఉద్యోగాల నియామకంలో తెలంగాణ కంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక్క ఉద్యోగమైనా ఎక్కువ ఇచ్చినట్టు నిరూపిస్తూ తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు కవిత. లేకుంటే రాహుల్ గాంధీ కూడా రాజకీయాల నుంచి త‌ప్పుకుంటారా?  అందుకు సిద్ధ‌మా...? అని ఛాలెంజ్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి