అన్వేషించండి

Robots Into SLBC Tunnel: రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం

Robots Join SLBC search operation | ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లోపల గల్లంతైన మిగిలిన 7 మంది కోసం రోబోలు రంగంలోకి దిగాయి. రెస్క్యూ టీమ్ తో కలిసి రోబోలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.

SLBC Tunnel Rescue Operation | నాగర్ కర్నూలు: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం (SLBC Tunnel) లో గల్లంతైన వారి కోసం సహాయక చర్యల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మొన్నటివరకు జీపీఆర్ పరికరాలు, స్నిఫర్ డాగ్స్, ఆపై కేరళ నుంచి రప్పించిన కెడావర్ డాగ్స్ రంగంలోకి దిగినా అంత ప్రయోజనం కనిపించలేదు. తాజాగా మంగళవారం నాడు రోబోలు రంగంలోకి దిగాయి. టన్నెల్ లో చిక్కుకున్న వారి ఆచూకీ గుర్తించేందుకు రోబోల ద్వారా అన్వేషిస్తున్నారు. 100 మందితో కూడిన రెస్క్యూ టీమ్ టన్నెల్ లోపలికి వెళ్లి గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. 

ఇటీవల రోబోల విషయం ప్రస్తావించిన రేవంత్ రెడ్డి

టన్నెల్ లోపల 8 మంది చిక్కుకోగా, ఇప్పటివరకూ ఒక్క మృతదేహం మాత్రమే వెలికి తీశారు. అది కూడా కెడావర్ డాగ్స్ రంగంలోకి దిగిన రెండు, మూడు రోజులకు స్పాట్స్ గుర్తించాక.. అక్కడ తవ్వకాలు చేపడితే టన్నెల్ బోరింగ్ మెషిన్ ఆపరేటర్ గా చేసిన గురుప్రీత్ మృతదేహం లభ్యమైంది. నేడు 18వ రోజు మిగతా ఏడుగురి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే పది రోజుల కిందటే సీఎం రేవంత్ రెడ్డి రోబోల వినియోగానికి ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే అందుకు ఉత్తర్వులు కూడా జారీ చేస్తామని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పరిశీలించిన అనంతరం ఇటీవల అధికారులతో అన్నారు.

తెలంగాణలో సంచలనం రేపిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనలో గల్లంతైన వారి ఆచూకీ ఇంకా లభ్యం కావడం లేదు. లక్షల ఎకరాలకు సాగునీరు, వందల గ్రామాలకు తాగునీరు అందించేందుకు 2005లో అప్పటి సీఎం వైఎస్సార్ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టు చేపట్టారు. మొత్తం 44 కిలోమీటర్ల పొడవు సొరంగం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి రెండు దశాబ్దాలు పూర్తయినా 35 మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. త్వరగా మిగతా పనులు పూర్తి చేసి సాగునీరు, తాగునీరు అందించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావించింది. ఫిబ్రవరి 18న టన్నెల్ లో పనులు తిరిగి ప్రారంభం కాగా, 22వ తేదీన ఉదయం టన్నెల్ లోపల పైకప్పు కూలిపోవడంతో విషాదం చోటుచేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలంలో దోమలపెండ సమీపంలో టన్నెల్ పైకప్పు కూలింది.

నిరంతరం శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్స్

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ ఎప్పటికప్పడూ టన్నెల్ వద్ద పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ర్యాట్ మైనర్స్, సింగరేణి మైన్స్ రెస్క్యూ టీం, దక్షిణ మధ్య రైల్వే, కేరళ కెడావర్ డాగ్స్ స్క్వాడ్, తాజాగా రోబోలు సైతం రెస్క్యూ టీంలో చేరి సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. 13 కిలోమీటర్ల వరకు తవ్వకాలు పూర్తి కాగా, లోపల నుంచి నీళ్లు ఊట ఊరడంతో బురద పేరుకుపోయి సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు తెలిపారు. కెడావర్ డాగ్స్, రోబోల ద్వారా ఏమైనా డెత్ స్పాట్స్ గుర్తిస్తే అక్కడ జాగ్రత్తగా తవ్వకాలు జరిపి, ముక్కలు కాకుండా మృతదేహాలను టన్నెల్ నుంచి వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల వెలికితీసిన గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని పంజాబ్ తరలించారు. అతడి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
Dhurandhar 2 Collections : 700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
Rangareddy Crime News: సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
Embed widget